విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T111156.704.wav?_=1

 

విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం రాత్రి జహీరాబాద్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి వినాయకుడి పూజలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి గారితో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి ఆ ఘననాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సంధర్బంగా ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సకల విజ్ఞాలు తొలిగి సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు.
ఈకార్యక్రమంలో వారితో పాటు జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ నాగిరెడ్డి మాజీ కౌన్సిలర్లు అక్తర్ గోరి రంగా అరుణ్ కుమార్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి నల్లా ప్రతాప్ రెడ్డి నథానెయల్ నర్సింహా యాదవ్ మాజీ జెడ్పీటీసీ నరేష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లూ జిల్లా ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ న్యాల్కల్ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్ గౌడ్ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి,ఎస్టీ సెల్ పార్లమెంట్ కోఆర్డినేటర్ రాజు నాయక్,ఇమామ్ పటేల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు వివిధ గణేష్ మండపాల ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మద్యం టెండర్లలో గౌడులకు 25% వాటా కావాలి..

మద్యంటెండర్లో గౌడులకు 25 శాతం వాటా ఇవ్వాలి

మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 25 శాతం వాటా ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ డిమాండ్ చేశారు.పట్టణంలో బుదవారం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుఖాణాలలో 15 శాతం మాత్రమే కెటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో గౌడ కులస్తులకు మద్యం దుఃఖణాల కేటాయింపులో 25 శాతం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ్స్ కు ఇచ్చిన హామీని ప్రకారంగా 25 శాతం వాటా డిక్లరేషన్ విస్మరించడం సరికాదన్నారు.మధ్యం టెండర్లలో 3 లక్షలు కాకుండా 2 లక్షలకు కుదించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లుగా తాటిచెట్ల పైనుంచి పడి చనిపోయిన, గాయపడిన 7 వందల మంది గీత కార్మికులకు పెండింగ్ లో 7 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలిపారు. జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, 50 యేండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ఫెక్షన్ మంజూరు చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మోకుదెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి గా శ్యామ్ సుందర్ గౌడ్

దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్ ను మోకుదెబ్బ హన్మకొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. గత రెండేళ్లుగా శ్యామ్ కుమార్ గౌడ్ గౌడ కులస్తులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశంగౌడ్,మేరుగు మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాల్లో రామాయంపేట పోలీసులు ప్రజలను రక్షించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T163411.207.wav?_=2

సలాం పోలీస్‌..

అకాల వర్షాల్లో ప్రజలకు అండగా రామాయంపేట పోలీసులు..

పోలీసులపై నేటి ధాత్రి ప్రత్యేక కథనం..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు నగర జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కాలువలు పొంగిపొర్లడంతో తక్కువ ఎత్తున్న కాలనీలు మునిగిపోయి వందలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడిన వారు పోలీసులు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, ఎస్‌.ఐ బాలరాజు తమ సిబ్బందిని ముందుండి నడిపిస్తూ పగలు–రాత్రి తేడా లేకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

రిస్క్ తీసుకుని ప్రాణరక్షణ

నీటి మునిగిన వీధుల్లోకి ప్రవేశించి వృద్ధులను, మహిళలను, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రుల ఆందోళన తొలగించారు. వర్షాల మధ్య ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా పోలీసులు సేవలందించడం ప్రజల హృదయాలను తాకింది.

ప్రజల కృతజ్ఞత..

“పోలీసులు లేకపోతే మా కుటుంబం బతికేది కాదు. మమ్మల్ని ప్రాణాలకు భయపడకుండా రక్షించారు. ఈ ఋణం మాకు ఎప్పటికీ మరవలేనిది” అని బస్తీ వాసులు కన్నీటి కళ్ళతో చెప్పారు.

“మా పిల్లలు స్కూల్లో చిక్కుకుపోయారు.

వెంటనే పోలీసులు వచ్చి వారిని రక్షించారు. మా కోసం వారు ప్రాణరక్షకులుగా నిలిచారు” అని స్థానిక పిల్లల తల్లులు భావోద్వేగంతో అన్నారు.

అధికారుల ప్రశంసలు

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – “ప్రజల ప్రాణాలను కాపాడడంలో రామాయంపేట పోలీసులు చూపిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమైంది. ఇతరులకు ఆదర్శం.” అని అభినందించారు.

హనుమంతరావు మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ దంతపల్లి.

“ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు చూపిన స్పందన సమాజానికి స్ఫూర్తిదాయకం. వారు కేవలం చట్టం అమలులోనే కాకుండా, ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు.” అని అన్నారు.

 

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. మల్లన్న గారి నాగులు ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ. తోని గండ్ల.

అకాల వర్షాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలిచిన రామాయంపేట పోలీసులు చూపిన త్యాగం, సేవలు ఎన్నటికీ మరువలేనివి. వారి కృషి రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పాత్రకు ఒక నిదర్శనంగా నిలిచింది.

నారింజ ప్రాజెక్ట్‌ను అదనపు కలెక్టర్ సందర్శించారు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153927.000.wav?_=3

నారింజ ప్రాజెక్ట్ ను అదనపు కలెక్టర్ సందర్శించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ శివారులో గల నారింజ ప్రాజెక్ట్ ను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించారు. వినాయక నిమజ్జనం కోసం చేసిన అన్ని ఏర్పాట్ల వివరాలను పురపాలక సంఘం కమిషనర్ డి. సుబాష్ రావు దేశ్ముఖ్ అదనపు కలెక్టర్ కు వివరించారు. ఇలాంటి అంచనా జరగకుండా చూడాలని అధికారులను సూచించారు,

సీనియర్ జర్నలిస్టులకు ప్రత్యేక పింఛన్ డిమాండ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T153453.002.wav?_=4

ఇతర రాష్ట్రాల మాదిరిగా జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ ఇవ్వాలి

ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన సీనియర్ జర్నలిస్ట్ రాజమల్లు యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సీనియర్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పించను ఇప్పించి జర్నలిస్ట్ ల జీవితానికి భరోసా కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి, శాసనసభ్యులు భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయకుల సమక్షంలో వేం నరేందర్ రెడ్డి కి జర్నలిస్టుల సమస్యల ను వివరిస్తూ కేసముద్రం సీనియర్ జర్నలిస్ట్ వేల్పుల రాజమల్లు యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా నిర్ణయించి ప్రకటించారని పేర్కొన్నారు.జర్నలిస్ట్ మరణిస్తే వారి భాగస్వామి కి నెలకు రూ10 పింఛను ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి నిర్ణయించారని.తమిళనాడు కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు పింఛన్లు అందిస్తుందని.పక్కనున్న ఏపీ లో కూడా అంతో,ఇంతో అందిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్ లకు ఆలాంటి పథకం అమలులో లేవని.తెలంగాణలో కూడ సీనియర్ జర్నలిస్ట్ లకు జర్నలిజం లో 20 ఏళ్ళు గా పనిచేస్తూ 57 ఏళ్ళు దాటిన ప్రతి జర్నలిస్ట్ కు రూ.15 వేలు పింఛను మంజూరు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రమాదంలో
మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారని.ఐతే
జర్నలిస్టులు సహజంగా మరణించిన వారి కుటుంబాలకు కూడా వర్తించే విధంగా అమలు చేసి
రూ.10 లక్షల కు పెంచాలని.,మరణించిన జర్నలిస్ట్ జీవిత భాగస్వామి కి జీవితాంతం వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల నుంచి రూ 10వేలు ఇప్పించాలని.
అలాగే ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కు ప్రభుత్వం తరఫున
ప్రతి నెల జీవన భృతి కింద రూ. 5 వేలు మంజూరు చేసి వారి జీవితానికి భరోసా కల్పించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.
ఇళ్లు లేక జర్నలిస్ట్ లు ఇబ్బంది పడుతున్నారని. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా
మనవి చేస్తున్నానని పేర్కొన్నారు.

రాజకీయ జోక్యంతో సింగరేణి అభివృద్ధి ముప్పు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T152004.621.wav?_=5

