వీధుల్లో కొత్త వ్యక్తులు కదలికలపై 100 కు డయల్ చేయండి…

వీధుల్లో కొత్త వ్యక్తులు కదలికలపై 100 కు డయల్ చేయండి
గణపురం ఎస్సై రేఖ అశోక్
గణపురం నేటి ధాత్రి 
https://youtu.be/sai65LRr7hk?si=AP_U0noezyXyTWvF
గణపురం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రేఖ అశోక్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ పండగకు ఊరెళ్తున్నారా జరభద్రం
దసరా పండగ సందర్భంగా ఊర్లకు వెళ్ళేవారు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వండి..  
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ. పరిమిత వేగంలో ప్రయాణించండి.. 
మద్యం సేవించి వాహనం నడపరాదు. రాత్రి పూట డ్రైవింగ్‌లో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
పండగ సమయంలో దొంగతనాలు, ఆస్తి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. దసరా పండగ సెలవుల దృష్ట్యా స్కూల్స్, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా వరకు సొంత గ్రామాలకు కానీ, ఇతరప్రాంతాలకు గాని ప్రయాణాలు చేస్తూంటారు. ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారాని, ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లోకల్ పోలీసులకు సమాచార ఇవ్వాలి .  ప్రయాణాలలో హెల్మెట్, సీట్ బెల్ట్ దరించి, పరిమిత వేగంలో వెళ్లాలని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, జాగ్రతగా వాహనాలను నడుపుతూ క్షేమంగా గమ్య స్థానాలకు  చేరుకోవాలి ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. 
ఊర్లకు వెళ్తున్నప్పుడు పక్కింటి వారిని ఇంటి పరిసరాలను గమనించాలి విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. 
ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. 
ఊళ్ళకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, ఇంటి బయట ఒక లైటు వేసి ఉంచాలి.
ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి.
ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
సిసి కెమెరాలను ఇంటర్నెట్ కు అనుసంధానం చేస్తే మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా  ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. 
ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి.
అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి.
సుదూర ప్రాంతాల ప్రయాణాలకు వెళుతున్నట్లైతే, సమీప పోలీసు స్టేషన్ లలో మీ ఫోన్ నంబర్స్ ఇచ్చి వెళ్లాలని, తద్వారా ఎలాంటి విపత్కర పరిస్థితులలో నైనా గుర్తించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా గంజాయి వినియోగదారులు  కనిపించినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వగలరు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును . అదేవిధంగా ఇంటి నిర్మాణం ఇతర పనుల నిమిత్తం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి పనివాళ్లను తీసుకొచ్చినట్లయితే ముందుగా వారి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయించవలెను అదేవిధంగా వారి ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పోలీస్ స్టేషన్ నందు ఇవ్వగలరు రాత్రి సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినట్లయితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. ఫోన్ నెంబర్స్_ 8712 658122 +8712658143 ఈ నెంబర్లకు డయల్ చేయాలని ఎస్ ఐ ఆర్ అశోక్ తెలిపారు

కార్మిక సంఘానికి కొత్త కమిటీ ఏర్పాటైంది…

కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ప్రజలు అందరూ రావాలి…

కాప్రా నేటిధాత్రి

 

 

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ఈసీఐఎల్ సిఐటియు కార్యాలయంలో జరిగినాయి
ఈమహాసభలో అధ్యక్షులు సిహెచ్ అశోక్ కార్యదర్శిగా జే వెంకన్నలు ఎన్నిక కావడం జరిగింది కార్యనిర్వహణ అధ్యక్షులు సి . కుమార్
ఉపాధ్యక్షులుగా డీకే దుర్గయ్య పి గంగారాం కే శ్రీనివాస్ కే యాదగిరి టి శ్రీనివాస్
సహాయక కార్యదర్శులుగా కార్యదర్శులుగా సిహెచ్ జంగయ్య ఎం కృష్ణమ్మ ఏ వేణు
కోశాధికారిగా పి ప్రభాకర్
మరియు 13 మంది కమిటీ సభ్యులు తో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని భవన నిర్మాణ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అశోక్ జె వెంకన్నలు ఒక ప్రకటనలో తెలిపినారు.

Claim Compensation for Pothole Vehicle Damage….

Pothole Damage? You Can Claim a Refund Under Consumer Law

The Danger of Potholes

Potholes on our roads are not just an inconvenience. They cause serious damage to vehicles and are responsible for many accidents every year. What most citizens don’t know is that they have a legal right to claim compensation—a refund for the damage suffered.

⚖️ Legal Responsibility

Under the Consumer Protection Act and the Motor Vehicle Act, the responsibility of maintaining safe roads lies with civic authorities. These include the Municipality, Roads & Buildings Department (R&B), and the National Highways Authority of India (NHAI). If these agencies fail to maintain roads properly, they can be held accountable.

What To Do If Your Vehicle Is Damaged

If your vehicle suffers damage due to a pothole, it is important to collect proper evidence:

Take photos and videos of the pothole.

Keep repair bills and receipts of the damage.

File a complaint with the concerned municipal or highway authority.

️ Next Step: Consumer Forum

If the authority does not respond or refuses to take action, you can approach the District Consumer Forum. With sufficient evidence, the forum can order the concerned department to pay compensation (refund of expenses) for your losses.

Example Cases

In several past judgments, courts have directed civic authorities to pay not just the repair costs, but in some cases also additional compensation for the mental agony caused. This sets a strong precedent that pothole-related damages are not just “bad luck” but a matter of consumer rights.

✅ Your Right as a Citizen

The next time your vehicle is damaged because of potholes, don’t remain silent. Collect evidence, file a complaint, and assert your rights. The Consumer Protection Act is there to protect you.

ఆలయం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి సీతక్క…

ఆలయం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి సీతక్క

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ దేవాలయం లో అభివృద్ధి పనులకు అటవీశాఖ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు మంజూరు
కోటి యాభై లక్షల రూపాయల తో పలు అభివృద్ధి పనులకు కృషి చేస్తున్న మంత్రి సీతక్క
రూపురేఖలు మారనున్న గుంజేడు ముసలమ్మ దేవాలయం
సకల సౌకర్యాలు ఏర్పాటు కు కృషి చేస్తున్న సీతక్క
నవంబర్ చివరి
నాటికల్ల పనులు పూర్తి జరుగుతాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ముసలమ్మ దేవాలయం పరిధిలో
10 షాపింగ్ రూములు
రెండు హోమ్ షెడ్లు మినరల్ వాటర్ ప్లాంట్ పార్కింగ్ ప్లస్
రోడ్డుకుఇరువైపులా ఫెన్సింగ్ ముసలమ్మ గుట్టకు దారి.తదితరులు అభివృద్ధి పనులు త్వరగతిగా కొనసాగుతున్నయి…

విద్యార్థులకు మొక్కల పంపిణీ…

విద్యార్థులకు మొక్కల పంపిణీ
• నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి.
• ఎంపీడీవో రాజీరెడ్డి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి…

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన కొనారి రఘువీరా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి వారి కుటంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామంలో కొద్దిరోజులక్రితం మరణించిన పోగు సారయ్య(భగవంతుడు) కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో..సెప్టెంబర్ 22న చలో హైదరాబాద్.

ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్తో..సెప్టెంబర్ 22న చలో హైదరాబాద్.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ (టి యు సి ఐ) ఆధ్వర్యంలో కేజీ బీవీ హాస్టల్ వర్కర్స్ సమస్యలపై ఛలో హైదరాబాద్ సెప్టెంబర్ 22న ఉద్యోగ భద్రత కల్పించాలని , పిఎఫ్ ఈఎస్ఐ గ్రాటివీటి చట్టాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని విద్యార్థుల సంఖ్య కనుగుణంగా వర్కర్ల ఉద్యోగుల సంఖ్య పెంచాలని డిమాండ్తో చలో హైదరాబాద్ కార్యక్రమానికి అధికంగా కదిలి రావాలని చారకొండ, వంగూరు, వెల్దండ, ఊరకుండా,కల్వకుర్తి హాస్టల్లో కరపత్రల పోస్టర్ ద్వారా ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా నాయకులు ఆంజనేయులు, పద్మ, శ్రీలత,బికినీ లక్ష్మి,జయ,శివ లీల తదితరులు పాల్గొన్నారు.

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు…

రోడ్లపై సంచరించే ఆవులతో తరచూ రోడ్డు ప్రమాదాలు

తాండూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీ మరియు మాదారం గ్రామంలో ప్రధాన రహదారులపై,కాలనీల్లో ఆవులు నిర్బంధం లేకుండా సంచరించడం వలన వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్ అన్నారు.ముఖ్యంగా రాత్రి సమయంలో ఆవుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని,ప్రజల ప్రాణ భద్రతకు ముప్పుగా మారుతుందని అన్నారు.కాబట్టి దయచేసి ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకొని,ఆవుల యజమానులకు నోటీసులు జారీ చేసి,అవసరమైతే జరిమానాలు విధించడం గాని లేదా ఆవులను గోశాలలో ఉంచే చర్యలు గాని తీసుకోవాలని ఎంపీడీఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం…

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటిదాత్రి చర్ల

చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బోధనెల్లి గ్రామంలో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ
గ్రామంలోని ఇంటింటికి రాపిడ్ ఫీవర్ సర్వే చేస్తూ డ్రై డే కార్యక్రమాలు చేయించడం జరిగింది
జ్వరాలు వస్తే ఆశ్రద్ధ చెయ్యకుండా పి హెచ్ సి రావలెను మరియు అన్ని పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి అని గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు
అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని
దోమ తెరలను వినియోగించుకోవాలని
ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని అన్నారు
గర్భిణి స్త్రీలను పరీక్షించి అవసరమైన పరీక్షలు చేశారు
ముగ్గురికి జ్వరం ఉన్నది వారికి ఆర్డిటీ మలేరియా పరీక్షలు చెయ్యడం జరిగింది వారికి మలేరియా లేదని వారికి మాములు జ్వరంగా నిర్దారించి మందులు ఇవ్వడం జరిగింది
మరియు 32 మందికి సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
హెచ్ ఈ ఓ బాబురావు
ఎం ఎల్ హెచ్ పి సంధ్య
ఏఎన్ఎమ్ కవిత
హెల్త్ అసిస్టెంట్ వరప్రసాద్
ఆశా కార్యకర్తలు
తదితరులు పాల్గోన్నారు

బాధిత కుటుంబానికి పరామర్శ.

బాధిత కుటుంబానికి పరామర్శ.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో నీ గణేష్ పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించినా నాగలగాని కమల వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జయశంకర్ భూపాలపల్లి జిల్ల అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి*
వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు మండల అధ్యక్షులు మోరే వేణుగోపాల్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి నేరెళ్ల శంకర్ తదితరులు ఉన్నారు

స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..

స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..

ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ
రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి యాజమాన్యం మూడుసార్లు జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్ జారీ చేసి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో పిట్ సెక్రటరీ ఎన్. రమేష్ అధ్య క్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ మోటాపలుకుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం గతంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమస్యలను పరిష్కరించకపోవడంతో సింగరేణి సి.ఎం.డితో జరిగే స్ట్రక్చర్ మీటింగ్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. అట్లాగే యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35శాతం లాభాలవాటా ఇవ్వాలని కోరారు. గతంలో సింగరేణిలో ఎన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం ఎక్కువైందని దాంతో కార్మిక సమస్యలు పెండింగ్ పడుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ గేట్ మీటింగ్ లో బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోషం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ జి. రవికుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎన్, సతీష్, టెంపుల్ కమిటీ చైర్మన్ ధనుంజయ్, సలహాదారులు రమేష్, పిట్ కమిటీ సభ్యులు. ఎన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి…

