గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మహిళా మణులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటిలో మొదటి బహుమతి తడగొండ లత, రెండవ బహుమతి మోడీ కిరణ్మయి, మూడవ బహుమతి సమ్మెట జ్యోతిలు గెలుపొందారు. గెలుపొందిన మహిళలకి గ్రామ సర్పంచ్ మోడీ రవీందర్, పాలకవర్గం చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిదులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