రాజకీయ నాయకుల జోక్యంతో సింగరేణి అభివృద్ధి నిర్వీర్యం

సింగరేణి భూములను రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నారు

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణిలో రాజకీయ నాయకుల జోక్యంతో అభివృద్ధి దినదినం నిర్వీర్యం అవుతుందని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు క్రమ పద్ధతిగా ఎక్కువైతున్నారు పర్మనెంట్ కార్మికులు దినదినం తగ్గుతున్నారు కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి సింగరేణిలో ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులన్నీ కూడా 1998లో సింగరేణిలో ఎన్నికల పక్రియ తీసుకొచ్చి గెలిచిన కార్మిక సంఘాలు తమ ఆర్థిక రాజకీయ నాయకుల స్వలాభం కోసం ప్రభుత్వాలతో కుమ్మక్కై పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటిగా కొల్లగొట్టుక పోయినాయి
ఈరోజు సింగరేణి తల్లి ప్రమాదంలో ఉంది సింగరేణి తల్లిని రక్షించుకునే బాధ్యత యూనియన్ల తో పాటు యువ కార్మికులపై ఆధారపడి ఉంది కార్మిక వర్గం ఏకంగ కాకపోతే సింగరేణి ని కనుమరుగు అవుతుంది
కేంద్ర ప్రభుత్వం త్వరలో బొగ్గు బ్లాక్ లను వేలం వెయ్యబోతున్నది మన రాష్ట్రప్రభుత్వం సింగరేణి కంపెనీ తో పాటు కొన్ని యూనియన్లు వేలంలో పాల్గొనాలని ఈ వేలంలో బిజెపి పార్టీ పెంచి పోషిస్తున్న ఆదాని అంబానీ తోపాటు జిందాల్ వేదంతా కంపెనీలో ఇతర కార్పొరేట్ సంస్థలు బహుళ జాతి కంపెనీలకు తో పోటీపడి వేలంపాటలో మనము నెగ్గగలమా
కార్పొరేట్ శక్తులతో తట్టుకోలేనందున కొత్త బొగ్గు బ్లాక్ లను గతంలో లాగా నేరుగా కేంద్ర ప్రభుత్వం బేషరతుగా సింగరేణి సంస్థకే అప్పగించాలి ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ గనుక
సింగరేణి సంస్థకు భవిష్యత్తు లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలను ఎండగడుతూ ఐక్య పోరాటాలు నిర్మిద్దాం కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ దుర్మార్గమైన చర్యలను ఖండిద్దాం తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి తల్లిని కాపాడుకుందాం బంగారు భవిష్యత్తు నిర్మించుకుందాం యూనియన్లకు అతీతంగా సింగరేణి పరిరక్షణకై కార్మికులు పోరాడాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=6

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

భూపాలపల్లిలో రైతులకు యూరియా సరఫరా సమస్య..

రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

కాళేశ్వరం కుట్రపై బి ఆర్ ఎస్ ధర్నా….

తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు.

#ఘోష్ కమిషన్ నివేదిక కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టు.

#కాంగ్రెస్ పార్టీ తాటాక చప్పులకు భయపడేది లేదు.

#మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మండల లోని నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి365 పై మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నది జలాలను ఆంధ్రకు తరలించే కుట్రలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నది జలాలను ఆంద్రాకు తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించే తీరు ప్రజలందరికీ అర్థమవుతుందని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకనే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసి వేయడమేనని అర్థమవుతుంది. నిన్నటి వరకు సిబిఐ పై అనేక ఆరోపణలు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మాట ఎందుకు మార్చాడో ప్రజలకు వివరించాలన్నారు. దీని వెనకాల ఉన్న శక్తులు వారి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసే బాధ్యత రేవంత్ రెడ్డి కి లేదా ఇది కచ్చితంగా కాంగ్రెస్ బిజెపి ఆడుతున్న నాటకం ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడిన బి ఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని రాష్ట్ర సాధనలో అనేకసార్లు ప్రజా ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులను భరించి జైల్లో మగ్గి రాష్ట్రాన్ని సాధించే దిశగా ఉద్యమించిన ఏకైక పార్టీ బి ఆర్ఎస్ పార్టీ . రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, నాయకులు గందే శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, పాండవుల రాంబాబు, ఖ్యాతంశ్రీనివాస్, ఊరటి అమరేందర్ రెడ్డి, గుమ్మడి వేణు, మేడిపల్లి రాజు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

పీరియ నాయక్ కుటుంబానికి ఆర్థిక చేయూత

నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సబ్ స్టేషన్ తండ వాస్తవ్యులు బానోత్ పీరియా నాయక్ గ్రామ పంపు ఆపరేటర్ గా గత కొన్ని సంవత్సరాలు పని చేశారు కావున మాజీ సర్పంచ్ కి”శే”గుగులోతు వెంకన్న కుటుంబ సమక్షంలో మంగళవారం పెద్దకర్మ సందర్భముగా మానుకోట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్ నాయక్ పీరియ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మానవత్వంతో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నగదుగా 6000 /- రూపాయలు అందజేయడం జరిగింది బానోత్ పిరియా నాయక్ భార్య బానోత్ బిచ్చాలి మరియు తన కుమారుడు బానోతు సురేందర్ కూతురు సంగీత కు ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటానని ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూర్చే పథకాలు ఏమైనా ఉంటే నా వంతు సహాయంగా తప్పకుండా మీ కుటుంబానికి అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
గుగులోత్ శివుడు
గూగులోత్ సుక్యనాయక్
గుగులోతు నరేష్ (బోయ)
గుగులోతు విజయ్ నాయక్
గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

