అక్షర కాన్సెప్ట్ స్కూల్ లో సంఘటనను పక్కదారి పట్టిం చారు..

అక్షర కాన్సెప్ట్ స్కూల్ లో సంఘటనను పక్కదారి పట్టిం చారు

బీ ఆర్ ఎస్ మీడియా ఇంచార్జి అశోక్
వనపర్తి నేటిదాత్రి .

 

కాంగ్రెస్ నాయకులు మైనార్టీ ప్రజల కు క్షమాపణ చెప్పాలని బి.ఆర్.ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ నాయకులు మెకానిక్.శ్రీను, జోహెబ్ హుస్సేన్,అస్లాం అన్నారు వనపర్తి పాన్ గల్ రోడ్డులో అక్షర ప్రవేట్ స్కూల్ లో మైనార్టీ చిన్నారి పై జేరి గిన సంఘటన పై అండగా ఉండాల్సి పోయి అడ్డగోలు ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తు న్న రని వారు పేర్కొన్నారుసంఘటన జరగకముందు గాని జరిగిన తర్వాత గాని ఒక్క నాడైనా అక్షర స్కూల్ లోకి వెళ్ళడం గాని యాజమాన్యంతో మాట్లాడడం గాని జరగలేదని అశోక్ తెలిపారు. తన ఇంటి ముందు స్కూల్ పై దాడి జరుగుతుందంటే పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడికి వెళ్లా మని ఇది తప్పా అని అశోక్ ప్రశ్నించారు. దమ్ము దైర్యం ఉంటే అక్షర స్కూల్ యాజమాన్యంతో నేనుగాని మా నాయకులుగాని డబ్బులు అడిగినట్లు నిరూ పి స్తే వనపర్తి రాజీవ్ చౌరస్తాలో బహిరంగ ఉరి వేసుకుంటామని సవాల్ విసిరారు.బీ ఆర్ ఎస్ నేతల పై ఆరోపణలు, విమర్శలు వేసిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు మరియు స్కూల్ గుర్తింపు రద్దు చేసే వరకు ప్రజలు అఖిల పక్షా రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని పోరాడుతామని అశోక్ తెలిపారు
ఈ సమావేశములో నందిమల్ల.అశోక్,బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు మెకానిక్.శ్రీను, జోహెబ్ హుస్సేన్,యూసుఫ్,అస్లాం ఇమ్రాన్ బిన్ అలీ,మంద.రాము,జావేద్,అలీమ్,ముద్దసార్,ఖాదర్, ఫయ్యుం,నజీర్ తదితరులు పాల్గొన్నారు

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ. విచారణ .పేరీట వేధిస్తున్నందుకు.నిరసన వ్యక్తం చేయగా మాపై కేసులు నమోదా. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. ఫిబ్రవరి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలోభాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం .కక్ష.పూరిత వైఖరితో .వేధిస్తున్నందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో దిష్టిబొమ్మ దహనం నిరసనలు.చేయడం జరిగిందని. అందులో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో. కేసులు నమోదు చేశారని. తంగళ్ళపల్లి మండలం నుండి 18 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఎటువంటి కేసులకు భయపడేది లేదని బిఆర్ఎస్. పార్టీ నాయకులు వేధిస్తే .ఊరుకునేది .లేదని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. బిఆర్ఎస్ నాయకత్వాన్ని .వేధించడం మానుకొని ప్రజలకు ఇచ్చిన ఆరు .గ్యారెంటీలనుఅమలు చేయాలని. బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అణిచివేత ధోరణి ప్రజా వ్యతిరేకత విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కేటీఆర్ నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఎండ.గడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు మద్దతుగా. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లిరామ్మోహన్ సంఘీభావం ప్రకటించారు అరెస్టు కేసులు నమోదైన వారిలో. బిఆర్ఎస్.పార్టీనాయకులు. మాట్లమధు.కర్నేబాలయ్య. పూర్మాని.రాజశేఖర్.రెడ్డి.శ్యాగ దేవేందర్. బండి జగన్. తిరుపతిరెడ్డి. మీసాల కృష్ణ. దొంతినేని.చందర్రావు.గుండి మహేష్.గుగ్గిళ్ళ ఆంజనేయులు. అల్వాల సాయి.సుంచులజీవన్.ఇమ్మ నేనిఅమర్రావు. పోచంపల్లి రంగయ్య. తిరుపతి రెడ్డి. తదితరులు ఉన్నారు

గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….

