స్థానిక ఎన్నికల్లో మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోసే కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ కావాలా లేక ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడే బీజేపీ కావాలా *
డా జాడి రామరాజు నేత
ఏటూరునాగారం, నేటిధాత్రి
సోమవారం రోజున కన్నాయిగూడెం మండలని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ జేజేలు కొడుతూ రాక్షస నందం పొందుతున్న బి ఆర్ ఎస్ కాంగ్రెస్ నాయకులు కావాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా బీజేపీ పార్టీ కావాలో కన్నాయిగూడెం మండల ప్రజలు ఆలోచించాలని అన్నారు అదేవిదంగా గత పదిసంత్సరాలు అధికారం లో బ్యాంకు లను దోపిడీ చేసి లబ్ది దారుల దగ్గర లక్షకు 40వేలు తీసుకున్నా నాయకులు కావాలా లేక బిల్డింగ్ లు పూర్తి చెయ్యకుండానే డబ్బులు డ్రా చేసుకున్నా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కావాలో ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు అదేవిదంగా 2019లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులను కన్నాయిగూడెం మండలానికి తీసుకొచ్చి స్థానిక నాయకున్ని ఓడించి రాక్షస నందం పొందుతూ మండల పరిషత్ నిధులను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తెలుసుకోవాలని అన్నారు ఇప్పటికైనా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాక్షస నందం పొందుతున్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ లకు స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు
