మద్యపాన నిషేధ ఆమోద తీర్మానం..
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామంలో మద్యపానాన్ని నిషేధించి తీర్మానం చేసి స్థానిక ఎస్సై కి అందజేశారు. నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేసి స్థానిక ఎస్ఐ రాజేష్ కి సర్పంచ్ మంగిలిపల్లి మంజుల రమేష్ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నడిపిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వర్ణలత రాములు, పాలకవర్గ సభ్యులు మంగిలి పల్లి యాదగిరి, దొమ్మాట రాజు, ఆంబోతు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.
