దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ.

కల్వకుర్తి/ నేటిదాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు అధ్యక్షతన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ప్రతి రోజూ పూజలు, సంస్కృతిక కార్యక్రమలు, ప్రతి రోజూ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిలు గుండ్ల రేవంత్ రేవంత్, దాచేపల్లి నితిన్ కూమార్, కోశాధికారులు పోల గిరిబాబు, సoబు తరుణ్,ఆర్యవైశ్య మహాసభ సంఘం, అనుబంధ సంఘాలు వాసవి క్లబ్,ఆవోప సంఘల నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version