డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తాం.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తాం’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ ఇంఛార్జి షేక్ మహేబూబ్ హాజరయ్యారు. జర్నలిస్ట్ల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ అమలు కాకపోతే డీఈవో చర్యలు తీసుకోవాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం కృషి చేస్తామని తెలిపారు. కొందరు జహీరాబాద్ జర్నలిస్ట్లు యూనియన్లో చేరగా వారిని మహేబూబ్ స్వాగతించారు.

అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో..

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-60.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు.

MLA Gandra Satyanarayana Rao

జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

తూర్పు జర్నలిస్టుల ఔదార్యం..

తూర్పు జర్నలిస్టుల ఔదార్యం..

తోటి జర్నలిస్ట్ కు అండగా తూర్పు జర్నలిస్టులు.

రిపోర్టర్ శ్రీనివాస్ మాతృమూర్తీ అంతిమయాత్రను నిర్వహించిన తూర్పు రిపోర్టర్లు.

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-43.wav?_=2

జర్నలిస్టుకు సమస్య వస్తే తోటి జర్నలిస్టు అండగా ఉండాలి అని కోరుకుంటాం. వరంగల్ తూర్పులో జరిగిన సంఘటన అందుకు నిదర్శనం. తూర్పులో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు తాము నిస్సహాయ స్థితిలో ఉన్న కూడా, కష్ట సమయాల్లో ఉన్న మిత్రుడికి అండగా నిలిచి అందరిచే మన్ననలు పొందారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని వేచి చూడకుండా, సాటి మిత్రుడికి అండగా నిలబడి ఉన్నారు. వరంగల్ తూర్పులో పనిచేసే జర్నలిస్టులు మరోసారి తమ ఐక్యతను చాటుకున్నారు అని చెప్పొచ్చు. గతకొద్ది సంవత్సరాలుగా వరంగల్ తూర్పు ఎలెక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న చిత్తోజు శ్రీనివాస్ తల్లి గారు శుక్రవారం మధ్యాహ్నం చనిపోయారు అనే విషయం తెలువగానే, వెంటనే తోటి జర్నలిస్ట్ కు అండగా నిలిచిన వరంగల్ తూర్పు జర్నలిస్ట్ మిత్రులు చూపిన ఔదార్యం మాటల్లో చెప్పలేనిది. ఆర్థికంగా వెనుకబడిన రిపోర్టర్ శ్రీనుకు నా అనే వారు ఎవరు లేకపోయినా, మేము ఉన్నాం నీకు తోడు అంటూ, ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఆర్ధికంగా, ఇంకా ఒక కుటుంబ సభ్యునిలాగా వ్యవహరించిన తీరు అద్భుతం. సదరు రిపోర్టర్ కిరాయి ఉండే ఇంట్లో ఓనర్ తో సైతం మాట్లాడి, దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు తూర్పు జర్నలిస్టులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జర్నలిస్ట్ కు పేరుపేరునా అభినందనలు తెలియచేశారు తోటి మిత్రులు. ఇలానే అందరూ కలిసి డబల్ బెడ్ రూముల కొరకు కలిసి నడవాలని, వరంగల్ లో సపరేట్ గా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకునే వరకు ఇలా ఎప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు కొందరు సీనియర్ జర్నలిస్టులు.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం

పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-28.wav?_=3

ములుగు జిల్లా, నేటిధాత్రి:

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యుజె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు పావుశెట్టి శ్రీనివాస్, నాగపురి నాగరాజ్, ములుగు జిల్లా అధ్యక్షులు చల్లగురుగుల రాజు, ప్రధాన కార్యదర్శి సంఘ రంజిత్ కుమార్, ఉపాధ్యక్షులు నాగపురి హరినాథ్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ఉపాధ్యక్షులు కందికొండ గంగరాజు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, జాయింట్ సెక్రెటరీ దాడి బిక్షపతి, జనగాం జిల్లా అధ్యక్షుడు యు. నరేందర్, మహబూబ్ బాద్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ ధీర్, కార్యదర్శి సతీష్ చారి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, కార్యదర్శి దొమ్మాటి రవి, ఉపాధ్యక్షులు బండారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం ములుగులో జరిగింది. టిఎస్ జెయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మాట్ల సంపత్, కార్యవర్గ సభ్యులుగా గండ్రాతి విజయాకర్, టిఎస్ జెయు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మందాటి రజిని, ఉపాధ్యక్షురాలుగా పోచంపల్లి రజిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా యూనియన్ సభ్యులు చల్లూరు మహేందర్ పెండం బిక్షపతి, ధనుంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.

