కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T130338.591.wav?_=1

కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి బి1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

వివేక్ కామెంట్స్

గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు,అక్రమ అరెస్ట్ లతో కేసీఆర్ రాచరిక పాలన సాగించిండు.

60 వేల కోట్లు అప్పును 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చిండు.

8 లక్షల కోట్ల అప్పు కు 5 వేల కోట్ల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది.

కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది.

గత ప్రభుత్వంలో బి ఆర్ ఎస్ లీడర్ల కే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారు.

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.

9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యానికి పంపిణీ చేస్తున్నాం.

 

గత పది యేండ్ల లో ఒక్క రేషన్ కార్డు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.

కొత్త గనులు రావాలి..కొత్త గనులపై సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు.

వి ఆర్ ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్ లో పాల్గొనకుండా చేసింది

దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.

గతం లో మందమర్రి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉండేవి.

కానీ నేను వచ్చాక 50 కోట్ల రూపాయల తో అభివృద్ధి పను జరుగుతున్నాయి

కమిషన్ల కోసమే గత ప్రభుత్వం పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించింది.

అమృత్ స్కిం తో మందమర్రి ప్రజల కు శాశ్వత మంచినీటి సౌకర్యం కలుగుతుంది.

42 వేల కోట్ల రూపాయల తో మిషన్ భగీరథ పథకాన్నీ తీసుకు వచ్చి ఒక్క ఇంటికి చుక్క త్రాగు నీరు అందించలేదు.

మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో వేల కోట్లు దోచుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version