బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కటి సంజీవరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన మొగిలి కోమల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం కర్కపల్లి గ్రామానికి చెందిన తాంపు నరసింగం గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు,పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్,ఐలోని రామచంద్ర రెడ్డి,నాయకులు రవీందర్ రెడ్డి, కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, రాజిరెడ్డి,మల్లారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, యాకయ్య, రఘు, తదితరులు ఉన్నారు.