బర్ధిపూర్ లో శేఖర్ పాటిల్ జన్మదిన వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T120151.416-1.wav?_=1

 

ఘనంగా శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ శేఖర్ పాటిల్ జన్మదిన వేడుకలు:

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బర్ధిపూర్ దేవస్థానంలో శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ శేఖర్ పాటిల్ జన్మదిన వేడుకలు శాలువా పూలమాలలతో సన్మానించి
ఘనంగా నిర్వహించారు, ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,ఆశీర్వాదం తదితరులు పాల్గోని శేఖర్ పాటిల్ గారికి శాలువ పూలమాలతో సన్మానించి జన్మదిన శుభకాంక్షలు తెలియజేసారు.

కొహీర్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు వినాయక పూజలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T115300.979.wav?_=2

 

గణనాథుడి” కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి : ఎమ్మెల్యే మాణిక్ రావు .

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కొహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు & బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు స్థానిక పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు ఆ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి సర్పంచ్ కలిమ్ ,కమిటీ అధ్యక్షులు వినయ్ కుమార్
వార్డ్ మెంబర్ లు యదుల్, వజీద్,
నాయకులు విక్రమ్ రెడ్డి సంగమేశ్వర్ మేతరీ సందీప్ గుడ్డు,ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎం. ఆర్. హెచ్. ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T114430.082-1.wav?_=3

 

ఎం. ఆర్. హెచ్. ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనం

◆:- ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణం అల్లిపూర్ గ్రామంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ లో ఈ రోజు జరిగిన అలుమ్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ.చెర్మన్ వై.నరోత్తం పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా వై.నరోత్తం మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఈ రోజు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎందరో విద్యార్థులకు ఉన్నత స్థాయిలో నిలిపిన ఘనత ఎం. ఆర్. హెచ్. ఎస్ స్కూల్ కె దక్కింది అని అన్నారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞపకం.మనం జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన విద్యార్థి దశను గుర్తు చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా ఏ స్థాయిలో ఉన్న ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి అన్నారు నేను ఇక్కడ చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న అన్నారు
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ జిల్లా అధికారి రేవ.సుకుమార్ ఎం. ఆర్. హెచ్. ఎస్ ప్రిన్సిపల్ టి. సబితా స్వరాజ్ స్వామిదాస్,మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ ఆర్ హెచ్ ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T113521.831-1.wav?_=4

 

ఆర్ హెచ్ ఎస్ పూర్వ విద్యార్థుల అలుమ్ని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నా

◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్:పట్టణంలోని మెథడిస్ట్ రూరల్ హై స్కూల్ లో జరిగిన అలుమ్ని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా మాజీ మంత్రి డా౹౹ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని జ్ఞపకం.

 

మనం జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన విద్యార్థి దశను గుర్తు చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు వచిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాలి..
మరియు పట్టణ కేంద్రంగా ఉన్నా ఆర్ హెచ్ ఎస్ రూరల్ హై స్కూల్ ఇక్కడి ప్రాంత విద్యార్థులను ఎంతో మందిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దింది..

 

అందులో చదువుకున్నా పూర్వ విద్యార్థులు మళ్ళీ ఇలా కలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది,అని వారు మాట్లాడడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ జహీరాబాద్ మెథడిస్ట్ చర్చ్ జిల్లా అధికారి రేవ్.సుకుమార్ ఎం ఆర్ హెచ్ ఎస్ ప్రిన్సిపల్ టి. సబితా స్వరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

మహాగణపతి హోమం, అన్నదానం, సామూహిక దీపారాధన…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T112728.994.wav?_=5

 

మహాగణపతి హోమం, అన్నదానం, సామూహిక దీపారాధన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఓంకార పట్టణం కోహిర్ గ్రామంలో సార్వజనిక వినాయక మండలి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాగణపతి హోమం, అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కొల్లాపూర్ మాణిక్ రావు మహాగణపతిని దర్శించుకున్నారు. అనంతరం మహిళలు సామూహిక దీపారాధన చేశారు.

గొర్రెలు, మేకల పిపిఆర్ టీకా శిబిరం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-06T112049.918-1.wav?_=6

 

గొర్రెలు, మేకలకు పిపిఆర్ వ్యాక్సిన్ టీకా శిబిరం: రైతులు సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పా నగర్ కుడు సంఘం బొప్పనపల్లి ఆయా గ్రామాలలో శనివారము గొర్రెలు, మేకలకు సోకె పురు వ్యాధి నివారణ పిపిఆర్ వ్యాక్సిన్ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా …. గొర్రెలు, మేకలకు టీకాలు వేశారు. ఈ శిబిరం ఈనెల 15వ తేదీ వరకు పలు గ్రామాలలో కొనసాగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది
శివకుమార్ స్వామి రాములు. కృష్ణ సులోచన రాణి. వ్యవసాయదారులు గొల్ల రవి. కిష్టయ్య. గోపాల్. అంజన్న ఝరాసంగం గ్రామ రైతులు
పాల్గొన్నారు.

