గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

బ్రేకింగ్ న్యూస్

నేటిధాత్రి, హైదరాబాద్.._

కొండా మురళీ పిర్యాదు లేఖ..

హైదరాబాదులోని గాంధీభవన్లో ఈరోజు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ లేఖ.

హైదరాబాద్ నేటిధాత్రి:

2007లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు.

నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది.

వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేను సీట్లు కేటాయించాను. ఎందుకంటే, అట్టడుగువర్గాలకే న్యాయం జరగాలన్నది నా సిద్ధాంతం. నేను నా రాజకీయ పంథాను ప్రారంభించిందే నిమ్న వర్గాలకు న్యాయం చేయాలని.

వరంగల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలు నిమ్నవర్గాలకు కేటాయించడంలో నాడు నాదే కీలక పాత్ర.

వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఒక దాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత, గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేసిన.

కాగా, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేని విధంగా ఒక జిల్లాలో రెండు స్థానాలు రిజర్వు కావడం కేవలం వరంగల్ లో మాత్రమే సాధ్యం అయింది. అందు కోసం నేను తీవ్రంగా కృషి చేశాను.

సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా… ఈ ప్రక్రియతో తాను సీటును కోల్పోయానని… అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి…. అందుకు నేనే(కొండా మురళీయే) కారణమని చెబుతూ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళిన పరిస్థితి ఉన్నది.

అయితే, నేడు ఆయన అల్లుడు అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, వరంగల్ జిల్లా ఇంఛార్జీ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశితంగా అర్థం అవుతున్నది.

వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయినా, మేము వారికి ఎక్కడా ఇబ్బందులు చేయలేదు.

ఇదే బస్వరాజు సారయ్య, మా వరంగల్ ఈస్టు నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 వేల ఓట్లతో ఓడిపోయారు.

ఎమ్మెల్సీ బస్వారాజు సారయ్య, రామసహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్ గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిలుచున్నాము.

ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కు చెందిన నాయకులు. ఆయన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే, ఆ ఎన్నికల్లో కొండా సురేఖకు ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ, నరేందర్ రెడ్డికి కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఇక డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈరోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మేము(నేను నా సతీమణి) వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇదీ వరంగల్ లో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన. అది నా నిబద్ధత. కొంతమంది లీడర్ల మాదిరి పార్టీ మారినా… పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెల్సిన ఏకైక ఎమ్మెల్సీని. ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డ మహేష్ కుమార్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగింది.

వర్ధన్నపేట – కేఆర్ నాగరాజు

ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది.

ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు.

వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కాక మునుపు… ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలకు అడ్డు నిలిచి పోరాడినందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

అయితే, ప్రస్తుత ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు అంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకు రమ్మని పిలిచినా వచ్చి వెళతారు.
మాతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి.

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను (కొండా మురళీ) నిలుచోవాలని అక్కడి ప్రజల నుంచే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి.

కానీ, ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండా సురేఖ వరంగల్ ఈస్టు నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచే రెండో నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు.

ఈ నియోజకవర్గంతో నాకు (కొండా మురళికి) చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే.

గతంలో మదుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను.

వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్టు చేసినం. ఆ సమయంలో మా సపోర్టును ఆయన అడిగారు. మేము కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశాము.

అయితే, ఈయన ప్రస్తుతం మా మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోచనీయం.

అయితే, ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి.

ములుగు సీతక్క

మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే, కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండా సురేఖకు…. మంత్రి సీతక్క కు గ్యాప్ వచ్చిందని, కావాలని కొన్ని పేపర్లలో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు.

పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే (కొండా సురేఖ, కొండా మురళి దంపతులదే). గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండా సురేఖ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. మంత్రిగా కొనసాగిన విషయంలో అందరికీ తెలిసిందే.

ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి మండలంలో కొండా మురళి, కొండా సురేఖకు ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలున్నారు. ఇది జగమెరిగిన సత్యం.

ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డి మా మద్దతు అడిగారు. మేము నిస్వార్ధంగా ఆయనకు సపోర్టు చేసినం. మా మద్దతుతోనే గెలిచారు.

ఈరోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గుడుపుఠాణి కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే… వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేయిస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు… ఇతర నియోజకవర్గంలోనే నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్ కి నష్టం. ఇది జిల్లాలో అందరికి తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపరు.

ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో అక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వచ్చే సాహసం చేయలేదు. కానీ, ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు.

ఆయన మాటలతో అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు ఎదురైతే ఎవరిది బాధ్యత?

వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి

నాయిని రాజేందర్ ఈ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ, ఎన్నికల ముందు వచ్చి మా (కొండా దంపతుల) మద్దతు అడిగారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను ఎన్నికల కదనరంగంలో తట్టుకోవాలంటే తనకి మా మద్దతు కావాలని ప్రాధేయ పడ్డారు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీతో వరంగల్ తూర్పులో తిరుగుతున్నారు.

వరంగల్ ఈస్టులో ఎలక్ట్రిసిటీ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకుంటున్నారు మా ప్రమేయం లేకుండానే, ముఖ్యంగా రెడ్డి అధికారులకు పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నారు.

తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టింగులు ఇచ్చుకోవడం ఏంటి?

ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి…. మాకు సమాచారం లేకుండా మా అధికార పరిధిలోకి చొచ్చుకురావడం సహేతుకం కాదు కదా.

జనగామ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాతో బాగానే ఉంటున్నరు.

స్టేషన్ ఘనపూర్: కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను ముంచి మన పార్టీలోకి వచ్చిండు. స్థానిక కాంగ్రెస్ ఇంఛార్జీ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నడు. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నడు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పినా… నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుస్తున్నది.

పాలకుర్తి యశశ్వినీ రెడ్డి:

ఈమె యాంటీ దయాకర్ రావు వర్గమే. నేను ఎన్నికల సమయంలో ఆమెకు బాగా సపోర్టు చేసిన. అన్ని విధాలుగా అండగా నిలిచిన. నన్ను ఇక్కడి నుంచి నిలబడాలని చాలామంది చెప్పినా… నిలబడకుండా వారికే మద్దతు ఇచ్చి గెలిపించినం.

డోర్నకల్: రాంచంద్రనాయక్: ఈ నియోజకవర్గంలో మనకు పెద్దగా పట్టు లేదు. కానీ, ఏజెన్సీ ఏరియా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంలో నాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగు ఉన్నది. నేను కూడా అక్కడి వారు ఎవరు వచ్చినా వారి పనులు చేయడం జరుగుతున్నది.

మహబూబాబాద్: ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేం నరేందర్ రెడ్డి కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు. ఒక దఫా వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ మీద కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే… ఆయనకు కేవలం 2 వేల ఓట్లు వచ్చాయి. డిలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయిందని… అందుకు నేనే కారణమని నాపై కోపంతో ఉన్నట్టు ఉన్నారు వేం నరేందర్ రెడ్డి.

రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన.

— రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన
• ఎమ్మార్వో
శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ మెరకు నిజాంపేట లో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల సమస్యల పరిశీలన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల సమస్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలోని గాంధీనగర్ వాస్తవ్యులు ఎలిగేటి సంధ్యారాణి మురళి ఆర్టిసి డ్రైవర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి పూజ అనంతరం ఆలయానికి 5,000 రూపాయలతో నక్షత్ర హారతిని ఇతర పూజ సామాగ్రిని ఆలయానికి అందజేశారు పూజ అనంతరం ఆలయ అర్చకులు మురళి సంధ్యారాణి దంపతులకు తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కమిటీ సభ్యులు మూల శ్రీనివాస్ గౌడ్ బండారు శంకర్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మాదాసు మొగిలి పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్ రేవూరి.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్, రేవూరి

