కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…

తంగళ్ళపల్లి  నేటిదాత్రి

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జై బాపు. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమంలో భాగంగా బద్దెనపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి చౌరస్తా నుండి గ్రామం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరిగిందని.

ఏఐసీసీ టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించన అప్పటినుండి దేశ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎస్టి బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని .

దేశం గురించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని దేశం గురించి ప్రాణాలు అర్పించారని అలాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత బీజేపీ పాలనలో రాజ్యాంగాన్ని అస్య హాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని.

రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రజలకు వివరిస్తూ పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందని ఇప్పుడున్న.

 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల గురించి ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడమే కాకుండా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని.

 

ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పలు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీల ను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు మహిళ నాయకులు మైనార్టీ నాయకులు సీనియర్ నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ.

సిరిసిల్ల పట్టణంలోని రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణంలోని వివిధ రేషన్ షాపులలో ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమం
ఈరోజు 25 వ వార్డులో గల రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ ఉదయం 10 గంటలకు 25 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి తాడికొండ శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి రవి, కాంగ్రెస్ నాయకులు బిల్ల శేషాద్రి,పాషికంటి శ్రీధర్,ఉప్పుల సంజు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పేదలందరికీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు నిరంతరం ఇలాగే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కాంగ్రెస్ నాయకులను కోరారు.

సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి.

సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి

వన్య ప్రాణులకు విద్యార్థులకు రక్షణ కరువు

బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం కేంద్రంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఏమాత్రం సిగ్గున్న వెంటనే హెచ్సీయూ భూములు అమ్మకాన్ని వెనక్కి తీసుకో వాలని డిమాండ్ చేస్తున్నాం 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దని ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నాడని రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ కూతాటి రమేష్ బిఆర్ ఎస్ యూత్ జిల్లా నాయ కులు పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి బిఆర్ఎస్వి జిల్లా నాయకులు అరికిల్ల వెంకట్ తట్ల సాయి ధైనంపల్లి రాజేష్ శశి మెండు నితిన్ తదితరులు పాల్గొన్నారు

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల..

సీతారాముల కళ్యాణం కరపత్రాల విడుదల

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో ఆదివారం సీతారా ముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. సీతారాముల కల్యాణ కరపత్రాలను దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి అడ్వకేట్ లెక్కల జలం ధర్ రెడ్డి బుధవారంఆవిష్కరిం చినారు.ఆదివారం ఉదయం 10:30 గంటలకు తలంబ్రాల ను తీసుకురావడం 11 గంటలకు కంది శ్రీనివాస్ రెడ్డి చే ధార్మిక ఉపన్యాసం మధ్యాహ్నం 12.05 నిమిషా లకు సీతారాముల కళ్యాణం మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని కళ్యాణ అనంతరం లెక్కల లక్ష్మీ జలంధర్ రెడ్డి దంపతులచే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగల రని దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్ర మంలో నీల సమ్మిరెడ్డి నీల రంగారెడ్డి గిద్దమారి సురేష్ కోమటి గణేష్ గొట్టిముక్కుల సుమన్ బత్తుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.

14వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం

 

పరకాల నేటిధాత్రి

 

 

శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ ప్రతిష్టాత్మకంగా చెప్పట్టిన రేషన్ షాప్ ల వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యకరమంలో భాగంగా మున్సిపాలిటీలో ని 14వ వార్డులో మాజీ కౌన్సిలర్ మర్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అలి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14 వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అమీనా,కొక్కిరాల స్వాతి,విజయ్,అశోక్,ఎండి నజియ,తదితరులు పాల్గొన్నారు.

జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న.

ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఏఐసిసి,పీసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ జహీరాబాద్ పట్టణంలో బుధవారం రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,జై బాపు జై భీం జై సంవిధాన్ జహీరాబాద్ ఇంచార్జ్ ధనలక్ష్మి. ముఖ్యఅతిథిలుగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం అమలుకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా మరియు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,మండలాల నాయకులు మరియు మాజీ యం.పి.పిలు,మహిళా కాంగ్రెస్ నాయకులు,మాజీ జెడ్పీటీసీ లు,మాజీ మున్సిపల్ చైర్మన్ లు,మాజీ యం.పి.టి.సిలు,మాజీ సర్పంచ్ లు,మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం.!

తాజ్మహాల్ తరహాలో అద్భుత కట్టడం ! !

