డయాబెటిక్ పరీక్షలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు
రామడుగు, నేటిధాత్రి:
లయన్స్ క్లబ్ గోపాలరావుపేట ఆధ్వర్యంలో డయాబేటిక్ నెల సందర్బంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ చౌరస్తాలో నూట పంతోమ్మిది మందికి ఉచిత బ్లడ్ ప్రేషర్(బిపి), డయాబేటిక్ పరీక్షలు నిర్వహించగా యాభై రెండు మందికి షుగర్ నిర్ధారణ జరుగగా వారిని పరీక్షల నిమిత్తం డాక్టర్ వద్దకు పంపించడం జరిగింది. అనంతరం డయాబేటిక్ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగినది. ఈసందర్భంగా లయన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ డయబేటిక్ రాకుండవుండాలన్నా, కంట్రోల్ లో ఉండాలన్నా వ్యాయామం చేయాలని, వాకింగ్ చేయాలని, మితాహారం తినాలని, రాత్రి ఏడు గంటల వరకే డిన్నర్ చేయాలని, మద్యపానం, దూమపానంకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ పాకాల మోహన్, కోశాధికారి గొడుగు అంజయ్య యాదవ్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, క్యాబినెట్ మెంబర్స్ కర్ర శ్యాం సుందర్ రెడ్డి, కొడిమ్యాల వెంకటరమణ, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, మూల అనంతరెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, కోట్ల మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