సిరిసిల్లలో గణేష్ నిమజ్జనకు జిల్లా ఎస్పీ సూచనలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T144040.353.wav?_=7

 

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని

శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు

సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.ఐపిఎస్

 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి నిబంధనలు పాటించాలని,నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈరోజు పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను పరిశీలించి నిర్వహకులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.

SP Mahesh B.Gite.IPS

జిల్లాలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని.జిల్లా వ్యాప్తంగా సుమారుగా 2100 వినాయక మండపాలు కొలువుదీరినవని,అట్టి మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ వారిచే సూచించబడిన సూచనలు తప్పక పాటించాలన్నారు.వినాయక మండపాలు వద్ద అప్రమత్తంగా ఉంటూ అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవలన్నారు.నిమజ్జనం రోజున.ఎట్టి పరిస్థితుల్లో డి.జే లకు అనుమతి లేదని నిబంధనలకు విరుద్ధంగా డి.జే లు ఏర్పాటు చేసిన డి.జే యజమానులతో పాటుగా మండపాల నిర్వహకులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మండపాల నిర్వహకులు నిర్దేశించిన సమయనికి నిర్జనం పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకోవాలని, పోలీస్ వారి సలహాలు సూచనలు తప్పక పాటిస్తూ ఏలాంటి గొడవలు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేలా పోలీసులకు సహకరించాలని కోరారు.ఎలాంటి సమస్యలు తలెత్తిన, అవాంచనీయ సంఘటనలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారం అందింవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో,డి.ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ సిబ్బంది ఉన్నారు.

 

నిజాంపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143516.488.wav?_=8

నిజాంపేటలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో వై.యస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గొప్ప రాజకీయవేత్త వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొమ్మట బాబు, వై వెంకటేశం, మారుతి, రవి, అబ్దుల్ ,కృష్ణ తదితరులు ఉన్నారు.

నర్సంపేటలో వైఎస్ఆర్ 16వ వర్ధంతి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T143118.908.wav?_=9

రామరాజ్యం తలపించేలా వైఎస్ఆర్ పాలన

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి
వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా
నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెండెం రామానంద్ గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు,అవసరాలను తెలుసుకున్న నేత అని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని తెలిపారు. పేద ప్రజలు,విద్యార్థుల కోసం ఆరోగ్య శ్రీ పథకం,ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి చిరస్మరణీయుడయ్యారని కొనియాడారు.వైఎస్ఆర్ పాలన సంక్షేమమే ప్రధాన ఎజెండా గా కార్యకర్తలే సైనికులుగా కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా పని చేసిన గొప్ప నాయకుడు అని రామానంద్ గుర్తుకు చేశారు. దివంగత డాక్టర్ వైయస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ర్మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవి,నర్సంపేట మండలం అధ్యక్షులు కత్తి కిరణ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ డక్క శ్రీను,నర్సంపేట పట్టణ కార్యదర్శి చిప్ప నాగ,నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, గజ్జి రాజు, లక్కాసు రమేష్, నాగేల్లి సారంగం, పొన్నం నరసింహారెడ్డి, కొప్పు అశోక్, బాణాల శ్రీను, మెరుగు కిరణ్, మహిళ నాయకురాలు హసీనా, గాజుల రమేష్, గండు గిరి, బిట్ల మనోహర్, పాతార బోయిన చంద్ర మొగిలి, మేడం కుమార్, ఎండి సర్వర్, దేశీ సాయి పటేల్, కాంగ్రెస్,మహిళా,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రంలో మృతుల కుటుంబానికి బియ్యం అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142652.925-1.wav?_=10