• హజ్రత్ ముల్తానీ బాబా దర్గా

• పాలరాతిలో ధగధగ మెరుస్తున్న

ముల్తానీ బాబా దర్గా పరిసరాలు

కులమతాలకు అతీతంగా భక్తులు దర్గాను

దర్శించుకొని ప్రత్యేక ప్రార్ధనలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మెటలకుంట చౌరస్తా సమీపంలోని జహీరాబాద్- బీదర్ ప్రధాన రోడ్డుపై అద్భు తంగా నిర్మించిన ముల్తానీ బాబా దర్గ

మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో అద్భుతంగా కట్టిన తాజ మహాల్ మాదిరిగానే సంగా రెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మెటలకుంట గ్రామ చౌరస్తా సమీపంలోని ముల్తానీబాబా దర్గాను అదే తరహాలో తీర్చిదిద్దారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీ రాబాద్-బీదర్ ప్రధాన రోడ్డు మార్గంలో నిర్మించిన హజ్రత్ ముల్తానీబాబా దర్గాను చూపరులకు ఎంతగానో ఆకట్టుకుం టుంది. ఈ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహన చోదకులు తాజ్మహాల్ మాదిరిగా ఉన్న ముల్లానీ బాబా దర్గా వద్ద కాసేపు ఆగి దూడాల్సిందే. అద్బు తంగా నిర్మించిన దర్గా పరిసరాలో ప్రజలు, వాహనచోదకులు తిరుగుతూ సెల్ఫీలతో కాలక్షేపం చేస్తుంటారు. దశాబ్దానికి పైగానే తాజమహల్ తరహాలో ముల్తానీ బాబా దర్గాను రెండు న్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ దర్గా పరిసరాలను గోడలను కట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, కడప జిల్లాల నుంచి సున్నపు రాయిని తెప్పించి బట్టి ల్లో కాల్చి ప్రత్యేక
రాయితో నూర్పిడి చేసి వినియోగించారు. దర్గాతో పరిసరాల్లో గోడల నిర్మాణంలో ఎక్కడ సిమెంట్, ఇసుక వారకపోవడం గమన్నారం, జైపూర్ నుంచి ప్రత్యేక పాలరాతిని తెప్పించి దర్గాను దగదగ మెరిసేలా అద్భుతంగా తీర్చిద్దారు. జహీరాబా ద్-బీదర్ ప్రధాన రోడ్డు రహదారిపై ఉన్న ముఖ ద్వారంతో పాటు దర్గా చుట్టూ గుమ్మటం వంటి ఆకారంలో నిర్మించిన గదులు దర్గాను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వినియోగిస్తుంటారు. ప్రతి నెల ఇక్కడ జరిగే వేడుకలకు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు వచ్చి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి దర్శించుకుంటారు. దర్గాకు నాలుగువైపులా నాలుగు ద్వారాలతో నిర్మించిన అపురూప కట్టడం పక్కనే 150 అడుగుల ఎత్తులో నిర్మించిన ఏక్ మినార్ భారీ స్తూపం చూప రులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఏరిఏమైనప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలోని తాజీమహాత్ను చూసేందుకు వెళ్ల కపోయిన ముల్లా నీ బాబా దర్గాను చూసిన వారంత తాజ్మ హాల్ను దూశామనే ఫిలింగ్తో ప్రజలు, వాహనచోదకులు సెల్సీలను దిగుతూ వెళ్లిపోతున్నారు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించామన్నారు. గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,అని ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బజార్ సిద్ధ గౌడ్, వెల్దుర్తి బాలరాజు గౌడ్, చిన్న అంజాగౌడ్,బాల గౌడ్,బజార్ కొండగౌడ్, రంజిత్ గౌడ్,వెల్దుర్తి వెంకటేష్ గౌడ్,నవీన్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్,చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పేకాట రాయుళ్ల అరెస్ట్..

పేకాట రాయుళ్ల అరెస్ట్.

42,780 రూపాయలతో పాటు నాలుగు సెల్లు ఫోన్లు స్వాధీనం

నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి

నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని అలంకానిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నలుగురు పేకాటరాయిడ్లను అరెస్టు చేసినట్టు నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలంలోని అలంకాని పేట గ్రామంలో ఆర్చి పక్కన నిత్యం పేకాట నిర్వహిస్తున్నట్టుగా పక్క సమాచారంతో నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో పేకాట ఆడుతున్న స్థలానికి చేరుకొని అక్కడ పేకాట ఆడుతున్న మంగిశెట్టి శ్రీను, మాస్ కుమార స్వామి, ఎడ్ల లక్ష్మీనారాయణ, గాజుల జనార్ధన్ నలుగురి వ్యక్తులను అరెస్టు చేసి వారి దగ్గర నుండి 42,780 రూపాయలతో పాటు 52 పేక ముక్కలు, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ చేయబడుతున్నట్లు నెక్కొండ ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.

రజతోత్సవ సభకు తరలిరావాలి.

రజతోత్సవ సభకు తరలిరావాలి.

సభను విజయవంతం చేయాలి..చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే..

“నేటిధాత్రి” హనుమకొండ.
ఈ నెల 27 న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు తరలి రావాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు,అభిమానులకు,ప్రజలకు పిలుపునిచ్చారు.బుధవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలోని సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

We need to move to the silver jubilee ceremony.