భూపాలపల్లి నేటిధాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కింటుకూరు మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో ఈనెల 18వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, వారి సంస్మరణ సభ శనివారం గాజర్ల స్వగ్రామం వెలిశాలలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి లు పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలిద్దరూ పరామర్శ తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి యువకుడిగా ఉన్న రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి, అడవి బాట పట్టి సుమారు 33 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్లో మృతి చెందారు. కాగా, వారి స్వగ్రామం వెలిశాలలో జరుగుతున్న సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో గాజర్ల అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో , పాల్గొన్నారు

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మున్సిపల్ కమిషనర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, మున్సిపాలిటీ కమిషనర్ గా సుభాష్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు.సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ అభినందనలు

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ అభినందనలు

◆ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ నియమితులైనందుకు స్వాగతించిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అలీ అలీమ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ ముహమ్మద్ కాలనీ ముహమ్మద్ సలీమ్, ప్రధాన కార్యదర్శి, ఆయనను అభినందించారు మరియు జహీరాబాద్ కమిషనర్‌గా నియమితులైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మునిసిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం తనను సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ముహమ్మద్ సలీం సద్దాం హుస్సేన్ షేక్ ఖలీద్ పాషా అబూ యూసఫ్ రిజ్వాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు.

జాతీయ స్థాయి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు.
దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపిక అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:

జగిత్యాల జిల్లా – 2

ములుగు జిల్లా – 2

మెదక్ జిల్లా – 1

వికారాబాద్ జిల్లా – 1

మంచిర్యాల జిల్లా – 1

యాదాద్రి జిల్లా – 1

నిర్మల్ జిల్లా – 1

సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )
ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గారి నుండి సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు.
ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం.

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చెపిస్తే క్రిమినల్ కేసులు తప్పవు.

జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐ.పీ.ఎస్

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం జులై 01 నుండి 31తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశించారు.
ఆపరేషన్ ముస్కాన్-11కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున వివిధ శాఖల అధికారులతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ….ఆపరేషన్ స్మైల్ -11లో పాలుపంచుకొంటున్న ప్రతి ఒక్క అధికారి సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా విధులు నిర్వహించాలన్నారు.

ప్రతీ ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైనదని దానిని అనుభవించటం ప్రతీ పౌరుని హక్కు అని,క్షణికావేషంలో పిల్లలు తొందరపాటులో చిన్న చిన్న విషయాలకే తల్లి దండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని,ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వారిని ప్రమాదకర పనుల్లో వారితో పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.

 

 

 

 

 

 

 

సిరిసిల్ల,వేములవాడ డివిజన్ స్థాయిలో ఒక ఎస్.ఐ మహిళా పోలీస్ అధికారి, నలుగురు సిబ్బంది, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో ఏర్పాటు చేసిన రెండు టీమ్స్ జిల్లాలో పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పలు పరిశ్రమలు,హోటల్స్,వ్యాపార సముదాయాలు, గోదాములు,మెకానిక్ షాపులు,హోటల్స్, ఇటుక బట్టిలు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. స్కూల్స్ కు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల డ్రాపౌట్ అయిన పిల్లల తల్లి దండ్రులకు నచ్చ చెప్పి తిరిగి వారిని పాఠశాలకు పంపే ఏర్పాటు చేసి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలన్నారు. ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే పోలీస్ వారికి సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు.18సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయుస్తున్న వారిపై 2024 సంవత్సరంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ లో 21 మందిపై క్రిమినల్ కేసులు,ఈ సంవత్సరం జనవరిలో నిర్వహించిన అపరేషన్ స్మైల్ కార్యక్రమంలో 08 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని ఈసందర్భంగా గుర్తు చేశారు.ఈసమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సిరిసిల్ల ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, dwo లక్ష్మీరాజాం,drdo శేషాద్రి, సి.ఐ లు నటేష్,నాగేశ్వరరావు,అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ హమ్మద్, మెడికల్ &హెల్త్ నుండి డాక్టర్ నయుమ్ జహా, విద్య శాఖ నుండి కోర్దినేటర్ సతీష్ కుమార్,షీ టీం ఏ.ఏఎస్.ఐ ప్రమీల,పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.

లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగినది. అధ్యక్షులుగా రాంపల్లి శ్రీనివాస్ కార్యదర్శిగా పాకాల మోహన్, కోశాధికారిగా గొడుగు అంజయ్యలను ఎన్నుకున్న అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర బద్రేషం, రీజియన్ చైర్మన్ కొల్లూరి జితేందర్, జోన్ చైర్మన్ కర్ర ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ మైక్రో కాబినెట్ మెంబెర్ గోలి మధుసూదన్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ కర్ర శ్యాంసుందర్ రెడ్డి, కోచైర్మన్ కొడిమ్యాల వెంకటరమణ, రీజియన్ సెక్రెటరీ యం.మల్లేశం, డైరెక్టర్స్ కర్ర రాజిరెడ్డి, ముదుగంటి రాజిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, చాడ దామోదర్ రెడ్డి, కోట్ల మల్లేశం, మచ్చ గంగయ్య, మోర కేత, శారద, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

నల్లాల ఓదెలు ని పరామర్శించిన కోనేరు కోనప్ప.

నల్లాల ఓదెలు ని పరామర్శించిన కోనేరు కోనప్ప

మందమర్రి నేటి ధాత్రి:

మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని పరామర్శించిన మాజీ సిర్పూర్ శాసనసభ్యులు శ్రీ కోనేరు కోనప్ప
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేడు మాజీ చెన్నూర్ శాసనసభ్యులు నల్లాల ఓదెలు ని కలిసి ఆరోగ్య స్థితి ని తెలుసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యం తో ఇబ్బందిపడుతు ఇటీవలే కోలుకున్న నల్లాల ఓదెలు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ను గెలిపించండి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు నేటిధాత్రి:

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ వెంకట్రావుపల్లి శక్తి కేంద్రం ఇంఛార్జి బద్ధం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో వికసిత భారత్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ లు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విఫలం అయిందని, రెండున్నర సంవత్సరాలు పూర్తి కాకముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీకొడుతున్నారన్నారు. తెలంగాణలో త్వరలో జరుగబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. తెలంగాణ వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని వారు జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, దైవల తిరుపతి గౌడ్, మడికంటి శేఖర్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి వంచ మనోజ్, మల్లయ్య, గోపు అనంత రెడ్డి, నాయకులు, ప్రజలు, తదితరులు హాజరయ్యారు.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు
ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు

ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

Singareni

 

 

“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”

 

Singareni

 

“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”

 

Singareni

 

 

ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి వేడుకలు…

మందమర్రి నేటి ధాత్రి:

*కార్మిక మరియు గనుల శాఖ మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలు మందమర్రి మార్కెట్ సంజయ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నూరు నియోజక యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేరటి వెంకటేష్,రాయబారపు కిరణ్,చిప్పకుర్తి శశిధర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు భారతరత్న అవార్డు గ్రహీత, తొలి తెలుగు ప్రధాని
తెలంగాణ నుండి కూడా మొట్టమొదటి ప్రధాని మంత్రి అని
బహుభాషా కోవిదుడు అని కొనియాడారు. ఆ మహనీయుని కి ఇదే ఘన నివాళి అని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్,చోటు,సూరజ్ కిరణ్,సతీష్,బాచి,చింటూ,శంకర్, రాజ్ కుమార్,రాజేష్,రాజు పాల్గొన్నారు.*

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ.

డీఈవో సంగారెడ్డి వెంకటేశ్వర్లు గారి నుండి ఉత్తర్వులు అందుకుంటూ…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు.
దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సఫియా సుల్తానా గారు ఎంపిక అయ్యారు . తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:

జగిత్యాల జిల్లా – 2

ములుగు జిల్లా – 2

మెదక్ జిల్లా – 1

వికారాబాద్ జిల్లా – 1

మంచిర్యాల జిల్లా – 1

యాదాద్రి జిల్లా – 1

నిర్మల్ జిల్లా – 1

సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )

ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి. వెంకటేశ్వర్లు గారి నుండి.సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు.
ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

తల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

తల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

 

అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

 

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

 

భూపాలపల్లి మండలం: గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమెతల్లి వదిలేసి చదువు మానేసిన చిన్నారికి చేయూత.