‘‘కేసీఆర్‌’’ సంతోషంలో కనిపించేది ‘‘సంతోషే’’!


`‘‘కేసీఆర్‌’’ ఆరోగ్యానికి ఔషదం ‘‘సంతోషే’’!

`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్‌’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!

`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేస్తున్నాడు.

BRS MP SANTOSH RAO

`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.

`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.

`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.

`నిరంతరం ‘‘కేసీఆర్‌’’ వెన్నంటే వుంటాడు.

BRS MP SANTOSH RAO

`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్‌’’ కనిపిస్తారు.

`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.

`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్‌’’ వెనకాలే వుంటాడు.

`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్‌’’ను చూసుకుంటాడు.

`అలాంటి ‘‘సంతోష్‌’’ సేవలను శంకించడం తగదు.

`అనుక్షణం ‘‘కేసీఆర్‌’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.

`‘‘కేసీఆర్‌’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.

`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.

`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్‌’’ కోసం త్యాగం చేస్తున్నాడు.

`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.

`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.

`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.

`‘‘సంతోష్‌’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.

`‘‘సంతోష్‌’’ లాగా ‘‘కేసీఆర్‌’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.

`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్‌’’ ను ‘‘కేసీఆర్‌’’ చూసుకోవడానికి కారణం అదే.

`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్‌’’ దే.

`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.

`ఎంతగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేసినా ‘‘సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే’’!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

జోగిన పల్లి సంతోష్‌రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ సిఎం. అయ్యాక సంతోష్‌ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్‌ గురించి కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్‌ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్‌ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్‌ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్‌ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్‌ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్‌ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, కేసిఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్‌ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్‌ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్‌కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్‌ గురించి చెప్పడం జరిగింది. సంతోష్‌ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్‌ చెప్పారు. కేసిఆర్‌ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్‌ డిల్లీలో కేసిఆర్‌కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్‌రావు, డిల్లీలో కేసిఆర్‌ వున్నప్పుడు సంతోష్‌ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్‌ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్‌ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్‌ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్‌ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్‌ఎస్‌ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్‌ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్‌ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్‌ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్‌ ఎదుర్కొన్నారు. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్‌ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్‌ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్‌ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్‌ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్‌ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్‌ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్‌. కేసిఆర్‌ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్‌. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్‌ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్‌. తన తండ్రి కేసిఆర్‌ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్‌, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్‌ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్‌ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్‌ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్‌ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్‌కు సంతోష్‌ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్‌ను సంతోష్‌లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్‌ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. కేసిఆర్‌ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్‌ వల్లనే కేసిఆర్‌ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్‌ వెంటే వుంటారు. కేసిఆర్‌ వెన్నంటే వుంటారు. కేసిఆర్‌ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్‌ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్‌ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్‌ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్‌ అంటే కూడా కేసిఆర్‌కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్‌కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్‌ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్‌కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్‌ ఎప్పుడూ కేసిఆర్‌కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్‌కుఎంతసేవ చేసినా సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్‌కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్‌ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్‌ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్‌ లాగా కేసిఆర్‌కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్‌ ఈస్‌ గ్రేట్‌ అని అందరూ అనాల్సిందే.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్….

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

అభినంధించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో
శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి
మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

కన్నుల పండువ గా అంజనీ పుత్ర గణ నాథుని నవరాత్రుల వేడుకలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

వినాయక చవితి వేడుకల సందర్భంగా జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా, శాంతి యుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని వంద ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాకయ కుని మండపం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీ నీ అంజనీ పుత్ర ఎస్టేట్స్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రం గా విలసిల్లి శాంతి, ఐక్యత తో పండుగ లో నిర్వహించుకోవాలన్నారు. తెలంగాణ పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గా ప్రతి పండుగ ను వేడుక గా నిర్వహించుకుని మధుర జ్ఞాపకాలుగా మలచుకోవాలన్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ వంద ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం, ఆశీర్వాద బలం తో సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు..

