రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు…

రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను వివరించిన అధికారులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా భూసార పరీక్షా పత్రాల- వితరణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జె.భాగ్యలక్ష్మి పాల్గొని రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యతను, ఫలితాలను వివరించి, భూసార పరీక్షా పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో చొప్పదండి ఏడీఏ ఎన్. ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారిని త్రివేదిక, గోపాలరావుపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, వ్యవసాయ విస్తరణ అధికారులు అనంతరాజ్, సంపత్, రమేష్, గోవర్ధన్, గుండి గోపాలరావుపేట క్లస్టర్ పరిధిలోని రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version