గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా….

గల్ఫ్ కార్మికునికి గల్ఫ్ కార్మికుల భరోసా
వి. వి. రావుపేట్ సంఘం తరపున 57.001 ఆర్థిక సాయం
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

 

జగిత్యాల జిల్లా మల్లపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన కండేల గంగాధర్ అనే గల్ఫ్ కార్మికుని పట్ల కాలం కనికరం చూపలేదు. తన కుటుంబం కోసం చిన్నతనం అందరిని కాల్పోయి మళ్ళీ కుటుంబం కోసం కష్టపడి మంచి కుటుంబాన్ని సంతోషంగా సాగుతున్న సమయం లో విషాదం నెలకొల్పింది.
కండెల గంగాధర్ తన భార్య అంజలి అనారోగ్యం బాగా లేనందున ఎంతో ఖర్చు చేసుకొని హాస్పిటల్లో లక్షలు ఖర్చు చేసుకున్న కూడా తన భార్యను కాన్సర్ నుండి రక్షించలేకపోయాడు.
తోటి గల్ఫ్ కార్మికునిక గా చిన్నతనం నుండి చూసిన ఎంతోమంది గల్ఫ్ కార్మికులు చలించి పోయారు. వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు ఏదో ఉడుతా సహాయంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అక్షరాల యాభై ఏడు వేల రూపాయలు తోటి గల్ఫ్ కార్మికులకు ఇబ్బంది ఉందని చెప్పగానే వి. వి. రావుపేట్ గల్ఫ్ కార్మిక సంఘ సభ్యులు తన కుటుంబానికి ఆర్థికంగా మనందరం కూడా సహాయం చేద్దామని ముందుకు రావడం.జరిగింది
ఒకరికి ఒకరం భరోసానివ్వడం చాలా గొప్ప విషయం అని వి. వి. రావుపేట్ గల్ఫ్ సంఘo నాయకులు తెలిపారు.
అలాగే ఈ సంస్థ ఏర్పడిన నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి భరోసా, గల్ఫ్ కార్మికలకు అవగాహనా కల్పిస్తున్న అందున పలు నాయకులు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం లో వి వి రావుపేట గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు పెనుకుల అశోక్. ఆరేళ్లి మహేష్,విష్ణు రాజా. మచ్చర్ల అదిరెడ్డి నారాయణ గౌడ్.రఘపతి. నలిమేల ప్రసాద్. పోతు రఘు. గుగ్లావత్ శ్రీకాంత్ మెండే ప్రవీణ్. రొడ్డ రాజశేఖర్. శ్రీమాన్ గౌడ్. రొడ్డ నవీన్. ఒల్లలా మల్లేషం. సంఘ మహేష్.గోపినేని రమేష్. వేల్పుల గంగాధర్. జక్కని నరేష్. కాట్కామ్ గణేష్. అరెల్లి శ్రీనివాస్. మిట్టపల్లి శ్రీనివాస్. సురేందర్ రొడ్డ. నాణెం రంజిత్. పళ్ళికొండ నరేష్. ఒల్లలా శ్రీనివాస్. పంజర్ల సత్యనారాయణ. ఎండీ రహీమ్. కండెల వెంకటి. బాధనపెల్లి గంగారెడ్డి. ఇరిశెట్టి సాయిలు. కోమానాపెళ్ళి కాసాన్న. రొడ్డ రాజేందర్. కండెల భూమయ్య. వేల్పుల మహేష్. సకినాపెళ్ళి శేఖర్. కొడిమ్యాల లింగం చారి. సుతారి గణేష్. గుగ్లావత్ రాజేష్. యాళ్ల తిరుపతి రెడ్డి. అమరకొండ లక్ష్మి రాజాం. గుగ్లావత్ శ్యామల్. గుగ్లావత్ తిరుపతి. కండెల సాయిలు. లౌడ్య విష్ణు. అరే రాజేశం. నిమ్మల విజయ్. ఎండీ ఆమాన్. వెల్మలా ప్రవీణ్. ఎండీ అబిబి.అరెల్లి రాజేశం. సకినపెల్లి రమేష్. జోగుల రాకేష్. గుగ్లావత్ చిన్నా.ఈ కార్యక్రమంలో. పెనుకుల నరేష్. వేముల నరేష్. నలిమేల రాజు. సతీష్. శ్రీను . శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు

కరీంనగర్, నేటిధాత్రి:

తమ తోటి క్లాస్మెంట్ కూన సాయి బాబా అనారోగ్యానికి గురైతే చలించిపోయిన చిన్ననాటి క్లాస్మెంట్స్ అంతా కలిసి వైద్య ఖర్చుల కోసం జమ చేసిన ఒక లక్షా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను హైదారాబాద్ లోని ప్రైవేటు హస్పిటల్ లో ఉన్న అతని భార్య కూన రజితకు శుక్రవారం అందజేశారు. ఈసందర్భంగా బూడిద సదాశివ, అందె చిన్న స్వామి మాట్లాడుతూ చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కూన సాయిబాబాకు ఇటీవల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి తీవ్ర అనారోగ్యంనకు గురై హైదారాబాద్ లోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో డాక్టర్లు తక్షణమే ఆపరేషన్ చేయాలని అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో సాయి బాబాను ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆకాంక్షతో అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. ఇప్పటికే దాదాపుగా ఇరవై లక్షలు ఖర్చు అయ్యాయని సాయిబాబా అన్న కూన సంపత్ మరియు భార్య రజిత తెలిపారు.

 

 

అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన సాయిబాబాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో బ్రతుకుదెరువు కోసం కరీంనగర్ వెళ్లి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటూ తన భార్యను ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని, తన భార్య కూడా కుట్టు మిషన్ కుడుతూ బ్రతుకుతున్నారని తోటి క్లాస్మెంట్స్ బూడిద సదాశివ, అందె చిన్న స్వామి తెలిపారు. 1997-98 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న క్లాస్మెంట్స్ సాయిబాబా అనారోగ్య పరిస్థితి తెలుసుకొని వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు అందరు కలిసి లక్షా ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని సాయిబాబా భార్య రజితకు అందజేసి, చికిత్స పొందుతున్న సాయిబాబాను చూసి ఆరోగ్య పరిస్థితి గురించి రజితను అడిగి తెలుసుకొవడం జరిగిందని సదాశివ, స్వామి తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో మేకల కుమార్, వోద్దిరాల విజయ్ కుమార్, పులి శ్రీనివాస్, అంతగిరి సాయిలు, సుతారి శ్రీనివాస్, బూడిద బాలు, తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version