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక…

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడుగా రాయిల్ల జనార్థన్,ముఖ్య సలహాదారుడుగా గంగాధరి సురేష్, నూతన అధ్యక్షుడుగా శ్రీగద్దె సుమన్ ,ఉపాధ్యక్షులుగా కొయల్ కర్ వినోద్,తొగిటి రవితేజ, ప్రధాన కార్యదర్శి మోర శశికాంత్,కోశాధికారిగా గట్టు నవీన్ కుమార్ , సంయుక్త కార్యదర్శిలుగా దువ్వాక కృష్ణ చైతన్య,శ్రీ గద్దె శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు పారిపెల్లి శివ ప్రసాద్,కటుకం శివ కుమార్,గట్ల తరుణ్,కొరల్ కర్ ప్రవన్,కుంబలకర్ వెంకటేష్,కట్టెకొల అకిలేష్ లను ఏకగ్రీవంగా శ్రీ భవానీ సేవా సమితి సభ్యులు అందరు ఎన్నుకున్నారు.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది..

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
…గురు దేవో భవ ….!
… మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్, సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది ఉపాధ్యాయులను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,డిసి బత్తిని భూమయ్య,కోశాధికారి బెక్కెం తిరుపతి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ఉపాధ్యాయులు కుంభాల శ్రీనివాస్,రాపర్తి నర్సయ్య,కడకుంట్ల అభయ్ రాజ్,బెజ్జంకి హరికృష్ణ,ఆడెపు సుజాత,మచ్చ చంద్రకళ,ధ్యావన పెళ్లి సురేందర్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో…

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

రామాయంపేట, సెప్టెంబర్ 5 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.

గణేష్ మండపాలను దర్శించిన చల్ల నారాయణ రెడ్డి…

మహాదేవపూర్ లో పలు గణేష్ మండపలను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ గారు*

** మహాదేవపూర్ సెప్టెంబర్ 5 నేటి ధాత్రి * *

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని గణేష్ నవరాత్రుల సందర్బంగా పలు గణపతి మండపాలను దర్శించుకొని,ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అనంతరం మాట్లాడుతూ ప్రజలంతా సుఖశాంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిoచాలని,పాడి పంటలు సమృద్ధిగా పండాలని,ప్రజలందరికి గణేష్షుడు తోడై,నీడై ఉండాలని కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్,మాజీ మండల అధ్యక్షులు సిరిపురం శ్రీమన్నారాయణ,మండల ప్రధాన కార్యదర్శులు బల్ల శ్రావణ్, లింగంపల్లి వంశీ, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్,కొక్కు శ్రీనివాస్, దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్ పాల్గొన్నారు

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు…

21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని వీర హనుమాన్ గణేష్ మండలి వద్ద గురువారం రాత్రి మహిళలు గణేశునికి పూలతో అలంకరించి 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించి మహిళలు గణపతి దేవుని ఆశీర్వాదం పొందారు.పూజ అనంతరం మహిళలు గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ…

మెట్పల్లిలో ప్రత్యేక వినాయక పూజ

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి దాత్రి
మెట్ పల్లి పట్టణ బాలకిషన్ నగర్ వినాయక సొసైటీ వారి ఆధ్వర్యంలో పురోహితులు రమణ చారి వేద మంత్రాలతో వినాయక స్వామి వారికి రాత్రి ప్రత్యేక పూజలు అనంతరం 51. ప్రసాదల నైవేద్యం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ తోట ప్రవీణ్ వినాయక కమిటీ అధ్యక్షులు తోట ప్రసాద్ సాంబారు శ్రీనివాస్ చందనగిరి రమేష్ డొల్ల నాగేశ్వర్ తాడూరి యాదగిరి బోయిని ప్రవీణ్ కుమార్ పర్రి శంకర్ మహేష్ చొప్పరి శ్రీనివాస్ కోరే రమేష్ మనోహర్ శ్రీనివాస తులసీదాస్ మర్రి మహేష్ తదితరులు మహిళలు కాలనీవాసులు పాల్గొన్నారు.

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది…

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మొగులపల్లి (నేటిధాత్రి ):