బాధిత కుటుంబానికి క్వింటా బియ్యం అందజేత

టి పి సి సి, ఓ బి సి వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధి కేసముద్రం విలేజ్ చైతన్య నగర్ కాలనీలో ఇటీవల అకాల మరణం చెందిన వల్లందాస్ కొమురయ్య కు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి టిపిసిసి ఓబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న యాదవ్ ఒక క్వింటా బియ్యం బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతగా అందివ్వగా కేసముద్రం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కత్తెరసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి సురేందర్ బ్లాక్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాసాడి శ్రీనివాస్ మండల ఎస్టీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర రమేష్ చైతన్య నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెండ్యాల లక్ష్మణ్ మాజీ వార్డ్ మెంబర్ మేకల లచ్చమ్మ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సుభాష్ రెడ్డి బోళ్ల కటయ్య ఉల్లి వెంకటేశ్వర్లు లావుడియా వెంకన్న అజ్మీర రాజు శ్రీరాముల సమ్మయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి కొమురయ్య చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది.

చల్లా ధర్మారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T142141.562-1.wav?_=11

మృతుల కుటుంబాలకు అండగా ఉంటా..చల్లా ధర్మారెడ్డి

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని వరికోలు, నార్లపూర్,చర్లపల్లి గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన గుండెకారి జమున,దొగ్గెల శ్రావణ్ కుమార్(లెనిన్),దొగ్గెల కొమురయ్య,ఓరుగంటి లచ్చమ్మ,బయ్య తిరుపతి, చెక్క శంకరయ్య,చెక్క రాజమ్మ,దైనంపల్లి మల్లయ్య,ఈర్ల పెద్దులు, చేపూరి కొమురయ్య,కొత్తపల్లి కరుణ,నందికొండ కౌసల్య కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డివిజనల్ పంచాయతీ కార్యాలయం కోరుకున్న ప్రజలు….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T140359.846-1.wav?_=12

జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ ప్రజావాణి పిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రజా పాలన ప్రభుత్వం అని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని పలుమార్లు ముఖ్యమంత్రి పదే పదే ప్రసంగాలు చేసి చేప్పు తున్నప్పటికి అవేవి పట్టనట్టు కొందరు అధికారులు వేవహరిస్తున్న తీరును విసుకుచ్చేంది. సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చోరువ తీసుకొని డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అదుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి పెషిలో మరియు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం లో పిర్యాదు చేస్తామని పిర్యాదుదారులు తెల్పడం జరిగింది. ముఖ్యమంత్రి మాటలు అగౌరవపరచకుండా అధికారులు చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

భారీ వర్షాల తర్వాత రైతులకు నష్టపరిహారం మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T135416.170-1.wav?_=13

కరువు మండలంగా ప్రకటించాలి’

◆:- టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నుల్క మానిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలో వివిధ

 గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి భారి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెసర మినుము, పత్తి, సోయా, మొక్కజొన్న చాలావరకు నీట మునిగాయి. వర్షాల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీర్ఘకాల సగటులో 109% వర్షపాతం నమోదయింది. ఆగస్టులోనే రికార్డు స్థాయిలో వానలు కురిశాయి.

TRS party senior leader Nulka Manik Rao

సాధారణం కంటే 75% వర్షపాతం నమోదయింది .కావున తెలంగాణ ప్రభుత్వం మండలంలోని ప్రతి గ్రామాన్ని ఏ.ఈ.ఓ, ద్వారా సర్వే చేయించి అన్ని పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని, మాణిక్ రావు డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ లబ్దిదారుల ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T134106.110.wav?_=14

ఆర్థిక భారంతో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు

◆:- సొంతింటి కల నెరవేరేనా!

◆:- పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!

◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.

Indiramma Beneficiaries

 

పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు

విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు
నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.

ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.

త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం

-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం

ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

నిజాంపేటలో టీయూడబ్ల్యూజే ఐజేయు మండల కార్యవర్గం ఎన్నిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T132741.497.wav?_=15

టీయూడబ్ల్యూజే ఐజేయూ మండల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

నిజాంపేట, నేటి ధాత్రి

మండల కేంద్రంలో మంగళవారం టియుడబ్ల్యూజే ఐజేయు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అజ్గర్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జీడి చంద్రకాంత్ గౌడ్,కోశాధికారి బండారి సిద్ధ రాములు, ముఖ్య సహాయ కార్యదర్శిలుగా కుర్మ బాలరాజ్, ఊడెపుశ్రీకాంత్ ముఖ్య సలహాదారులుగా భైరవరెడ్డి ,భరత్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టు సమస్యలపరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version