హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం- బింగి వేణు…

హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలం- బింగి వేణు

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా రామడుగు మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయనికి నిరసనగా వెళ్లి తహసీల్దార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు బింగి వేణు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు నూతన పింఛన్లు మంజూరు చేయడం లేదని, ఎన్నికల సమయంలో అనేక ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం ఎకరాకు ఆరువేల రూపాయలు వేస్తామని చెప్పి మూడు విడతల పైసలు ఎగ్గొట్టి రైతులను మోసం చేస్తోందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు కొలపురి రమేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, మండల ఉపాధ్యక్షులు కాడే నర్సింగం, జాతరగొండ ఐలయ్య, సీనియర్ నాయకులు కట్ట రవీందర్, జిట్టవేని అంజిబాబు, ఉప సర్పంచ్ లు బద్ధం లక్ష్మారెడ్డి, కుమ్మరి అనిల్, నాయకులు మాదం శివ, షెవెళ్ల అక్షయ్, వడ్లూరి రాజేందర్, మునిగంటి శ్రీనివాస్, వేముల రమేష్, హరీష్, బూత్ అధ్యక్షులు కడారి శ్రీనివాస్, దైవల తిరుపతి గౌడ్, వీర్ల రామచంద్రరావు, మంద రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version