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ..
– మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
– అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసింది.
– నేడు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు తిరిగలేని పరిస్థితుల్లో ఉన్నారు.
– 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతకు బయపడే స్థానిక సంస్థ ఎన్నికలకు పోవడంలేదు.
– స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ మరికొంత కాలం ఓపిగ్గా ఉండాలి.సమన్వయంతో ఉండాలి.
– కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలపాలి.
– పార్టీ బలోపేతం కోసం పనిచేసే ప్రతికార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది.
– ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరంలేదు.
– ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం..ప్రజలకు అండగా ఉంటాం.
– ఈ నెల 27న ఎల్కతుర్తి శివారులో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో నియోజకవర్గం నుండి తరలి వెళ్దాము.
– రేపటి నుండి ఆయా మండలాల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామాలలోకి వెళ్లి సమావేశాలు నిర్వహించాలి.
– ఏ గ్రామం నుండి ఎంతమంది పార్టీ శ్రేణులు సభకు వస్తున్నారో,కావాల్సిన వాహనాలు ఎన్నో జాబితా సిద్ధం చేసి ఇవ్వాలి.

We need to move to the silver jubilee ceremony.

ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికూడా,ఆత్మకూరు,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల మరియు GWMC పరిధిలోని 15,16,17 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్యులు,మండల అదేకాశులు,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో గల సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ను పెట్టుకున్నారా అని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపు రెడ్డి అన్నారు…

సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు….

HCU విద్యార్థులపై విచక్షణ రహితంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు…

రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు అంటే భయమని ఉగాది పండుగ రోజున,కోర్టులకు సెలవు ఉన్న రోజులు విద్యార్థులను అరెస్టు చేయడం అరాచకం అన్నారు. ఉగాది పండుగ రోజున విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన గిఫ్ట్ అని అన్నారు..
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకొని 400 ఎకరాలు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.విద్యార్థుల గలాన్ని అణిచివేయడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటుగా పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కడమే కాంగ్రెస్ విధానమా అని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీల భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు…

దొంగ రాత్రి బుల్డోజర్ లను దింపి భూమి చదును చేయించడం దుర్మార్గం చర్య అని ఆ రాత్రి వేళలో పక్షులు,జంతువులు మూగ జీవులు కేకలు పెడుతున్న కానికరం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు…
ప్రజలు అన్ని గమనిస్తున్నారని ,విద్యార్థులు రాబోయే రోజుల్లో మంచి గుణపాటం కాంగ్రెస్ ప్రభుత్వం నకు చెప్తారని అన్నారు…

ఈ కార్యక్రమం లో వారి వెంట భూషన్ రావు పేట్ మాజీ ఎంపీటీసీ కొండ ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిట్ల శంకర్,పురుకుటపు గంగారెడ్డి, సూర్నేని వినోద రావు, గడ్డం శేఖర్ రెడ్డి, బద్దం మహేందర్, ముసుకు భాస్కర్ రెడ్డి,కరిపెల్లి అంజయ్య,జావిడి తిరుపతి,ముస్క శ్రీనివాస్,ముసుకు కృష్ణారెడ్డి, కారంగుల రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

మమతా బెనర్జీలో పెరుగుతున్న అసహనం

వెంటాడుతున్న ఓటమి భయం

మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు మొదటికే మోసం తెస్తాయా?

ఆర్జీకర్‌ ఆస్పత్రి సంఘటన తర్వాత హిందూ ఓటర్లలో స్పష్టమైన మార్పు

తృణమూల్‌ వైఖరిపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం

వామపక్ష హిందూ ఓటర్ల ఆలోచనలో మార్పు

శ్రీరామనవమి ర్యాలీల ద్వారా హిందువుల ఐక్యతకోసం వ్యూహం

రాష్ట్రవ్యాప్తంగా 20వేల ర్యాలీల నిర్వహణకు నిర్ణయం

ఎప్పటిలాగే అనుమతివ్వని మమతా ప్రభుత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో ఇటీవల పెరిగిపోతున్న అసహన తీవ్రతను గమనించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఆమె తీవ్ర ఒత్తిడిలో వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జాగృతి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆమెలో ఒకవిధమైన ఆందోళన కనిపిస్తోంది. గత ఇరవయ్యేళ్ల పాలనలో ఆమె హిందువుల పండుగులకు ఏనాడు ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వలేదు. ఇందుకు కారణం ముస్లింల ఓట్లు. ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడతాయి కనుక ఆమె ఈ వర్గంవారిని సంతృప్తిపరచేందుకోసం వారికి అను కూల నిర్ణయాలు తీసుకుంటూ రావడం గమనార్హం. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో ముస్లింల శాతం 27శాతం కాగా ఇప్పుడు దాదాపు 40శాతం వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చీలిపోయే హిందువుల ఓట్లకంటే, ఏకమొత్తంగా పడే ముస్లింల ఓట్లు మమతా బెనర్జీని అధికారంలో నిలుపుతాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందు కెళుతున్న బీజేపీ హిందూ ఓట్లను సుసంఘటితం చేసే యత్నాలు గట్టిగా ప్రారంభించింది. గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని మరీ అడుగులు ముందుకేస్తోంది. గతంలో వచ్చిన 38.5శాతం ఓట్లశాతానికి మరో ఐదు లేదా ఏడుశాతం ఓట్లు అధికంగా సాధించగలిగితే అసెంబ్లీలో పాగా వేయవచ్చన్నది పార్టీ వ్యూహం. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో అవధులు లేని స్థాయికి చేరుకున్న అవినీతి, అత్యాచారాలు, హత్యలు, ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన వంటివి హిందువుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచేశాయి. ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతోంది.