 

అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

 

 

గూడాడుపల్లి గ్రామానికి చెందిన దాసరపు శ్రీజ (14) చిన్నతనంలోనే శ్రీజ ను వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అప్పటినుండి వాళ్ళ నాన్న మానసికంగా కృంగిపోయి తాగుడుకు బానిస అయ్యాడు అప్పటినుండి శ్రీజను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో స్కూల్ బంద్ చేసి వేరే ఊరిలో ఒకరి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ ఉండిపోయింది శ్రీజ పరిస్థితిని చూసి గూడాడుపల్లికి చెందిన.

చంద్రగిరి శ్రీకాంత్ అనే యువకుడు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి విషయం చెప్పడంతో వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు ఆ చిన్నారి దగ్గరికి వెళ్లి శ్రీజ పరిస్థితి తెలుసుకొని వెంటనే ఆ చిన్నారికి బట్టలు, బుక్స్ పెన్నులు, మిగతా సామాను కొనిచ్చి, చిట్యాల కస్తూర్బా హాస్టల్ లో జాయిన్ చేయించడం జరిగింది

అలాగే శ్రీజ పూర్తి బాధ్యతలు మేమే చూసుకుంటామని శ్రీజ పై చదువులకు కూడా సహాయక సహకారాలు అందిస్తామని భవిష్యత్తులో ఆమె పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన.

చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.

పెళ్లి కూడా మేమే చేస్తామని చైర్మన్ అయిలి మారుతి గారు తెలియజేశారు అలాగే శ్రీజ పరిస్థితి గురించి తెలియజేసిన చంద్రగిరి శ్రీకాంత్ గారిని చైర్మన్ అయిలి మారుతి గారు ప్రత్యేకంగా అభినందించారు ఇలాగా ఇంకా ఎవరైనా ఉంటే మా ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి తెలపమని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చిట్యాల మండల ఇంచార్జ్ లౌడియ రాజునాయక్, దుగ్యాల స్వామి తదితర సభ్యులు పాల్గొన్నారు.

 ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే.

 ఇలియానా రెండో బిడ్డ పేరు ఇదే…

 

గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) మరోసారి తల్లి అయ్యారు. ఈ నెల 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తన బిడ్డ బాబు ఫొటోను అభిమానుతో పంచుకున్నారు.
”మా ప్రియమైన అబ్బాయి ‘కియాను రఫే డోలన్‌’ని (Keanu Rafe Dolan) పరిచయం చేస్తున్నందుకు మా  మనసు  సంతోషంతో నిండిపోయింది’ అనే క్యాప్షన్‌ పెట్టారు.
ఇలియానా పోస్ట్ చూసిన ఫాన్స్, పలువురు నెటిజన్లు ఇల్లి బేబీకి  అభినందనలు చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ  ప్రియాంక చోప్రా ఈ పోస్ట్‌కు స్పందిస్తూ విష్ చేశారు.  

2023లో మైఖేల్‌ డోలన్‌ను (Michael Dolan) ఇలియానా వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరు కోవా ఫీనిక్స్ డోలన్‌.   పెళ్లి, భర్త గురించి వచ్చిన విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు ఇలియానా. ‘నన్నేమన్నా భరిస్తా.. కానీ నా కుటుంబసభ్యులను ఏమైనా అంటే ఊరుకోను’ అని గతంలో ఆమె పోస్ట్ పెట్టిన  సంగతి తెల్సిందే.  

రామ్  పోతినేని హీరోగా వచ్చిన ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఆమె అగ్ర కథానాయికగా ఎదిగింది. స్టార్ హీరోస్ సరసన అవకాశాలు అందుకుంది. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో చివరిగా  నటించారు.  గతేడాది బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు హిందీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

బాలీవుడ్ లో విషాదం..నటి హఠాన్మరణం.

