సంగారెడ్డి: వ్యక్తి అదృశ్యం.. మంజీరా నదిలో గాలింపు…

సంగారెడ్డి: వ్యక్తి అదృశ్యం.. మంజీరా నదిలో గాలింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం చాల్కీ గ్రామ శివారులో గల పాత వాటర్ ఫిల్టర్, మంజీరా నది ఒడ్డున నిన్న(శుక్రవారం) ఒక బండి, ఫోన్, దుస్తులు కనిపించాయి. అతను ఝరసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన తాటిపల్లి పాపన్న (42)గా గుర్తించారు. అతను నారాయణఖేడ్ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు సమాచారం. అయితే అతను మంజీరా నదిలో మునిగి పోయినట్లు తెలుస్తోంది. దీంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుడి కూతురి ఫిర్యాదు మేరకు హద్నూర్ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లు (కూతురు).. నేను చనిపోతున్న..?

కూతురితో.. వీడియోకాల్ లో మాట్లాడుతు మంజీరాలో దూకి ఆత్మహత్య..?
ఆర్టీసీ డ్రైవర్ పాపయ్య (42) శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై
న్యాల్ కల్ మండలం, చాల్కి గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డుకు చేరుకొని.. కూతురు స్వాతి (ముద్దు పేరు పిల్లు)తో వీడియో కాల్ లో మాట్లాడుతూ.. నేను చనిపోతున్నాను.. మీరు క్షేమంగా ఉండండి.. నాకు భయం, భయంగా ఉందంటూ ఏడుస్తూ.. వీడియో కాల్ ను మాట్లాడుతూ సెల్ ఫోను ఆపివేశాడు. భయాందోళనకు గురైన కూతురు స్వాతి (18), కుమారుడు హర్ష (15), కుటుంబీకులతో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. మంజీరానది ఒడ్డున ద్విచక్ర వాహనం, దుస్తులు, పాదరక్షలు పడి ఉండడాన్ని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నాలుగు సంవత్సరాల క్రితం భార్య శశిరేఖ ఆత్మహత్య…

సంతానంతో జీవనం కొనసాగిస్తున్నాడు. నారాయణఖేడ్ లోని ఓ ప్రైవేట్ అదృశ్యమైన పాపయ్య (42) భార్య శశిరేఖ (35) నాలుగు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా నారాయణఖేడ్ పట్టణంలో నివాసము అంటూ పాపయ్య.. ఇద్దరి కళాశాల, విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. కూతురు స్వాతి (18) ఇంటర్, కుమారుడు హర్ష (15) 9వ తరగతి చదువుతున్నారు. కూతురు స్వాతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ద్విచక్ర వాహనాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు.

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్….

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

అభినంధించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో బస్టాండ్ లో
శుక్రవారం ఉదయం 6గంటలకు నర్సంపేట నుండి వేములవాడ బస్సు ముందుగా ఎక్కిన నర్సంపేట టౌన్ ఎన్జీవో కాలనీకి చెందిన కీసర రజిత అనే ప్రయాణికురాలు దిగి వెంటనే హన్మకొండ బస్సు ఎక్కి
మనీ పర్సు పోగొట్టుకుంది.బస్సు డ్రైవర్ మహేష్ సహకారంతో బస్టాండు కంట్రోలర్ మల్లికార్జున్ ఆ మనిపర్సు అందజేశారు.కాగా అందులో ఆధార్ కార్డు, రూ.7200 నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆ ప్రయాణికురాలకు రజిత అందజేశారు.నిజాయితీ చాటుకున్న సిబ్బంది డ్రైవర్ మహేష్ ను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version