ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్…

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి..బహుమతులు పొందండి

నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. బహుమతి గెలుపొందండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాగా నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఇందుకుగాను ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల కోసం ప్రత్యేక బంపర్ లక్కీడ్రా స్కీం నిర్వహిస్తోందని చెప్పారు.ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీడీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణి కులు తమ టికెట్ పైన పేరు,ఫోన్ నెంబర్, చిరునామా రాసి నర్సంపేట బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలన్నారు.అక్టోబర్ 8వ తేదిన ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ. 15వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణి కులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ సూచించారు.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్….

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

అభినంధించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో
శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి
మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ.

ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో వేసవికాలం దృష్టిలో ఉంచుకొని అక్షయ తృతీయ సందర్భంగా డిపో మేనేజర్ రవిచంద్ర తో పాటు అరుణ ఫర్టిలైజర్ యజమాని మాజీ ఛైర్మెన్ శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం గందె వెంకటేశ్వర్లు,సంజయ్ మెడికల్ స్టోర్ యజమాని సంజయ్,గంగా వాటర్ ప్లాంట్ యజమాని లక్ష్మణ్ లు ప్రారంభించి మజ్జిగ ప్యాకెట్లు ప్రయాణికులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది,ప్రయాణికులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version