బాలీవుడ్ లో విషాదం..  నటి హఠాన్మరణం 

 

 

 

 

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా కన్నుమూశారు.  శుక్రవారం (27న ) రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది

బాలీవుడ్ నటి షెఫాలీ జరీవాలా (Actress Shefali Jariwala 42) కన్నుమూశారు.  శుక్రవారం (27న ) రాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో మరణించినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. నాటి ‘కాంటా లగా’ (Kaanta Laga Song) పాటతో ఆమె (Shefali Jariwala) దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మీడియా కథనాల ప్రకారం, అనారోగ్యానికి గురైన షెఫాలీని ఆమె భర్త ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించారు. అయితే, ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

2002లో ‘కాంటా లగా’ పాటలో నటించిన షెఫాలీ రాత్రి రాత్రికి పాప్ కల్చర్ సెన్సేషన్‌గా మారిపోయారు. ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన 2004 నాటి ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమాలో కూడా నటించారు. బిగ్ బాస్ 13 సీజన్‌లో కూడా పాల్గొన్నారు. తన కాన్ఫిడెన్స్, క్లారిటీతో జనాలను ఆకట్టుకుని మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చారు. 2015లో ఆమె యాక్టర్ పరాగ్ త్యాగి ని పెళ్లి చేసుకున్నారు. ‘నచ్ బలియే’ డ్యాన్స్ రియాలిటీ షో 5, 7 సీజన్‌లలో భర్తతో కలిసి పాల్గొన్నారు. చిన్న వయసులో ఆమె కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె అభిమానులు, తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ టీజర్ అదిరింది. 

ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ టీజర్ అదిరింది. 

 

ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెల్సిందే. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇప్పుడు మూడోసారి అలరించడానికి సిద్ధమైంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్ర పోషించగా.. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో ‘ఫ్యామిలీమ్యాన్‌: సీజన్‌3’ త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది. తాజాగా టీమ్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌లు భారీస్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్‌ ఈజ్‌ బ్యాక్‌ న్యూ సీజన్‌ కోసం రెడీ గా ఉండండి అని టీజర్ లో చెప్పారు.

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.

రైతు బందవుడు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

◆ – 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు విడుదల చేయడంపై రైతుల్లో హర్షం

◆ – రైతుల సంక్షేమం కోసం కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే

◆ – బలహీనమైన నాయకత్వంతోనే పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేదు

◆ -పార్టీకి వ్యతిరేకంగా పని చేసినవారికి పెద్దపీట వేయడం దేనికి సంకేతం ?

◆ – మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలి

◆ – ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షులకు జిల్లా పార్టీలో భాగస్వామ్యం చెయ్యాలి

◆- సీనియారిటీ, సమర్థతకు పెద్దపీట వేసి నూతన అధ్యక్షులను ఎంపిక చెయ్యాలి

◆- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీని ఇప్పటినుంచే ప్రక్షాళన చెయ్యాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

రాష్ట్ర, దేశ చరిత్రలో రైతుల కోసం ఏకకాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా 9 రోజుల్లో 9 వెయ్యిల కోట్లు రైతు పంట పెట్టుబడి సాయంగా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని సంగరెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ అన్నారు.

గురువారం నాడు ఝరసంగం మండలంలోని మన్నూర్ గ్రామంలో నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మండల ఎంపిపి దేవదాస్ మాట్లాడుతూ బలహీనమైన నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొందని.

