జై, ఈశ్వరి బాయి 107 వ.జయంతి
◆:- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డా. జె గితారెడ్డి
◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్,ఉజ్వల్ రెడ్డి’
జహీరాబాద్ నేటి ధాత్రి:
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డా. జె గితారెడ్డి గారి మాతృమూర్తి దివంగత మాజీ ఎమ్మెల్యే ఉక్కు మహిళ పేదల పెన్నిధి, జై ఈశ్వరి బాయి గారి 107 వ.జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతి హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రివర్యులు సీతక్క,గడ్డం వివేక్ వెంకటస్వామి,శాసనసభాధ్యక్షులు గడ్డం ప్రసాద్,విజయ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్,ఉజ్వల్ రెడ్డి’ పాల్గొన్నారు.వారితోపాటు జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహ రెడ్డి ఎస్సీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ కె, భీమయ్య,సుభాష్ రెడ్డి షాకీర్ అలీ నరసింహులు టీచర్,జనార్ధన్ పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