ఈ వ్యూహంలో భాగంగా వచ్చే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కోటిమందితో రాష్ట్రంలో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. గతంలో మాదిరిగానే పోలీసు లు శాంతిభద్రతల సమస్యను చూపుతూ ఇందుకు అనుమతినివ్వలేదు. ఉదాహరణకు శ్యాంపూర్‌లో రెండు`మూడు లక్షలమంది హిందూ జనాభా వుంటే, ఇక్కడ ర్యాలీలో కేవలం 2000` 2500 మంది మాత్రమే పాల్గనాలని పోలీసులు ఆంక్షలు విధించడం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇటు వంటి మితిమీరిన ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా విధించడంతో విపక్షనేత సుబేందు అధికారిఇప్పుడు ప్రభుత్వంపై నేరుగా విమర్శల దాడిని పెంచారు. రాజ్యాంగంలోని 25`28 అధికరణ లు ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛను మమత ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆయన ఎదురుదాడికి ది గారు. ‘సనాతని’లను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అణచివేయడం మమతా ప్రభుత్వానికే చెల్లిం దంటూ ఆ యన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామనవమికి కోటి మందితో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓట్లకోసం ఆమె జిహాదీ మూకలకు మద్దతు పలుకుతూ హిందువులపై దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఆ యన విమర్శల మాట ఎట్లావున్నా, రాష్ట్రంలోని హిందువుల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరమైన చైతన్యం వచ్చిందనే చెప్పాలి. హిందువుల ఓట్లు కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీల మధ్య చీలిపోయి వుండటం తృణమూల్‌ కాంగ్రెస్‌కు వరంగా మారింది. ఇదే సమయంలో ముస్లింల ఓట్లు గంపగుత్తగా సాధించడంతోపాటు, తనకు పడే హిందూఓట్లు ఆమె అధికారాన్ని చెక్కుచెదర కుండా కాపాడుతున్నాయి. కానీ ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల ఆలోచనా సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వామపక్షాలు సోదిలోలేకుండా పోయినా, వారికున్న హిందూ ఓటర్లు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 తనను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ గత డిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇదే పంథా పశ్చిమ బెంగాల్‌లో కూడా అనుసరించాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌కు స్నేహపూర్వక మద్దతు ఇచ్చినా, మమత తమను ఎంతమాత్రం ఖాతరు చేయకపోవడం కాంగ్రెస్‌ అధినాయకత్వానికి మింగుడుపడటంలేదు. ఈసారి కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు, తృణమూల్‌కు అనుకూలంగా ఓటు వే యనట్లయితే ఆమేరకు మమతా బెనర్జీకి నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఎంత ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడినా, హిందూ ఓట్లు రాకపోతే మమతా బెనర్జీ అధికారంలోకి రావడం కష్టం. తాజా పరిణామాల నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తృణమూల్‌ పుట్టి మునగడం ఖాయం.

ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో వుంచుకొని బీజేపీ నాయకుడు సుబేందు అధికారి ఇప్పుడు నే రుగా సనాతని, హిందూత్వలకు అనుకూలంగా తన ప్రసంగాల వాడిని పెంచారు. ‘జో హమారే సాత్‌, హమ్‌ ఉన్‌కే సాత్‌’, ‘సబ్‌కా సాత్‌, సబ్‌గా వికాస్‌’ నినాదాలతో 2024 జులైనుంచి ఆయనతన ప్రసంగ ధోరణినే పూర్తిగా మార్చివేశారు. కొన్ని సందర్భాల్లో ‘కేవలం హిందువులు మాత్రమే హిందూస్తాన్‌ను పరిపాలిస్తారు’ అంటూ నినాదాలిస్తున్నారు. బహుశా ఈ దూకుడుకు ప్రధానకారణం వామపక్షాలు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకులోని హిందూ ఓటర్లను ఆకర్షించడానికేనని చెప్పక తప్పదు. 

నిజం చెప్పాలంటే 2019 పార్లమెంట్‌ ఎన్నికలనుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ను సవాలు చేసే స్థా యికి బీజేపీ ఎదిగింది. నాటి ఎన్నికల్లో ఏకంగా 40.7% ఓట్లతో 18 లోక్‌సభ స్థానాల్లో (మొ త్తం 42సీట్లు) గెలుపు సాధించింది. 2014లో పార్టీకి రాష్ట్రంలో కేవలం 17శాతం ఓట్ల మద్దతు మాత్రమే వుండేది. కేవలం రెండు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేంది. ఇక 2016లో అ సెంబ్లీలో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచు కొని తృణమూల్‌కు సవాల్‌ విసిరింది. అప్పుడు పార్టీకి లభించిన ఓట్లశాతం 38.14%. 

ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2021 ఎన్నికల్లో 48.02% ఓట్లతో 215 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.73 శాతానికి పడి పోవడంతో పదిలోక్‌సభ సీట్లను కోల్పోయి 12 సీట్లకు పరిమితం కాగా, టీఎంసీ 29 స్థానాల్లో (45.76% ఓట్లు) గెలిచింది. 

పై గణాంకాలను పరిశీలిస్తే మరో ఆరు లేక ఏడుశాతం ఓట్లు సంపాదిస్తే బీజేపీకి అధికారాన్ని చేజిక్కించకునే అవకాశాలు అధికం. ఈ నేపథ్యంలోనే ‘సనాతని’ వాదంతో అన్ని పార్టీలకు చెందిన హిందూ ఓటు బ్యాంకులపై బీజేపీ దృష్టిపెట్టింది. వచ్చే శ్రీరామనవమికి కోటిమందితో ర్యాలీ నిర్వహించాలని తలపెట్టడం ఈ వ్యూహంలో భాగమే. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్‌ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది హిందువులతో 20వేల ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గతంలో శ్రీరామనవమి ర్యాలీలపై పుబ్రా మిడ్నాపూర్‌ జిల్లాలోని ఈగ్రాలో మరియు ఇదే జిల్లాలోని శ్యాంపూర్‌లో దుర్గామాత విగ్రహాల విధ్వంసాలు జరిగిన అంశాలపై ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 8న ఈగ్రాలో, ఏప్రిల్‌ 7న శ్యాంపూర్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.

మంత్రులను, శాఖలను మార్చొద్దు!

`ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్డు సాధిస్తున్నారు

`అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు

`ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు

`ఇంతలో మార్చితే మొదటికే మోసం వస్తుంది

`అధికారులలో అహం పెరుగుతుంది

`అధికారులలో మోనోపలి వస్తుంది

`మీడియా సంస్థలు కోరుకుంటే శాఖలు మార్చరు

`జర్నలిస్టులకు నచ్చనంత మాత్రాన మంత్రులను మార్చరు

`నాయకుల మధ్య విభేదాల కోసం తొందరపడొద్దు

`మంత్రులు తమ శాఖల మీద పట్టుకు కొంత సమయం పడుతుంది

`15 నెలల సమయం చాలా చిన్నది

`గతంలో శాఖల మార్పులు జరగిన సందర్భాలున్నాయి

`తక్కువ సమయంలో మార్చిన దాఖలాలు లేవు

`ఇప్పుడిప్పుడే పాలన పరుగందుకుంటోంది

`శాఖలు మార్చితే మంత్రులు మళ్ళీ పూర్తిగా అధికారుల మీద ఆధారపడాల్సి వస్తుంది

`ఆ శాఖల మీద పట్టుకు కుస్తీలు పట్టాల్సి వస్తుంది

`ఇంతలో పుణ్య కాలం గడిచిపోతుంది

`పొరపాటున కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు

`ఎన్నికలకు ఏడాదిన్నర ముందే మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది

