రాజ్యాంగంపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం: సాయినాథ్

రాజ్యంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి:

◆-: ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రికల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయినాథ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండలంలోని పిచరగడి పాత తండా గ్రామపంచాయతీలో గురువారం నాడు జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ లో సబ్ ఇంజనీర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జహీరాబాద్ డివిజన్ సెక్రటరీ రామావత్ సాయినాథ్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ ను సన్మానించి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామవత్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే చట్టాలు, ప్రాథమిక హక్కులు, విదులపై అవగాహన కలిగి ఉంటుందని, రాజ్యాంగం ప్రసాదించిన అన్ని అవకాశాలను షెడ్యూల్ కులాలు, గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవసోత్ శంకర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రాథోడ్ రవి ఐకెపి, రాథోడ్ వినోద్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ కొహీర్ మండలం, రామావత్ విజేందర్, కేతవత్ అనిల్ తదితరులు పాల్గొన్నరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version