క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం.

జర్నలిస్టు క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం

మందమర్రి నేటి ధాత్రి

తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేతృత్వంలో….

పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానోత్సవం

Journalist Kranti Kumar

అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లోని రామయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేకడుకల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త) దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి, ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ అఫ్ వార్త) కు జాతీయ మహానంది అవార్డు – 2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.

మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది

 

The state government will stand by the fishermen.

*చేపల పెంపకంలో మత్స్యకారులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి*

*రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్*

*సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )*

The state government will stand by the fishermen.

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు మత్స్యకారుల రైతు వేదికలో నేషనల్ అగ్రో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మత్స్య రైతుల దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సొసైటీ సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేసి సన్మానించారు..అనంతరం చేపల స్టాల్స్ ను సందర్శించారు. వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్య సంపద పెంపొందించడానికి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు..మొన్నటి రోజూ మంత్రీ శ్రీహరి కరీంనగర్ వచిన్నపడు వారితో చేపల పెంపకం,మత్స్యకారుల గురించి మాట్లాడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చెరువుల్లోకి సకాలంలో చేప పిల్లలు పంపిణీ చేస్తుందనీ తెలిపారు.. బలహీన వర్గాల ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని అన్నారు.గతంలో మిడ్ మానేరులో చేపలను వదలడం జరిగిందని, మన ప్రాంతంలో మల్కపేట్ రిజర్వాయర్ కుడా అందుబాటులోకి వచ్చిందని వాటిలో కూడ చేపల పెంపకం ఏర్పాట్లు విధానం పరిశీలించాలన్నారు. గతంలో తెగిపోయిన చెరువులు మరమ్మత్తులు పూర్తి చేశామని అన్నారు.. ఇంకా ఎక్కడ చెరువులు మరమ్మత్తులు ఉంటే చేపడతానని తెలిపారు… ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలల్లోనే కథాలపూర్ మండలం లోని తెగిపోయిన చెరువులను మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చెసి ఎల్లారెడ్డిపేట వరకు రైతులకు సాగు నీరు అందించమని తెలిపారు.గతంలో మిడ్ మానేరు డ్యాంలో కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకం కోసం ముంపు గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించమని కేజీ కల్చర్ చేపల పెంపకం చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చేపల పెంపకంలో అధునాతన సాంకేతిను అందిపుచ్చు కోవాలన్నారు… కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకు వస్తె రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తామని తెలిపారు..
దేశంలో మత్స్య సంపద పెరగాలని చేపలు ఆరోగ్యానికి మంచిదనీ ,ప్రభుత్వం మత్స్యకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలు అందజేస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం పెట్టిన ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు మహిళ తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం,500 కు సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, జిల్లా ఫిషరీస్ చైర్మన్ చొప్పరి రామచంద్రం, డి ఏ వో అఫ్జల్ బేగం, మల్లికార్జున్, పి కిషోర్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సునీల్ కుమార్,, అడ్వైజర్ విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

మురికి ఫుల్.. సిబ్బంది నిల్

మురికి ఫుల్.. సిబ్బంది నిల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ 12వ వార్డులో మురికి కాలువలను నెలరోజులుగా శుభ్రం చేయకపోవడంతో మురికినీరు రోడ్లపై పారుతోంది. మున్సిపల్ అధికారులు ఇతర కాలనీలను పరిశీలిస్తున్నప్పటికీ, ఈ వార్డును పట్టించుకోవడం లేదు. శానిటైజర్ సూపర్వైజర్ సిబ్బందిని వేరే ప్రాంతాలకు పంపుతున్నారు. అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేయించి శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన దాడులు నిరసిస్తూ మండల కేంద్రంలోనీ చౌరస్తాలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఒక భాగమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పత్రిక విలేకరులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, కుమార్, కిషోర్, మురళి, వెంకట్, రమేష్, విష్ణు, బాబు, శంకర్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో.

జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్ పాఠశాలాల్లో ఉచిత విద్యను అందించాలి

టి ఎస్ జి యు ఎన్యుజే ఇండియా.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

shine junior college

మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రయివేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించి ఉచిత విద్యను అందించాలి అని,మహబూబాబాద్
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు తెలంగాణా స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ జిల్లా నేతలతో కలసి వినతి పత్రం అందించిన మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్, వారు మాట్లాడుతూ రాత్రానకా పగలనక నిరంతరం వార్తల కోసం తిరుగుతూ,ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరి శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు తప్పకుండా కల్పించాలని,మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు అన్ని ప్రయివేటు పాఠశాలల్లో ఉచిత విద్యా భోధన అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు,జిల్లా విద్యా శాఖా అధికారి రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందించామని తెలిపారు.ఇటీవల టి ఎస్ జే యు ఎన్యుజే ఇండియా పోరాటంతో ములుగు జిల్లా కమిటీ అక్కడి జర్నలిస్టుల పిల్లలకు వందశాతం ఫీజు రాయితీ కల్పించిన సంగతి గుర్తు చేస్తూ కాపీ వినతిపత్రానికి జత చేసినట్లు కలెక్టర్ ,విద్యా శాఖాధికారి సత్వరం ఈ వినతి పై సానుకూల స్పందన ప్రకటించాలని కోరారు.

Private Schools.

కార్యక్రమంలో డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్,జిల్లా టీయస్ జేయూ నేతలు పోతుగంటి సతీష్,గాండ్ల కిరణ్,జెల్లీ శ్రవణ్, మల్లారపు నగేష్ శెట్టి వెంకన్న,మిట్టగడుపుల మహేందర్,తాడూరి ఉమేష్ శర్మ,
కేసముద్రం మండల అధ్యక్షులు మంద విక్రం ప్రధాన కార్యదర్శి గంధసిరి యాకాంబరం, ఉపాధ్యక్షులు కందుకూరి రాజేందర్,సతీష్,జన్ను శ్రీనివాస్

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం

మెట్ పల్లి జూన్ 16 నేటి ధాత్రి

 

 

shine junior college

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత
బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

నేటిధాత్రి ఎఫెక్ట్..

నేటిధాత్రి ఎఫెక్ట్..

హైదారాబాద్/హయత్ నగర్..

 

 

నిబంధనలకు విరుద్ధంగా రవీంద్ర భారతి స్కూల్..

నేటిధాత్రి కథనంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి..

పాఠశాలను సీజ్ చేసిన అధికారులు..

నేటిధాత్రి పత్రికకు ధన్యవాదాలు తెలిపిన ప్రజా సంఘాల ప్రతినిధులు.

జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి

జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సామంతుల శ్యామ్, తడుక సుధాకర్ లు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనతో ఏటువంటి సంబంధంలేని జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు.

 

 

 

ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని జనంసాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం తప్పుడు ఫిర్యాదు ఇచ్చి, అక్రమంగా ఎడిటర్ పై కేసులు పెట్టారన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కటం ఏమిటని మీడియా సభ్యులు మండిపడ్డారు. తక్షణమే జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పోతరాజు రవిభాస్కర్, చెరుకు సుధాకర్, సర్వేశ్వర్, తిక్క ప్రవీణ్, క్యాతం మహేందర్, విజయ్, మారపెల్లి చంద్రమౌళి, వెంకన్న, అంబాల సంపత్, రాజు, వెంకన్న, మోహన్, సమ్మయ్య, రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి..

తహసిల్దార్ రజనీకుమారి.

రామాయంపేట జూన్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

 

రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.

 

 

We should take advantage of the land.Tehsildar Rajnikumari.

ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని అవకాశం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు.

