పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌కు ప్రశంసా పత్రం

పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌కు ఎస్పీ ప్రశంసా పత్రం ఇచ్చారు

భూపాలపల్లి నేటిధాత్రి

సమర్థవంతమైన వాదనలతో కేసుల్లో దోష నిర్ధారణ సాధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్‌కు ప్రశంసా పత్రం

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ, క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించి న్యాయం జరిగేలా కృషి చేస్తున్న అధికారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎదులాపురం శ్రీనివాస్ ని ప్రశంసించారు.
ఎదులాపురం శ్రీనివాస్ సమర్థవంతమైన వాదనలు న్యాయపరమైన కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ సాధించారు. అందులో 7 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది.
క్రిమినల్ కేసుల్లో నిందితులకు తగిన శిక్షలు పడేలా కృషి చేసి న్యాయం సాధించడంలో విశేష పాత్ర పోషించినందుకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ చేతుల మీదుగా ఎదులాపురం శ్రీనివాస్ ప్రశంస పత్రం అందుకోవడం జరిగింది.

మహబూబాబాద్‌లో పోలీస్ అధికారుల పదవీ విరమణ ఘనంగా

సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారుల పదవీ విరమణ

మహబూబాబాద్/ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు
యాకూబ్ అలీ, ఎస్.ఐ (డీ.సీ.ఆర్.బీ)
1984 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 43 సంవత్సరాల ఘనమైన పోలీస్ సేవలు అందించారని కొనియాడారు..

బోడ తులసయ్య 1990లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి
2023లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది మొత్తం 36 సంవత్సరాల సేవలు అందించారని.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందుతున్న అధికారులకు తమ తరపున మరియు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
యాకూబ్ అలీ1984 బ్యాచ్‌కు చెందినవారై, సుమారు 43 సంవత్సరాల పాటు శాంతి భద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో, ప్రజా సేవలో విశేష సేవలు అందించారని ప్రశంసించారు. అదేవిధంగా బోడ తులసయ్య 36 సంవత్సరాల పాటు శాఖకు అంకితభావంతో సేవలందించి విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
పదవీ విరమణ అనేది జీవితంలో కొత్త అధ్యాయమని, మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని సూచించారు. నిత్యం ఏదో ఒక వ్యాపకంతో చురుకుగా ఉండాలని కోరారు.
రిటైర్మెంట్ అనంతరం లభించే బెనిఫిట్స్‌ను ప్రభుత్వ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో భద్రపరుచుకోవాలని, అధిక లాభాల ఆశ చూపే మోసగాళ్ల పట్ల మరియు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పదవీ విరమణ పొందిన వారిని కుటుంబ సభ్యులు గౌరవప్రదంగా చూసుకోవాలని, వారి మానసిక ప్రశాంతతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ నాగేశ్వర్ రావు, ఆర్. ఐ సోములు, డీ.సీ.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్….

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

అభినంధించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో
శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి
మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.

డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన.

డీజిల్ ఆధాజేసిన డ్రైవర్లను అభినంధించిన ఆర్టీసీ డిఎం

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపోలో ఇందనం పొదుపు చేసి బెస్ట్ కేఎంపిఎల్ అవార్డు పొందిన డ్రైవర్లు అశోక్ రెడ్డి, పీవి రావ్ లను, బెస్ట్ ఈపీకే తీసుకువచ్చిన కండక్టర్ యాదగిరి లను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శాలువాతో సన్మానం చేసి నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసి ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో డిపో ట్రాఫిక్ సూపర్ వైజర్ నారాయణ, ఆఫీస్ స్టాఫ్ శ్రీనివాస్, ఏఎంఎఫ్ దత్తం, ఎస్డిఐ వెంకటేశ్వర్లు,రవీందర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version