మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు..

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు

వినాయక నిమజ్జనానికి భద్రతా సూచనలు – ఎస్సై రాజేష్..

నిమజ్జన సమయాల్లో జాగ్రత్తలు పాటించాలి..

ఎస్సై రాజేష్

నిజాంపేట: నేటి ధాత్రి

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువులు, కుంటలు అధికంగా నిండాయని నిమజ్జన సమయంలో మండప నిర్వహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు కుంటల వద్దకు తీసుకువెళ్లొద్దన్నారు. శాంతియుత వాతావరణం లో పండగలు నిర్వహించుకోవాలని సూచించారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలన్నారు

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి…

వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ డివిజన్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డి.ఎస్.పి సైదా సూచించారు. మంగళవారం జహీరాబాద్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వినాయక మండపం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డిజె సౌండ్ వాడవద్దని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలపై విజ్ఞప్తి.

వినాయక నవరాత్రి ఉత్సవాలపై విజ్ఞప్తి.

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ ని కలిసిన “రాష్ట్రీయ హిందూ పరిషత్” వరంగల్ జిల్లా కమిటీ.

వరంగల్, నేటిధాత్రి.

 

వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ ని, రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మడిపెళ్లి నాగరాజు గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గణపతి నవరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని వరంగల్ పట్టణంలో అనేక భక్తులు వినాయక ఉత్సవ కమిటీలు స్థాపించి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మండపాల వద్ద భద్రతా చర్యలు, పర్మిషన్ల జారీ ప్రక్రియలో ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతినిధులు డీసీపీని కోరారు.
అలాగే మండపాల నిర్వహణపై అవగాహన కలిగిస్తూ వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శివరామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యుడు గోగీకర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version