లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది…

లంగాణ లో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్అవుతుంది

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము

మొగులపల్లి (నేటిధాత్రి ):

 

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో నడిగోటి రాము మాట్లాడుతూ. తెలంగాణలో టిఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని ఆయన అన్నారు గంపగుత్తగా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గుంట నక్కల దోచుకొని దాచుకొని అవినీతి, దోపిడీ, దొంగతనాలను పిసి గోష్ కమిషన్ ద్వారా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక లిక్కర్ రాణిని తెరపైకి తీసుకువచ్చి మళ్ళీ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి మీ కల్వకుంట్ల కుటుంబం ద్వారా చాలా తీరని అన్యాయం జరిగింది. ఎన్నో అవినీతి అక్రమాలు ఎక్కడ చూసినా కమిషన్లు పదేళ్లు మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తియడమే కాకుండా లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారు. మీ కల్వకుంట్ల కుటుంబం బండారం బయట పడేసరికి వాళ్లు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు. అని నువ్వు అనడం మరునాడు నిన్ను మీ అధినేత సస్పెండ్ చేయడం ఇదంతా సినిమా లా అనిపిస్తుంది. స్క్రిప్ట్ ముందే రాయడం జరిగింది. కేసీఆర్ కాలేశ్వరం స్కామ్ కేటీఆర్ ఫోన్ టాపింగ్, ఈ రేసింగ్ స్కామ్, కవిత ఢిల్లీ లొ లిక్కర్ స్కాం,సంతోష్ కుమార్ హరితహారం లొ స్కామ్ హరీష్ రావు దండాలు సెటిల్మెంట్ ఇరిగేషన్ అక్రమాలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో స్కాం ద్వారా ఒక్కో కమిషన్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని నలుమూలల ధ్వంసం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లొ బిఆర్ఎస్ పార్టీని నామరూపల్లెకుండా చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
నేడు తెలంగాణ లొ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజలకి సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించడంలో నిరంతరం కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ కావాలనేయూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని గతంలో కంటే ఎక్కువ యూరియాను జిల్లలో పంపిణి చేయడం జరిగిందణి రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ యూరియా కొరత ఉందంటూ ఆరోపణలు చేయడం తప్పా బి ఆర్ ఎస్ నాయకులు చేసేదేమి లేదని ఆయన అన్నారు. జిల్లా, మండల రైతులకు కావాల్సినంతా యూరియా వస్తుందని ఎవరూ కూడా అధైర్య పడవద్దని రైతులకు నడిగోటి రాము సూచించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version