అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

అభివృద్ధి పనులపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా..

#పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

#చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై దుష్ప్రచారం.

#మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినారని వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని గ్రామల అభివృద్ధిని మేమే చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదని బిఆర్ఎస్ మండల నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ అన్నారు. శనివారం మండలంలోని నారక్కపేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి సుమన్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్త సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని గాలికి వదిలేసి వారు మాత్రం కోట్లకు పడగలెత్తారు. ఇల్లు లేని పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, దళితులకు దళిత బంధు ఇస్తామని, రైతులకు రైతు రుణమాఫీ చేస్తామని ఏ ఒక్కటి ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్లనే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిన కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నామని భ్రమలో బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ తో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో చేతి గుర్తుపై గెలిచి ఎంపీపీగా గద్దెనెక్కి కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి అర్హత భానోత్ సారంగపాణి కు లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేస్తూ పేదల పక్షాన ప్రభుత్వం అండగా ఉంటుందని దానికి నిదర్శనమే రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీలేని రుణాలు, కుల సంఘాలకు భవనాలు, మహిళా సంఘాలకు భవనాలు, విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజన వసతి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పేదవాడికి సన్న బియ్యం లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు లబ్ధి చేకూరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ఓర్వలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ బిఆర్ఎస్ నాయకులు పబ్బంగడుపుతున్నారని. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇవేమీ ప్రతిపక్ష నాయకులకు కనబడటం లేదని ఆయన విమర్శించారు.
ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మేము చేపట్టిన అభివృద్ధి పనులను నిరూపించడానికి మేము బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా దమ్ముంటే రండి ఇప్పటికైనా ప్రజలకు మాయమాటలు చెప్పి అబద్ధ ప్రచారాలను మానుకోండి లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు .ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోగుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు అడపరాజు, ప్రధాన కార్యదర్శి వక్కల యోగేశ్వర్, మాజీ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, మాజీ ఎంపీటీసీ గుండాల రాజ కొమురయ్య నాయకులు కోడూరు రాయ సాబ్, పాక కుమారస్వామి, అడిగిచెర్ల శ్రీనివాస్ ,కుంచాల రాజు, చిందం కుమారస్వామి, మెరుగు మల్లయ్య, వైనాల మొగిలి ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్