రాష్ట్ర జట్టుకు ఎంపికైన గురుకుల విద్యార్థి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి బాలబాలికల 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు కావేరి పార్ధు జాతీయస్థాయికి అర్హత సాధించినట్లు,వ్యాయామ ఉపాధ్యాయులు గాంధార్ల సంతోష్,పిడి.రత్నం శ్రీనివాస్,పి.ఇ.టి,తెలిపారు.సెప్టెంబర్ 26 నుండి 29 వరకు హైదరాబాదులోని నిజాం కాలేజీలో జరిగే,జాతీయ స్థాయి 17వ మినీ హ్యాండ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు,
ప్రిన్సిపల్ కోల నాగేశ్వరరావు తెలిపారు.వీరిని పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్రవంతి,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ మహిపాల్, హౌస్ మాస్టర్ స్వర్ణలత,ఉపాధ్యాయ బృందం అభినందించారు.

టేకుమట్ల మండల కేంద్రంలోని ఇసుక క్వారీ రద్దు చేయాలి….

టేకుమట్ల మండల కేంద్రంలోని ఇసుక క్వారీ రద్దు చేయాలి

ఎలుకటి రాజయ్య టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు

సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండల కేంద్రం చలివాగులోని ఇసుక క్వారీని రద్దు చేసి సహజ వనరులను కాపాడాలని టీఎస్ టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ,సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ లు కోరారు. ఈ సందర్బంగా వారు చలివాగులోని ఇసుక క్వారీని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక దందా జరుగుతుందని, ఒక ట్రిప్పుకు పర్మిట్ తీసుకుని అనేక ట్రిప్పులు ఇసుక రాత్రి అనక పగలు అనక తరలిస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారని,ఇసుకను విచ్చలవిడిగా డంపులు చేస్తూ లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారని అన్నారు.ఈ దందా చేస్తున్న అధికారపార్టీ, మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు మండల ఉన్నత అధికారులపై ఒత్తిడి చేసి పర్మిట్లు ను మరియు పట్టుబడిన వాహనాలను విడిపించుకుంటున్నారని, చిట్యాల మరియు రేగొండ మండలాలకు సంబందించిన ట్రాక్టర్లు అధిక సంఖ్యలో డంపులు చేస్తూ ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు.కంచె చేను మేస్తే కాపాడేవారు ఎవరు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతుందని, ట్రాక్టర్ డ్రైవర్లు అధిక వేగంతో, ఇష్టరీతిన నడుపుతుండటం మూలంగా దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ దందా ఈవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో సాగు, తాగు నీరుకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని, ఇకనైనా అధికారులు స్పందించి టేకుమట్ల ఇసుక క్వారిని రద్దు చేసి టేకుమట్ల ప్రాంత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మాత్రమే పర్మిట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..

తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను…

తల్లి పేరు తో ఒక మొక్క నాటవలెను

ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

జన్మనిచ్చిన కన్నతల్లి పేరు తో ప్రతి ఒక్కరు మొక్కను నాటి అది వృక్షమయ్యే వరకు సహకరించాలి ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహమ్మద్ సలీం తెలిపారు తల్లి పేరున ఒక మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కోమటి కొండాపూర్ మరియు వర్షకొండ గ్రామాలలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా మరియు సంబంధిత గ్రామ ప్రజలందరూ కూడా వారికి అన్వైనటువంటి స్థలాలలో వారికి జన్మనిచ్చినటువంటి తల్లి పేరున మొక్కలు నాటి సంరక్షించుకోవడం వలన రాబోయే తరానికి మంచి ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వారవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ మరియు పంచాయతీ కార్యదర్శి సరిత ప్రవీణ్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి…

