మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు…

మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెల 10 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ లతో గురువారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలలో విజయం కోసం పోరాటం చేసినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు,కార్యకర్తలకు,శ్రేణులకు,నాయకులకునా అభినందనలు తెలిపారు.ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.
శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఏజెంట్లు నిర్ణిత సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని,ఓట్ల లెక్కింపు వద్ద అభ్యర్థులు,ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు,అభ్యర్థులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌కు ఆందోళన మొదలైంది: రాజా రమేష్ బాబు

మంత్రి వివేక్ కు ఆందోళన, గుబులు మొదలయ్యింది…

చెన్నూర్ బిఆర్ఎస్ ఇంచార్జ్ రాజా రమేష్ బాబు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఆందోళన, గుబులు మొదలయ్యిందని చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అప్పుడెట్లుండే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఇప్పుడెట్లుంది అనే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.

రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని మంత్రి వివేక్ కు ఆందోళన మొదలైందని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో 50 సీట్లు కూడా గెలవలేదని మంత్రి నిరాశకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చెన్నూర్, క్యాతన్ పల్లి మునిసిపాలిటీలను గెలుపొందాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. డబ్బుతో నాయకులను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గత బిఆర్ఎస్ బాల్క సుమన్ పరిపాలన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మంత్రి పరిపాలనను గమనిస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాలలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మంత్రికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి గిఫ్ట్ గా ఇస్తారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version