అధికారం కోల్పోయి ఇంకా అధికారంలో ఉన్నామని భ్రమలో మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బి ఆర్ ఎస్ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో నేను జై తెలంగాణ అంటూ తిరుగుతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక సంస్కారహీనులుగా మాట్లాడు సభ్య సమాజం తలదించుకునే విధంగా విచక్షణ కోల్పోయి కేటీఆర్ ముప్పు కోసం కేకే పై కారుకూతలు కూస్తావా నీ జిల్లెల్ల గ్రామంలో పది సంవత్సరాలు సర్పంచ్ గా చేసి ఏం చేసినావు నిరూపించాలి బాత్రూంలో పైసలు దోచింది నిజం కాదా గ్రామంలో అరాచకం ఎవరికి తెలవద కేటీఆర్ పర్యటనలు అప్పుడు క్రషర్ వల్ల రైతులు నష్టపోతున్నారని అని నిరసన తెలుపలేదా ఎల్లారెడ్డి పేట మండలంలో చిన్నారిపై అగైత్యానికిపాల్పడిన మీ నాయకుడు కాదా పై నాయకుడిపైఏ చర్యలు తీసుకున్నారు కనీసం చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగ్యస్వామిగా పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి రావాల్సిన టికెటు మీ నాయకుడు గద్దలగా తందికపోయింది నిజం కాదా కేకే మహేందర్ రెడ్డి కి జరిగిన అన్యాయం విషయంలో కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు సిగ్గుపడతారు తెలుసుకో సిరిసిల్ల పట్టణంలోని దళిత గిరిజన మైనార్టీ హాస్టల్లో జరిగిన అగైత్యానికి ఎవరు పాల్పడ్డారు తెలుసుకోవాలని మేము గెలవకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్లకి అండగా ఉన్నామని మీరు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఏం చేసిండు ఆయన కంట్రిబ్యూషన్ ఎంత మొట్టమొదటిగా జెండా పార్టీ పార్టీ ఉద్యమంలో సబ్బండ వర్గాలను మమేకం చేసి ఉద్యమాన్ని లేపిన వ్యక్తి కేకే అని ఉద్యమం ఉనికి కాపాడాలని ప్రజలు కేటీఆర్ ను గెలిపిస్తే మీరు ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా మారి వారికి ఎన్నో కాంట్రాక్టులు ఇప్పించింది మీరు కాదా మీరు దొంగలాగా రాజకీయాలు చేసేది మీరా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడేది మీ ప్రభుత్వ పాలనలో 3500 కోట్లు ఇసుకను తరలించాలని ధర్నాలు చేస్తే స్పందించలేరు ఇందులో కేటీఆర్ వాటా ఎంత నేరెళ్లఘటనలో ఒక వ్యక్తి చనిపోయితే దళితులపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు స్పందించలేదు అప్పుడు ప్రశ్నించని మీరు ఇప్పుడు ప్రశ్నిస్తారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలు చెప్పడానికి కేటీఆర్ ను కలిసిన పట్టించుకోలేదని జిల్లా ఉద్యమ సమయంలో కేటీఆర్ ను కలిసిన జిల్లా ఏర్పాటు విషయం వివరించినామని తంగళ్ళపల్లి మండలంలో కొన్ని గ్రామాలను మున్సిపల్ చేస్తారంటే కలపడానికి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేసింది మేమే కాదా ప్రజలను హాస్పిటల్లో చేర్పించి నట్టు నటించి డాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్నది నువ్వు కాదా అగ్రికల్చర్ కాలేజీలో భూములకు పోయి 12 కుటుంబాలకు న్యాయం జరగలేదని కానీ నీ భార్య పేరు మీద సర్వే నెంబర్ 1.2.గుంటల భూమి పట్టా పొందిన ముచ్చట వస్తాము కాదా మీ పార్టీ నాయకురాలు సరస్వతి ఒకటి నాలుగు సార్లు ప్రభుత్వ లోన్ తీసుకున్నది నిజం కాదా ఆమె 2.20. గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించు కున్నదివాస్తవం కాదా గత అధికార మందాన్ని ఇప్పుడు చూపిస్తే ఊరుకోం. మీ నాయకుడు మీకు ఇదే నేర్పిస్తున్నాడా అక్రమ మైనింగ్ ద్వారా క్రషర్ నడిపించి పక్క పొలాల రైతులను ఇబ్బంది పెట్టింది నువ్వు కాదా ప్రగతి భవన్ ఊరి అవతల కట్టిన దావతులకు అండగా మార్చిన నీవు కాదా మీ అగ్రికల్చర్.కాలేజీ నిర్మాణంలో భూమి కోల్పోయిన మీ ఊరి వ్యక్తి నీ వల్ల గుండె ఆగి చనిపోయారు నా భూమి నాకు ఇప్పించమంటే కుల బహిష్కరణ కేసు పెట్టింది వాస్తవం కాదా అప్పుడు నీళ్ళు ఇచ్చారనిఅడ్డగోలుగా మాట్లాడుతున్న మీరు ఇప్పుడు నీళ్లు ఎందుకు రావడం లేదో చెప్పాలి. కాల్వ నిర్మాణం కోసం రైతు చంద్రారెడ్డి నష్టపరిహారం ఇస్తానని ఇవ్వలేదు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇప్పుడు మాత్రం ఇస్తానని అనడం సిగ్గుచేటు ఏది నిజమో ఏది అబద్ధము తెలుసుకొని మాట్లాడాలి ఓడిపోయి ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి విమర్శించడం సరికాదు అని అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దారి నిర్మించినావా అలాగే మమ్మల్ని కాపాడు మహాప్రభు అంటూ కేకే మహేందర్ రెడ్డి చుట్టూ మీ నాయకులు తిరుగుతున్నారు మీ నాయకులు వెంటనే కేకే మహేందర్ రెడ్డి కి బే షరతుగాక్షమాపణ చెప్పాలని సందర్భంగా ఇకనైనా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో నేరెళ్ల నరసింహం గౌడ్ మునిగల రాజు పెట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి రాము పొన్నాల పరిసరం ఆరేపల్లి బాలు చుక్క శేఖర్ జలంధర్ రెడ్డి బాలసాని శ్రీనివాస్ గౌడ్ సామల గణేష్ కాబట్టి మల్లేశం యాదవ్ బండి పరశురాం అని సుద్దాల శ్రీనివాస్ గుగ్గిళ్ళ అభినయ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version