కేబుల్ ఆపరేటర్లు పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలి

కేబుల్ ఆపరేటర్లు పోల్ టాక్స్ ను వెంటనే రద్దు చేయాలి

ఇండిపెండెంట్ రాష్ట్ర ఎం ఎస్ ఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిన ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రo వచ్చాక దీనస్థితికి చేరుతుందని ఇండిపెండెంట్ ఎమ్మెస్ ఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్ల సమస్యల పై బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో కేబుల్ ఆపరేటర్లతో కలిసి ఇండిపెండెంట్ ఎమ్మెస్ ఓ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్న స్వయంకృషితో కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రజలకు వినోదాన్ని అందించడంలో గాని అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు సంబంధించిన సమాచారం అందించడంలో కేబుల్ ఆపరేటర్లు ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రస్తుత సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లతో పోటీ పడడం కష్టం కష్టమవుతున్న తరుణంలో మూలిగే నక్క పై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే నష్టాలలో నడుపుతున్న కేబుల్ టీవీ లపై ప్రభుత్వం  టీఎస్ ఎన్పీడీసీఎల్ ద్వారా పోల్ టాక్స్ పేరుతో వాడుతున్న కరెంటు పోల్ లను  లెక్కించి పోల్ టాక్స్ కట్టాలంటూ కేబుల్ టీవీ ఆపరేటర్ల పై అదనపు ఆర్థిక భారాన్ని మోపడం హేయమైనా చర్య  అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే పోల్ టాక్స్ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ ఇటీవల భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలిసి వినతి పత్రం అందజేశారు.. అలాగే భూపాలపల్లి విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్ కలిసి ఆపరేటర్ల సమస్యలను వివరించి వినతి పత్రం అందించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేబుల్ టీవీ ఆపరేటర్లను కుటీర పరిశ్రమలు గా గుర్తించి వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి కేబుల్ టీవీ లను ప్రోత్సహించాలని కోరారు. అలాగే కేబుల్ ఆపరేటర్ల పోల్ టాక్స్ ను తక్షణమే రద్దు చేసి ఆపరేటర్ల జీవన మనుగడకు తోడ్పడాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఆపరేటర్లు బోట్ల రాజు ,ఓదెల సురేష్,నల్లవేని రాజు, నన్నపు సతీష్, ఒజ్జ ఐలయ్య. గట్టయ్య, దేవేందర్ లు పాల్గొన్నారు

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ( ఐ జే యు)

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అక్రమ అరెస్టు, ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో టి యు డబ్ల్యూ (ఐ జేయూ), వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకులు బండి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

నూతన తహసీల్దార్ కు సన్మానం.

పలు సమస్యలు తాసిల్దార్ దృష్టికి తీసుకువచ్చిన జర్నలిస్టులు.

జర్నలిస్టులపై ఫారెస్ట్ దౌర్జన్యం, వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టుల భూమిని అప్పగించాలని వినతి.

సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన నూతన తహసీల్దార్, రామ్.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

 

 

మహాదేవపూర్ నూతన తాసిల్దారుగా వై రామారావు బాధ్యతలను స్వీకరించడం తో స్థానిక పాత్రికేయులు తాసిల్దార్ కు సన్మానించడం జరిగింది. శుక్రవారం రోజున మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో వై రామారావు ఖమ్మం జిల్లా మదికొండ మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై మహాదేవపూర్ తాసిల్దార్ గా వై రామారావు బాధ్యతలను స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కు, శుభాకాంక్షలు తెలుపుతూ స్థానిక పాత్రికేయులు శాలువతో సన్మానించడం జరిగింది. అనంతరం పాత్రికేయులు నూతన తహసిల్దార్ కు మండలంలోని పలు ప్రధాన సమస్యలలో ఒకటైన భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభానికి ముందు అందించేలా చూడాలని, మండలంలో పలు భూ సమస్యలపై దృష్టి సాధించి బాధితులకు న్యాయం చేసేలా అధికారులు సిబ్బందికి ఆదేశించాలని కోరడం జరిగింది. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఫారెస్ట్ అధికారులు కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్వే పేరుతో కాలయాపన చేసి జర్నలిస్టులకు గూడు కట్టుకోకుండా చేస్తున్నారని, తక్షణమే జర్నలిస్టులకు కేటాయించిన భూమిని జర్నలిస్టులకు అందించేలా చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన నూతన తహసిల్దార్ మండలంలోని సమస్యలపై పరిష్కారం కొరకు సాధ్యమైనంత త్వరలో విచారణ చేసి ప్రజలకు అలాగే పాత్రికేయులకు భూ సమస్య ను పరిష్కా రిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ కు కలిసిన వారిలో సీనియర్ పాత్రికేయులు, టీ న్యూస్ రిపోర్టర్ సయ్యద్ జమీల్,మిన్నుభాయ్, రిపోర్టర్ లు ఉన్నారు.

జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం.

జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం

 

మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి

 

ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ అన్నారు.
ప్రతినెలా నాలుగవ తారీఖున జరిగే సాధారణ సమావేశం బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్ మహ్మద్ అజీమ్ లు మాట్లాడుతూప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా సభ్యులందరికీ 15 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇట్టి ఇన్సూరెన్స్ లోని ప్రయోజనాలు యాక్సిడెంటల్ డెత్ కి15 లక్షలు, శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, అత్యవసర వైద్యానికి లక్ష రూపాయలు, విద్యా ప్రయోజనానికి లక్ష రూపాయలు, వివాహ ప్రయోజనానికి లక్ష రూపాయలు, అంత్యక్రియల ఖర్చుకు 5000 రూపాయలు, ఏదైనా ఎముకలు విరిగినప్పుడు 25 వేల రూపాయలు, కాలిన గాయాలకి 10000 రూపాయలు, పాలసీదారుడు కి హాస్పిటల్ లో రూమ్ కోసం రోజుకి 1000 రూపాయలు చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్ కోసం రూమ్ కి 2000 రూపాయల చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న స్కీమ్ సభ్యులందరికీ చేయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పానుగంటి మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్టుల జాతర ను విజయవంతం చేద్దాం.

జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభ కు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ ఆవిష్కరణ.

“నేటిధాత్రి”,వేములవాడ.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవాలను జయప్రదం చేద్దామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు.

వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భవించి మే 31వ తేదీతో 25 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావాలని కోరారు.

Journalists’

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదం తో 2001 మే 31న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యావత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచితుల జితేందర్, ఉపాధ్యక్షులు సయ్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరాజ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రాజేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను.

గ్రామీణ సడక్ యోజన నిధులు ఎటుపాయను

కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరియు అధికారుల ఇళ్లపై ఏసీబీ విచారణ చేపట్టాలి

సీనియర్ జర్నలిస్ట్ నరసింహ

చర్ల నేటిధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

చర్ల మండలంలోని దండుపేట ప్రధాన రహదారి నుండి కొత్తపల్లి లింగాపురం గొంపల్లి మొగలపల్లి సి కత్తి గూడెం మరియు కత్తిగూడెం మీదుగా వేసిన గ్రామీణ సడక్ యోజన నిధులు సుమారు 54 కోట్ల రూపాయల నుంచి 58 కోట్ల వరకు సగం రోడ్లు వేసి పూర్తిగా కాకుండానే అధికారులు కాంట్రాక్టర్లు పూర్తిగా స్వాహా చేశారు సుమారు నాలుగు సంవత్సరాలు గడిచిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం లేదు కేంద్రం నిధులు అంటే అంతా చులకన అని సీనియర్ జర్నలిస్టు నరసింహా అన్నారు ప్రధాన రహదారి నుండి గోదావరి పరివాహక గ్రామపంచాయతీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించుట కొరకు కేంద్రం ఎంతో దూర దృష్టితో ఆ నిధులను సమీకరిస్తే సదరు కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యం వలన రహదారి పూర్తికాలేదు గోదావరి వరదలు సమీపిస్తున్నందున ఇకనైనా జిల్లా విజిలెన్స్ అధికారులు మరియు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులు పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యుల దగ్గర నుండి నగదును రికవరీ చేపించి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన నూతన రహదారి నిర్మాణం చేపట్టాలి చర్ల మండల కేంద్రంలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ రహదారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని త్వరలో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version