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి

◆:- బీమా పథకాలపై అవగాహన

◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22 నుండి ప్రారంభం అవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం చార్యులు ఈ వో రామన్ గౌడ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు 22న మహాలక్ష్మి అమ్మవారు 23న సంతాన లక్ష్మి 24న ధైర్యలక్ష్మి 25న విజయలక్ష్మి 26న ధనలక్ష్మి 27న గజలక్ష్మి 28న ఐశ్వర్య లక్ష్మి 29 న శౌర్యలక్ష్మి.30న సౌభాగ్య లక్ష్మి దుర్గాష్టమి 1న ఆదిలక్ష్మి దేవి 2 న విజయదశమి దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు సాయంత్రం 6 గంటలకు శమి పూజ ఉంటుందని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు శమి వినియోగం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు భక్తులు నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొనేవారు అభిషేకాలు అర్చనలు పూజలు చేయించేవారు ఆలయంలో సంప్రదించాలని వారు కోరారు

మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్…

మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్

* ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల, నేటిధాత్రి :

 

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ పుట్టిన రోజునుపురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణ కేంద్రంలో బుధవారం కేజీఆర్ కన్వెన్షన్ హాల్ లో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అవకాశాన్ని మహిళలు, చిన్నపిల్లల కు డయాబెటిస్, డెంటల్, కలరా, సాదరణ ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 74 మంది యువత రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సహకారం అందించిన యువతను అభినందించారు.

 

 

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. నరేంద్ర మోడీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నేరంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశప్రగతి పురోగతి సాధించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు.
పార్లమెంట్ లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించి సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బిజెపి యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి , మండల అధ్యక్షులు శ్రీకాంత్, అనంతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కొంచెం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శర్వలింగం, మాణిక రెడ్డి, శర్వలింగం, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, పెద్దోళ్ల కృష్ణ, బిజెపి శ్రేణులు వైద్య అధికారులు, అంగనివాడి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

సిద్ధాపూర్ వద్ద చిరుత పులి కలకలం: ప్రజల్లో భయాందోళనలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T144714.916.wav?_=1

 

సిద్ధాపూర్ వద్ద చిరుత పులి కలకలం: ప్రజల్లో భయాందోళనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం పట్టి సిద్ధాపూర్ వద్ద జహీరాబాద్-తాండూర్ రహదారిపై శుక్రవారం ఉదయం చిరుత పులి కనిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జహీరాబాద్ నుంచి సిద్ధాపూర్, కుంచారం నుంచి జహీరాబాద్ వెళ్లే మార్గాల్లో రాకపోకలకు ప్రజలు భయపడుతున్నారు. ఐదు నుంచి ఆరు మంది గుంపులుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి బారి నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఈ సమాచారాన్ని వినయ్ పవర్, AITF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, NHCR చైర్మన్ అందించారు.

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T143955.810.wav?_=2

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

“నేటిధాత్రి”, బిగ్ బ్రేకింగ్

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

యూరియా కై..రాత్రి వేళలో పడిగాపులు.

లోడ్ వచ్చిన పంపిణీ. జరగడం లేదు.

అధికారులు స్పందించి.. పంపిణీ చేయాలని వేడుకోలు.

కుండ పోత వర్షం పడిన రైతులు పడిన కాపులు కాస్తున్నారు.

రైతు వేదిక వద్ద కరెంటు సప్లై లేకున్నా ఫోన్ లైట్ ద్వారా చూసుకుంటూ పడిగాపులు కాస్తున్న రైతులు.

“నేటిధాత్రి”,నిజాంపేట, మెదక్

రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.

urea shortage in Nizampet, Medak

సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.

urea shortage in Nizampet, Medak

యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.

urea shortage in Nizampet, Medak
urea shortage in Nizampet, Medak
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version