21 రకాల నైవేద్యాలతో గణపతికి పూజలు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని వీర హనుమాన్ గణేష్ మండలి వద్ద గురువారం రాత్రి మహిళలు గణేశునికి పూలతో అలంకరించి 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించి మహిళలు గణపతి దేవుని ఆశీర్వాదం పొందారు.పూజ అనంతరం మహిళలు గ్రామ ప్రజలు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతి దీవెనలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరారు.