14వ డివిజన్‌ ప్రెసిడెంట్ పోటికి 33 అప్లికేషన్లు..

14వ డివిజన్‌ ప్రెసిడెంట్ పోటికి 33 అప్లికేషన్లు..

పాత కాంగ్రెస్ కార్యకర్తలకే ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్

అభ్యర్థుల వెల్లువ – ఒక్క అధ్యక్ష పదవికి 33 దరఖాస్తులు?

పాత కార్యకర్తల ఆవేదన – “మా కష్టం విలువ ఎక్కడ?”

ఇతర పార్టీల నుంచి వచ్చినవారిపై వ్యతిరేకత

నాయకత్వానికి పరీక్ష – ఈసారి ఎవరికీ న్యాయం?

ఏనుమాముల, నేటిధాత్రి.

వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఈసారి అనూహ్యంగా భారీ పోటీ నెలకొంది. ఏకంగా 33 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొద్దిమందికే పరిమితమయ్యే ఈ పదవికి ఇంతమంది పోటీ పడటం వెనుక పార్టీ లోపలి అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని పక్కనపెట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. “మేము అంతకాలం పార్టీ కోసం పనిచేసింది ఎందుకు?” అన్న ప్రశ్నలు కార్యకర్తల నోళ్లలో వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న వారిపై కూడా స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో వ్యతిరేకత ఉందని సమాచారం. టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి పదవి చేపట్టిన ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయని, ఈసారి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.

పిసిసి స్థాయి నుంచి పాత కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు ఉన్నప్పటికీ, అమలు స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని కార్యకర్తలు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి అయినా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుని నిజమైన కార్యకర్తలకు న్యాయం చేస్తుందా? లేక మళ్లీ కొత్తవారికే అవకాశాలు ఇస్తుందా? అన్నది ఇప్పుడు స్థానికంగా ఆసక్తికరంగా మారింది.

ముగిసిన పుర ఎన్నికలు…

ముగిసిన పుర ఎన్నికలు…

ప్రశాంత వాతావరణం లో ముగిస్తున్న మున్సిపల్ ఎన్నికలు

ఎంతో ప్రాయాస పడుతూ ఓట్లలో పాల్గొన్న వికలాంగులు… వృద్ధులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు సవ్యమనం పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నట్టు కనబడుతుంది ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క ఓటరు కేసముద్ర మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై తమ ఓటును వేసి మద్దతు తెలిపినట్టు వినపడుతుంది. ఎన్నికలు అయితే ముగిసాయి కానీ ఎవరికి పట్టం కడతారో అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్టు సమాచారం. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎవరికి విజయం వరిస్తుందో ఎవరికి అపజయం వరిస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతుందని పలువురు భావిస్తున్నారు. పలువురు నాయకులు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎవరికి వారు ఎన్ని చెప్పుకున్నా ప్రజల తీర్పే తుది తీర్పు ఆ తీర్పు వెలుపడే సమయం ఒక్కరోజు కన్నుమూస్తే మర్నాడు ఎవరి జాతకాలు ఏంటనేది తేలిపోతుంది అప్పటిదాకా అభ్యర్థులకు నాయకులకు కంటిమీద కు నుకు పట్టిన ప్రజలు మాత్రం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నట్టు కనపడుతుందని భావిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి ఓటర్ల నాడి ఎవరు ఊహించలేని విధంగా తీర్పు ఇచ్చేలా ఓటర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో ఎవరిని విజయం వరిస్తుందో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే శుక్రవారం 13వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.

మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య..

మరోసారి తెరపైకి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల సమస్య

 

 

 

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ అటు మహా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి.

కుమరం భీం జిల్లాలోని 12 గ్రామాలు రెండు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. ఇటు తెలంగాణ (Telangana) అటు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వాలు ఈ గ్రామాలు మావంటే మావేనంటూ మూడున్నర దశాబ్దలుగా పోటాపోటీగా ఇక్కడ పాలన చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ (Panchayat Elections) మరోసారి కుమరం భీం అసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో ఉన్న తెలంగాణ మహరాష్ట్ర సరిహద్దుల్లోని వివాదాస్పద గ్రామాలు తెరపైకి వచ్చాయి.
రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఇంటింటికీ రేషన్ కార్డులు ఇచ్చాయి. రేషన్ షాపులూ ఏర్పాటు చేశాయి. రెండు ప్రభుత్వాలు పాఠశాలలను ఏర్పాటు చేశాయి. ఇక్కడ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ఓటరు ఐడీ కార్డులను ఓటర్లు పొంది ఉన్నారు.ఆ గ్రామాల నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆ గ్రామాల్లో అన్నీ డబుల్ ధమాకే..

తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వివాదస్పందంగా మారిన ఆ 12 గ్రామాల ప్రజలకు అన్నీ డబుల్ ధమాకే. రెండురెండే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మొదలుకుని పాఠశాలలు, రహదారులు, తాగు నీటి పథకాల వరకు అన్ని రెండు మంజూరు చేస్తూ వస్తున్నాయి. ఒకే గ్రామానికి ఇద్దరు సర్పం‌చ్‌లు, రెండు పాఠశాలలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నట్లుగా అటెండర్‌ను మొదలుకుని ఐఏఎస్ దాకా అన్నీ డబుల్ ధమాకే. ఆ ఊర్లలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇంకా విచిత్రమేమిటంటే తెలంగాణ నుంచి సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తే మహారాష్ట్ర ఎన్నికలు రాగానే ప్లేట్ ఫిరాయించి మహారాష్ట్ర నుంచి ఎన్నిక కావడం ఈ గ్రామాల విశిష్టత.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version