మండల అధ్యక్షులను మార్చి నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ తిరిగి జహీరాబాద్ అసెంబ్లీ సీటు గెలవగలదని, గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద నాయకుల వద్దకు వెళితే కనీసం పాలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినేటర్ ఛానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమపై ఎన్నో ఆక్రమ కేసులు నమోదు చేశారని, ఇప్పటికైనా అధినాయకత్వం సీనియర్లను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సీనియర్ నాయకులు కవేలి కృష్ణ కోహిర్ మండల ఎస్టీ సెల అధ్యక్షుడు వినోద్ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని విస్మరించి పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి అందలం ఎక్కించడం కరెక్ట్ కాదని, రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సవివరంగా కెలపాలని, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు, సన్నబియ్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, కళ్మాణాలక్ష్మి, షాది ముబారక్, రైబుభరోసా, రైతు భీమా, ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయలను ప్రజలకు తెలియజేద్దామని అన్నారు.

 

 

Farmers

 

కార్యక్రమంలో జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తానీ, మాజీ ఎంపీపీ దేవదాస్, జహీరాబాద్ పార్లమెంట్ ఎస్టీ సెల్ కో ఆర్డినెంటర్ థానోత్ రాజు నాయర్, మాజీ సర్పంచ్ మహేబూబ్ పటేల్, మాజీ ఎంపిటిసి దుర్గాప్రసాద్, మొహమ్మద్ శుకుర్, కృష్ణ, కోహిర్ మండల ఎస్టీ సెల్ రాథోడ్ వినోద్ కుమార్, సీనియర్ నాయకులు రవేలి కృష్ణ, మొహమ్మద్ యూనుస్ హత్నూర్, మొహమ్మద్ మస్తాన్, ముహమ్మద్ చష్మోద్దీన్ శేకపూర్, సుధాకర్ రెడ్డి.

భాస్కర్ రెడ్డి, నవాజ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి వెంకటా పూర్, రాజ కుడు సంగం, నగేష్ బొపన్ పల్లి, హత్నూర్ వెంకట్ రెడ్డి వెంకట్ హాద్నూరు, సంగన్న ఝారసంగం, మచ్నూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ రాపీయెన్షన్, విద్య సాగర్, ప్రశాంత్, గుండప్ప పటేల్, ఆయా మండలాల మాజీ సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు, సీనియర్ కార్యర్తలు తదితరులు పాల్గొన్నారు.

గర్జన వినడానికి కాదు భయపెట్టడానిక.

గర్జన వినడానికి కాదు భయపెట్టడానిక…

సాంప్రదాయక చీర, ముక్కు పుడక, ఇతర ఆభరణాలతో గోండు యువతిగా రష్మిక కనిపించే కొత్త చిత్రం మైసా. దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లే ఈ సినిమాతో దర్శకుడిగా పరియమవుతున్నారు.

సాంప్రదాయక చీర, ముక్కు పుడక, ఇతర ఆభరణాలతో గోండు యువతిగా రష్మిక కనిపించే కొత్త చిత్రం ‘మైసా’. దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లే ఈ సినిమాతో దర్శకుడిగా పరియమవుతున్నారు. అజయ్‌, అనిల్‌ సయ్యపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, పోస్టర్‌ను దర్శకుడు హను రాఘవపూడి విడుదల చేశారు. తమిళ పోస్టర్‌ను తమిళ హీరో ధనుష్‌, మలయాళ పోస్టర్‌ను దుల్కర్‌ సల్మాన్‌, కన్నడ పోస్టర్‌ను శివరాజ్‌ కుమార్‌, హిందీ పోస్టర్‌ను విక్కీ కౌశల్‌ విడుదల చేశారు. వీరందరూ రష్మికకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ముఖాన రక్తపు మరకలు, చేతిలో ఆయుధంతో కొత్తగా కనిపించారు రష్మిక. ‘ఓర్పు ఆమె ఆయుధం. ఆమె గర్జన వినడానికి కాదు.. భయపెట్టడానికి’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. టైటిల్‌, ఆమె లుక్‌.. ప్రాజెక్ట్‌ మీద అంచనాలు పెంచాయి. ‘రెండేళ్ల కష్టానికి రూపం ‘మైసా’ చిత్రం. గోండు తెగల ప్రపంచం ఆధారంగా ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది’ అని దర్శకుడు చెప్పారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version