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నడిగోటి రాము మాట్లాడుతూ. తెలంగాణలో టిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని ఆయన అన్నారు గంపగుత్తగా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గుంట నక్కల దోచుకొని దాచుకొని అవినీతి, దోపిడీ, దొంగతనాలను పిసి గోష్ కమిషన్ ద్వారా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక లిక్కర్ రాణిని తెరపైకి తీసుకువచ్చి మళ్ళీ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మీ కల్వకుంట్ల కుటుంబం ద్వారా చాలా తీరని అన్యాయం జరిగింది. ఎన్నో అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా కమిషన్లు పదేళ్లు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తియడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. మీ కల్వకుంట్ల కుటుంబం బండారం బయట పడేసరికి వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు. అని నువ్వు అనడం మరునాడు నిన్ను మీ అధినేత సస్పెండ్ చేయడం ఇదంతా సినిమా లా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ముందే రాయడం జరిగింది. కేసీఆర్ కాలేశ్వరం స్కామ్ కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ రేసింగ్ స్కామ్, కవిత ఢిల్లీ లొ లిక్కర్ స్కాం,సంతోష్ కుమార్ హరితహారం లొ స్కామ్ హరీష్ రావు దండాలు సెటిల్మెంట్ ఇరిగేషన్ అక్రమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్కాం ద్వారా ఒక్కో కమిషన్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని నలుమూలల ధ్వంసం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ బిఆర్ఎస్ పార్టీని నామరూపల్లెకుండా చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నేడు తెలంగాణ లొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజలకి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ కావాలనేయూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని గతంలో కంటే ఎక్కువ యూరియాను జిల్లలో పంపిణి చేయడం జరిగిందణి రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ యూరియా కొరత ఉందంటూ ఆరోపణలు చేయడం తప్పా బి ఆర్ ఎస్ నాయకులు చేసేదేమి లేదని ఆయన అన్నారు. జిల్లా, మండల రైతులకు కావాల్సినంతా యూరియా వస్తుందని ఎవరూ కూడా అధైర్య పడవద్దని రైతులకు నడిగోటి రాము సూచించారు

మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవం..

మెట్పల్లిలో లయన్స్ క్లబ్ ఉపాధ్యాయ దినోత్సవం..

మెట్ పల్లి సెప్టెంబర్ 5 నేటి ధాత్రి

 

 

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మరియు లయన్స్ పి డి జి ఎస్ ఆనంతుల శివ ప్రసాద్ మరియు హన్మాండ్ల రాజారెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు పిల్లలకు అల్పాహారం వితరణ, బుక్స్ పంపిణి, అనంతరం కేక్ కటింగ్ చేశారు అనంతరం ప్రభుత్వ సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసి మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేల్ముల శ్రీనివాసరావు కోశాధికారి వేములవాడ చంద్రశేఖర్ ఇల్లెందుల శ్రీనివాస్ మర్రి భాస్కర్ నాంపల్లి వేణుగోపాల్ రఘుపతి రావు ఆల్ రౌండర్ గంగాధర్ లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో సీనియర్ సిటిజన్స్ గురుపూజోత్సవం…

తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గురుపూజోత్సవం కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం కార్యక్రమం చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన డాక్టర్ జనపాల శంకరయ్య ప్రధాన కార్యదర్శి కార్యనిర్వహణలో పూర్వ ఉపాధ్యాయులు, తాత్వికవేత్త ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భముగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మార్గం విశ్వనాథం ప్రధానోపాధ్యాయులు, పూర్వ ఉపాధ్యాయుడు వికృతి ముత్తయ్య గౌడ్, పుల్లూరు మల్లేశం, బుర్ర నారాయణ గౌడ్ పూర్వకన్సలర్, కౌన్సిలర్స్ పి పద్మ శంకర్, వేణు నాగరాజు, సమక్షంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జనపాల శంకరయ్య , రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గురువు త్రిమూర్తుల స్వరూపమని పెద్ద లన్నారు అందుకే గురువు లయకారుడు సృష్టికర్త అభివృద్ధి పథకం పై నడిపించగల శక్తి,యుక్తులు ఉన్న సామాజిక బాధ్యత కలిగిన ప్రధాన మైన వ్యక్తిత్వం కలిగిన ఉన్నతత్వం కలిగిన వ్యక్తి గురువు. అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య కోశాధికారి దొంత దేవదాసు, గజవాడ కైలాసం, కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం, విద్యాసాగర్, అంకారపు జ్ఞానోబా, లక్ష్మణరావు మెరుగు కిషన్ వెంకటరెడ్డి గంప శంకరయ్య, పత్తిపాక శంకరయ్య తదితర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

కల్వకుర్తి/ నేటిదాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు అధ్యక్షతన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ప్రతి రోజూ పూజలు, సంస్కృతిక కార్యక్రమలు, ప్రతి రోజూ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిలు గుండ్ల రేవంత్ రేవంత్, దాచేపల్లి నితిన్ కూమార్, కోశాధికారులు పోల గిరిబాబు, సoబు తరుణ్,ఆర్యవైశ్య మహాసభ సంఘం, అనుబంధ సంఘాలు వాసవి క్లబ్,ఆవోప సంఘల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version