గెలిచిన కౌన్సిలర్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది….

బిఆర్ఎస్ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తుంది….

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

సింగరేణి, పోలీస్ అధికారులు తస్మాత్ జాగ్రత్త….

బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సిపిఐ పార్టీ ప్రలోభాలకు లొంగదు…

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్

రామకృష్ణాపూర్, నేటిదాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి అన్ని వార్డుల్లో పోటీ చేసి 14 సీట్లు కైవసం చేసుకున్నా సరే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని, గెలిచిన కౌన్సిలర్లను వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కౌన్సిలర్ల కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.

11వ వార్డు లో గెలిచిన కౌన్సిలర్ బొమ్మ భూమయ్య గౌడ్ ఇంటి సమీపంలోకి సింగరేణి అధికారులు వచ్చి అట్టి భూమి సింగరేణికి సంబంధించిందని, సూచిక బోర్డులు పాతి భూమయ్య గౌడ్ భార్యను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు, సిపిఐ కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లతో కలిసి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామకృష్ణాపూర్ లోని కౌన్సిలర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.కౌన్సిలర్ భార్యకు మనోధైర్యాన్ని అందించారు.అనంతరం స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇందిరమ్మ రోజులను తలపిస్తోందని దుయ్యబట్టారు. సిపిఐ పార్టీ కౌన్సిలర్లను బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్న సరే ఎక్కడ కూడా కౌన్సిలర్లు కానీ కుటుంబ సభ్యులు కానీ బెదరకుండా ముందడుగు వేస్తున్నారని అభినందించారు. క్యాతన్ పల్లి మునిసిపాలిటీ చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేసి అక్రమంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసులు పెట్టి జైలుకు పంపించారని, అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయ్యిందని అన్నారు. బిఆర్ఎస్, సీపీఐ నాయకులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

దాడులకు దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కేసులు ఎందుకు పెట్టలేదో పోలీసులు తెలిపాలని అన్నారు. పోలీస్ శాఖ పూర్తిగా విఫలమయిందని, అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిడి లకు తలొగ్గి కౌన్సిలర్ల కుటుంబాలపై ఒత్తిడి తీసుకొస్తే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి, స్థానిక మంత్రికి ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. సిపిఐ పార్టీ ఎలాంటి ప్రలోభాలకు లొంగదని , పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, సిపిఐ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు…

మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెల 10 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ లతో గురువారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలలో విజయం కోసం పోరాటం చేసినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు,కార్యకర్తలకు,శ్రేణులకు,నాయకులకునా అభినందనలు తెలిపారు.ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.
శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఏజెంట్లు నిర్ణిత సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని,ఓట్ల లెక్కింపు వద్ద అభ్యర్థులు,ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు,అభ్యర్థులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌కు ఆందోళన మొదలైంది: రాజా రమేష్ బాబు

మంత్రి వివేక్ కు ఆందోళన, గుబులు మొదలయ్యింది…

చెన్నూర్ బిఆర్ఎస్ ఇంచార్జ్ రాజా రమేష్ బాబు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఆందోళన, గుబులు మొదలయ్యిందని చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అప్పుడెట్లుండే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఇప్పుడెట్లుంది అనే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.

రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని మంత్రి వివేక్ కు ఆందోళన మొదలైందని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో 50 సీట్లు కూడా గెలవలేదని మంత్రి నిరాశకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చెన్నూర్, క్యాతన్ పల్లి మునిసిపాలిటీలను గెలుపొందాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. డబ్బుతో నాయకులను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గత బిఆర్ఎస్ బాల్క సుమన్ పరిపాలన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మంత్రి పరిపాలనను గమనిస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాలలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మంత్రికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి గిఫ్ట్ గా ఇస్తారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version