రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సహప్రాంత ప్రచారక్ ప్రభు కుమార్ పాల్గొని, డా. బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలని సూచించారు.రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ,అందులో భాగమైన పౌరులుగా మనం పాటించవలసిన కర్తవ్యాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన తెలిపారు.దేశాన్ని ఒక నాగరిక సమాజంగా రూపుదిద్దడంలో ప్రతి పౌరుడు ముందుండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవాహ కృష్ణ భాస్కర్, సహకార్యవాహ శ్రీనివాస్,జిల్లా ప్రచారక్ నాగరాజు,రామకృష్ణ, రాజేశ్వర్ ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ…

విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ

కెవిపిఎస్, టిఏజిఎస్ జిల్లా కార్యదర్శులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీదర్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీసీ స్టూడెంట్ మేనేజ్మెంట్ గర్ల్స్ పాస్టర్స్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ కస్తూరిబాయి హాస్టల్స్ లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం,కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం బుక్స్ బహుకరించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశంలో మత గ్రంథాలు కులాల,మతాల మధ్య అసమానతలు, వివక్షతలు పెంచి, ప్రజలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే తత్వాన్ని చంపితే, భారత రాజ్యాంగం మాత్రం అసమానతలను,వివక్షతలను తొలిగించడానికి కారణమైంది,ప్రశ్నించే తత్వాన్ని పెంచింది అన్నారు, భారత రాజ్యాంగం చదవడం ద్వారానే అణగారిన వర్గాలకు ఆత్మ స్థైర్యం వస్తుంది,హక్కులు పరిరక్షించబడతాయి అన్నారు, భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు,పాలకులు భారత రాజ్యాంగం మౌలిక సారూప్యతని దెబ్బతీసి,అశాస్త్రీయమైన భావజాలానికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి తిరోగామి శక్తులను నిలువరించాలంటే భారత పౌరులందరూ రాజ్యాంగాన్ని చదవాలి,అప్పుడు మాత్రమే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు, ఈ ప్రయత్నంలో భాగంగానే హాస్టల్స్ కు బుక్స్ బహుకరించడం జరిగింది

రాజ్యాంగంపై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం: సాయినాథ్

రాజ్యంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి:

◆-: ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రికల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సాయినాథ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది కోహిర్ మండలంలోని పిచరగడి పాత తండా గ్రామపంచాయతీలో గురువారం నాడు జరిగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ లో సబ్ ఇంజనీర్ మరియు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జహీరాబాద్ డివిజన్ సెక్రటరీ రామావత్ సాయినాథ్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ ను సన్మానించి భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రామవత్ సాయినాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యంగంపై అవగాహన కలిగి ఉన్నప్పుడే చట్టాలు, ప్రాథమిక హక్కులు, విదులపై అవగాహన కలిగి ఉంటుందని, రాజ్యాంగం ప్రసాదించిన అన్ని అవకాశాలను షెడ్యూల్ కులాలు, గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దేవసోత్ శంకర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రాథోడ్ రవి ఐకెపి, రాథోడ్ వినోద్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ కొహీర్ మండలం, రామావత్ విజేందర్, కేతవత్ అనిల్ తదితరులు పాల్గొన్నరు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version