`నిజం చెప్పాలంటే పరిపాలన సరిగ్గా చేసేది ఓ రెండు సంవత్సరాలు మాత్రమే

`ఇలాంటి సందర్భంలో మంత్రుల శాఖలు మార్చితే కథ మొదటికి వస్తుంది

`ప్రజలకు మంత్రులు దూరమయ్యే పరిస్థితి ఎదురౌతుంది

`మంత్రులు ఎప్పటికప్పుడు పని తీరు చూసుకోవాలి

`నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి

`జిల్లాల ప్రగతిపై సమీక్షలు జరపాలి

`పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండాలి

`ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి

`ఇన్ని పనుల మధ్య శాఖలు మారితే అన్నింటికీ అంతరాయమే

`ప్రజా సమస్యలు గాలికి వదిలేయడమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కొత్త మంత్రులు త్వరలో కొలువు తీరనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. రేపో, మాపో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుకూడా వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా త్వరలో, త్వరలో అనే వార్తలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇటీవల కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనంటూ కొత్త వార్తలు షికార్లుకొడుతున్నాయి. వాటికితోడు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు వుండే అవకాశమందుంటూ కూడా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజమందో లేదో? తెలియిదు? కాని మీడియా అత్యుత్సాహం మాత్రం ఎక్కువగా వుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో మంత్రులను తొలగించడం సాధ్యమౌతుందా? రెండోసారి మంత్రి వర్గ విస్తరణే ఇంత కాలం పట్టింది. ఒక వేళ ఇద్దరో, ముగ్గురినో మంత్రి వర్గం నుంచి తొలగిస్తే ఏర్పడే రాజకీయ అనిశ్చితి ఎలా వుంటుందనేది ఏ మాత్రం అవగాహన లేని మీడియా సంస్ధలు తమ ఇష్టాను రీతిన వార్తలు రాసేస్తున్నాయి. వాటిని ప్రజలు కూడా నిజమే అనుకునేలా మసాలలు దట్టించి వార్తలు వండి వారుస్తున్నారు. నిజానికి అందులో ఏ మాత్రం నిజం లేదు. మంత్రులను మార్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఎవరైనా మంత్రులకు వున్న అదనపు శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం వుంటుంది. కాని ఏకంగా ఇప్పటి వరకు చూస్తున్న శాఖలను మార్చి, కొత్త శాఖలను పాత మంత్రులకు అప్పగించే పరిస్ధితులు లేవు. వుండవు. ఒక వేళ పొరపాటున మంత్రుల శాఖలు మారితే అసంతృప్తి చెలరేగే అవకాశం వుంటుంది. నాయకులను బట్టి ప్రాధాన్యత శాఖలను అప్పగించడం పరిపాటి. అవే శాఖలను అటూ, ఇటూ మంత్రులకు మార్చితే పాలనా పరంగా నష్టం ఏర్పడే పరిస్దితులు ఎదురౌతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన కేవలం 15 నెలలు మాత్రమే అవుతుంది. మధ్యలో పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో కొంత సమయం వృదా అయ్యింది. ఈ కొద్ది సమయంలోనే ఆయా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రులను మార్చడం వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత బలం చేకూర్చినట్లౌతుంది. ఉద్యోగ వర్గాల తిరుగుబాటుకు కూడా కారణమౌతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి, మంత్రులకు అధికారులు ఇచ్చే సూచనలు, అందించే నివేదికలు సరైనవేనా..కాదా? అన్నది మంత్రులు పూర్తి స్దాయిలో తేల్చుకోలేని సందర్భాలే వున్నాయి. అలాంటి సమయంలో ఏకంగా మంత్రుల శాఖలు మార్చితే, మంత్రులు మొదటి నుంచి నేర్చుకోవాల్సి వుంటుంది. అప్పుడు పాలన గాడి తప్పుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నారు. సన్నబియ్యం రేషన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. బిసి రుణాలు ఇచ్చేందుకు నోటిఫికెషన్‌ విడుదల చేశారు. రికార్డు పద్దు ప్రవేశ పెట్టారు. వీటన్నింటికీ దృష్టిలో పెట్టుకొని మంత్రులు ఒక ప్రణాళికతో ముందకు వెళ్లేందుకు ఇప్పుడిప్పుడే సన్నాహలు చేసుకుంటున్నారు. తమ శాఖలపై పూర్తి స్దాయి పట్టు సాదిస్తున్నారు. ఈ తరుణంలో ఒక వేళ మంత్రుల శాఖలు మారితే మళ్లీ పాలన మొదటికొస్తుంది. పాలన గాడితప్పుతుంది. మంత్రులనే మార్చితే సామాజిక వర్గాలలో అలజడి రేగుతుంది. రాజకీయం మరో వైపు దారి తీసుకుంటుంది. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొత్త తలనొప్పి నెత్తిన పెట్టుకున్నట్లౌవుంది. సలహాలు ఇచ్చే వారు ఇస్తారు. కాని వాటిని ఎలా స్వీకరించాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియందికాదు. కాని కొన్ని సార్లు పదే పదే కొంత మంది చెప్పే సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాని మొదటికే మోసం వస్తుంది. గతంలో ఎన్టీఆర్‌ ఇలాగే చేశారు. దాంతో ఆయన పదవీ గండం తెచ్చుకున్నారు. ప్రాంతీయ పార్టీలో నిజానికి అలాంటి తిరుగుబాటు జరిగే అవకాశాలు వుండవు. కాని అదికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్‌ అలాంటి ప్రయోగం చేశారు. ఫలితం అనుభవించారు. ఆనాడు లక్ష్మిపార్వతితోపాటు, కొంత మంది మంత్రులు చెప్పిన చెప్పుడు మాటలు ఎన్టీఆర్‌ వినడం వల్లనే ఆయనకు ఆ పరిస్ధితి వచ్చిందన్న సంగతి తెలియంది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డిలు మంత్రుల శాఖలు మార్చిన సందర్భం వుంది. కాని ఇలా అర్ధాంతరంగా మార్చలేదు. అదును చూసి, పరిస్దితులను అవగాహన కల్పించుకొని చేశారు. పైగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. మంత్రులుగా పనిచేసిన వారు అప్పట్లో ఎంతో కొంత అనుభవం వున్నవారు. అప్పటికే మంత్రిత్వ శాఖల్లో పట్టు వున్న వారు కావడం వల్ల శాఖలు మార్చినా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదు. కాని ఎన్టీఆర్‌ లాంటి నాయకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం క్యాబినేట్‌ మార్చేదాక వెళ్లింది. ఆయన పదవికే గండం వచ్చింది. ఒక్కసారి మంత్రిగా ప్రమాణం చేసిన ప్రతి నాయకుడు తనకిచ్చిన శాఖను సమర్ధవంతంగా పోషించిన నేతగా గుర్తింపు తెచ్చుకోవాలనకుంటారు. మంత్రిగా మంచి పేరు సంపాదించాలని చూస్తారు. కాని కొన్ని సార్లు అవరోదాలు ఎదురుకావొచ్చు. వాటిని అధిమించాలంటే కొంత సమయం పడుతుంది. పైగా మంత్రి అంటే రాజకీయాలకు అతీతులు కాదు. రాజకీయం చేస్తూనే మంత్రిగా కర్తవ్యం నిర్వర్తించాల్సివుంటుంది. ఆ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొవాల్సివుంటుంది. మంత్రుల ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో తీసుకుంటారు. కాని ఉన్నతాధికారులు రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చెబుతుంటారు. ఇక్కడే మంత్రుల పనితీరు ఆదారపడి వుంటుంది. సహజంగా మంత్రులు ఏ పనిచేయాలనుకున్నా అధికారులు ఆర్దిక పరిస్ధితులు సహకరించకపోవచ్చు. అనే సూచనలే చేస్తారు. అది వాళ్ల తప్పు కాదు. రాష్ట్రాన్ని అప్పుల వైపు నడవాలని ఏ ఉన్నతాధికారి అనుకోరు. కాని అదే ఉన్నతాదికారులు పనులు చేయడంలో కూడా కొంత మంది తీవ్ర జాప్యం చేస్తుంటారు. కొత్తగా మంత్రులైన వారిని తప్పుదోవ కూడా పట్టిస్తుంటారు. సరైన సమాచారం సకాలం ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అధికారుల మీద మంత్రులు కేకలేయడం తప్ప మరేం చేయలేరు. వారిని మార్చుకునే అవకాశం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఉన్నతాదికారుల సంఖ్య చాలా తక్కువగా వుంటంది. అటు నుంచి, ఇటు నుంచి అటు మార్చుకోవడం తప్ప వారిని పక్కన పెట్టే అవకాశం వుండదు. గత ప్రభుత్వ హాయాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న అదికారులే ఇప్పుడూ కూడా కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి అదికారుల మూలంగా కొంత మంది మంత్రుల పని తీరుపై ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడిప్పుడే మంత్రులు తమ శాఖలపై పట్టు సాదిస్తూ, సంస్కరణలు చేసేందుకు సిద్దమౌతున్నారు. ఈ సమయంలో మంత్రుల శాఖలు మార్చితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అదికారలు చేతుల్లో మంత్రులు కీలుబొమ్మలౌతారు. అదికారులు ఏది చెప్పిందే నిజమని నమ్మే పరిస్ధితి వస్తుంది. అదికారుల్లో మోనోపలి మొదలౌతుంది. మంత్రి పనితీరు సరిగ్గా లేదంటూ ఆ శాఖ అధికారులే లీకులిచ్చి వార్తలు రాయించే పరిస్దితి వస్తుంది. గతంలో ఇలాంటివి అనేకం జరిగిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ఒకశాఖలో తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే మంత్రులను పక్కన పెడతారు. కాని మీడియా వార్తలను ఆదారం చేసుకొని మంత్రుల మార్పు సరైంది కాదు. ఒక వేళ అదే జరిగితే మంత్రుల శాఖలు మారిన మరు క్షణం నుంచి మళ్లీ మంత్రుల మీద కొత్త వార్తలు మొదలౌతాయి. ప్రతిపక్షాలకు ఆయుదాలౌతాయి. కోరికోరి ప్రభుత్వమే ప్రతిపక్షాల ముందు చులకనయ్యే పరిసి ్దతి ఎదురౌతుంది. నిజం నిష్టూరంగానే వుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికూడా ఒక సందర్భంలో నాకు మంత్రుల సహకారం సరిగ్గా లేదంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను దారికి తెచ్చుకోవడం కోసమని శాఖలను మార్చితే మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప మరొకటి వుండదు. ఏది ఏమైనా మంత్రుల శాఖల మార్పుల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. సమస్యలు సృష్టించుకోవద్దు.

పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.

పేద ప్రజలను అడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్

లక్నేపల్లి గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నాటి నుండి నేటి వరకు పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తెలిపారు.

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన (రేషన్ బియ్యం) సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

Congress

 

తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం సన్న బియ్యం పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ చైర్మన్ కోరారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తి కిరణ్, లక్నేపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయిలొని అశోక్, నర్సంపేట పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ పాలాయి రవికుమార్,నర్సంపేట మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జి రాజు, లక్నేపల్లి యూత్ అధ్యక్షుడు గొడిశాల సురేష్, మండలం యూత్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి సూదుల మహేందర్, చెన్నారావుపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు సిద్దేన రమేష్,తప్పేట రమేష్గ్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, బైరి మురళి,మ్తెదం రాకేష్,కమతం వీరభద్రయ్య ,ఒర్రంకి వేణు ,కత్తి వేణు, కోల విజేందర్, కళ్ళం సంపత్ , గాదం రాజ్ కుమార్, నాన్న బోయిన రాజు, రాజులపాటి సూరయ్య ,కత్తి చిన్న కట్టయ్య, రాజులపాటిరాజు, మునిగాల రాజేందర్ ,సూత్రం కళ్యాణ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

నిరుపేదల కలను సాకారం చేసిన సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిధాత్రి :

 

చిట్యాల మండలంలోని తిరుమలాపురం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి* ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని తిరుమలాపురం గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి అధ్యక్షతన..
ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . తిరుమలాపురం ఎంపీటీసీ పరిధి ఇంచార్జ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య* మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ,పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి మహిళలకు నిరుద్యోగులకు ,రైతులకు ,కూలీలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఆదుకుంటున్ రేవంత్ రెడ్డి
కి దక్కింది , అలాగేభూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* గెలిచి 15 నెలలు గడిచిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోట్లాది రూపాయలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నాడు.. రోజుకు 18 గంటలు అహర్నిశలు కష్టపడుతూ ప్రజల శ్రేయస్సు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు….. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. రాబోయే రోజులలో ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి పేదలను అదుకునే దిశగా కృషి చేస్తున్నారు అని అన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి రవి గ్రామ సీనియర్ నాయకులు గోపగాని శివకృష్ణ, కంచర్ల రాంబాబు, బొంపల్లి కిషన్ ,కంచర్ల కిట్టయ్య, కొర్రి రాజు ఎళగొండ శ్రీకాంత్, కలవేణి ప్రవీణ్,చెన్న నిశాంత్, నాగిరెడ్డి శంకర్, కొర్రి అశోక్, గద్దల భద్రయ్య, గద్దల తిరుపతి, నీలేష్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన.!

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అమలు చేయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచినా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి,ఏనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ గుండాల మండల అధ్యక్షులు డిమాండ్ చేస్తూ, గుండాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గోగ్గెలా లక్ష్మీనారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం.

ఘనంగా సన్నబియ్యం పంపిణి కార్యక్రమం

గంగారం, నేటిధాత్రి :

 

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం కొత్తగూడ గంగారం మండలాల్లో ఘనంగా ప్రారంభం చేశారు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రేషన్ షాపులో సన్నబియ్యం ఇస్తామన్న హామీని నెరవేర్చిందని.. సన్న చిన్న కారు నిరుపేదలు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి సన్న బియ్యం తింటారని రేషన్ షాప్ లో సన్న బియ్యం పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి ధనసరి సీతక్క కి రెండు మండలాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతారు తెరుచుకొని డీలర్ షాపులు

గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామ పంచాయతీలోని రేషన్ డీలర్ షాపు మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపు సన్న బియ్యం ఏప్రిల్ ఒకటవ తారీకున ఇవ్వాలని స్పష్టమైన హామీలు ఉన్నప్పటికీ మండలంలో అన్ని గ్రామాలు రేషన్ షాపులో సన్న బియ్యం వచ్చినప్పటికీ.. మర్రిగూడెం అంధువుల గూడెం మరికొన్ని గ్రామాల్లో రేషన్ షాపులు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించలేదు దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు నిరుత్సాహపడ్డారు…

టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.

టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల టౌన్ పోలీస్ స్టేషన్ ను మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా సందర్శించి,తనిఖీ చేశారు.

SI Kashinath Yadav

ఈకార్యక్రమంలో డిఎస్పీ రాంమోహన్ రెడ్డి, పట్టణ సీఐ శివలింగం, టౌన్ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ ఎస్పీ పరితోష్ పంకజ్ కు రికార్డులను వివరించారు.ఒకే రోజు మూడు పోలీసు స్టేషన్ లను సందర్శించి ఎస్పీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జహిరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జహిరాబాద్ టౌన్, జహిరాబాద్ రూరల్,కోహీర్ పోలీస్ స్టేషన్ లను సూడిగాలి పర్యాటనతో సందర్శించి, రికార్డు లనుతనిఖీ చేశారు.

సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం.

సన్నబియ్యం పేదప్రజలకు ఒకవరం

జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషమైనదని ఇది పేద ప్రజలకు పెద్దవరం అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాయిలి ప్రభాకర్ తెలిపారు. దొడ్డుబియ్యం తినలేని ఆబియ్యాన్ని ఎనిమిది రూపాయల కిలో చొప్పున పక్కదారి పడుతున్నాయని గమనించిన ప్రజా ప్రభుత్వం రైతుల వద్ద నుండి సన్న ధాన్యాన్ని కొని క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటూ రాష్ట్ర ప్రజానీకానికి సన్న బియ్యం ఇవ్వడం దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వాలను గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభాకర్ ప్రజలను కోరారు.

error: Content is protected !!
Exit mobile version