వర్షకొండలో గణపతి నవరాత్రుల మహా అన్న ప్రసాదం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T134700.644.wav?_=1

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మహా అన్న ప్రసాదం

ఇబ్రహీంపట్నం. నేటి ధాత్రి

మండలంలోని వర్షకొండ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా గాంధీనగర్ గరుడ సేన యూత్ ఆధ్వర్యంలో గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలో పాల్గొంటారు విగ్రహ దాత యాస రాకేష్ మరియు అన్న ప్రసాదం దాత సల్వాల లవ కుమార్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీల పోరం ఫోనుకంటి వెంకట్ మరియు దంతుల శివారెడ్డి. గుజ్జరి గణేష్. పి రాజ్ కుమార్. మరియు గాంధీనగర్ గరుడ సేన యూత్ సభ్యులు.ఎం మురళి. మహేష్. లోకేష్. రాజ్ కుమార్. రాకేష్. లవ కుమార్.వర్షిత్. నాగేష్.చారి. నారాయణ. గంగాధర్. రజనీకాంత్. మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

కుప్పా నగర్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T133400.768.wav?_=2

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన హనుమంతరావు పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో రాష్ట్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త రేషన్  పంపిణి  చేసిన సందర్భంగా మాట్లాడారు.
గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం  మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాయంలో కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి రాఘవేంద్ర కృష్ణ ప్రకాష్ రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131603.110-1.wav?_=3

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యతియ్యాలి

నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ కోరారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాలతో బుదవారం దొంతి మాధవరెడ్డిని హన్మకొండలోని సగృహంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్ తో కలిసి తుమ్మలపెల్లి సందీప్ వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధానత్య ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే దొంతి యూత్ కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి బంగారు భవిష్యత్ అని కొనియాడారన్నారు.యువత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారని కష్టపడి పనిచేసే ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న.. తప్పక అమలు చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హమి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లా గౌడ్,నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కె షఫిక్,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నరిగె ప్రవీణ్, శ్రీకాంత్, అవినాష్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=4

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T130359.342-1.wav?_=5

జహీరాబాద్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,రబీ ఉల్ అవ్వల్ నెల సందర్బంగా జమాత్ ఇస్లామీ హింద్ సౌత్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇస్లామిక్ సెంటర్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ జరిగింది.సభకు అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాజిదా బేగం మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ ముస్తఫా జననం మానవాళికి వరమని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి కరుణ, ప్రేమ, న్యాయం ప్రసాదించారని పేర్కొన్నారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

ప్రత్యేక అతిథి సుమయ్య లతీఫీ అసిస్టెంట్ సెక్రటరీ, ఉమెన్స్ వింగ్, తెలంగాణ మాట్లాడుతూ సీరత్ బోధనలు కేవలం రబీ ఉల్ అవ్వల్‌లోనే కాక, జీవితాంతం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.హాజరా బేగం, సయ్యదా మేహనాజ్, ఫహ్మీదా మఖ్మూర్, హాఫిజా సఫూరా సిద్దీఖా వేర్వేరు అంశాలపై ప్రసంగించారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

హాఫిజా ఉమ్తుల్ ముబీన్ ఖురాన్ తిలావత్ చేశారు. జీఐఓ అధ్యక్షురాలు హుజైఫా అఫ్నాన్ నాత్ పఠించగా, సీఐఓ విద్యార్థినులు సున్నత్ పై నాటిక ప్రదర్శించారు.పిల్లల కోసం సీరత్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T124445.869-1.wav?_=6

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు

నిజాంపేటలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123957.151-1.wav?_=7

నిజాంపేటలో..
వెంటాడుతున్న యూరియా కష్టాలు..

నిజాంపేట: నేటి ధాత్రి

యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=8

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

గణనాథులను దర్శించిన వై. నరోత్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T122535.212-1.wav?_=9

గణనాథులను దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

గణేష్ నవరాత్రి ఉత్సవాల మొగుడంపల్లి మండల కేంద్రంలో* గణనాథుని దర్శనం, పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనిలో స్త్రీ శక్తి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసిన వినాయకుడుని దర్శనం,పట్టణంలో ఆర్యనగర్ వీధిలో శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడుని,సుభాష్ గంజ్ లో శ్రీ సేనా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాథుడుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,వెంకట్, మంజుళ,బి.జి.సందీప్,వంశి క్రిష్ణ,సురేష్, శికారి శ్రీనివాస్, సాయి కిరణ్,మహేష్,రమేష్, సుశీల్,నవీన్,బి.దిలీప్,ఆకాశ్,మల్లికార్జున్,ప్రశాంత్,విశాల్,తదితరులు పాల్గొన్నారు,

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121958.700-1.wav?_=10

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సి హెచ్ సంగమేష్ సాయిగౌడ్ కాశీ రామ్ లక్ష్మణ్ డి శేఖర్ పాండు హరి శ్రీనివాస్ పాటిల్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీశైలం మరియు యుత్ సభ్యులు కొల్లూరు అధ్వర్యం లో ఏర్పటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాలుగొన్న గ్రామ పెద్దలు నాయకులు.ఇట్టి కార్యక్రమములో కొల్లూరు మాజీ ఎంపీటీసీ సీ హెచ్ రాజ్ కుమార్ కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,మాజీ వార్డు సభ్యులు వై నగేష్ ఎం విష్ణు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం చింతలగట్టు శివరాజ్, సంగారెడ్డి నర్సింహారెడ్డి,దేవేందర్ దారా గోరఖ్ కాశీనాథ్ ఉమాకాంత్ సి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గోని బాల గణేశునికి పూజలు చేసి నిమజ్జనం కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేసారు.

గణేష్ ను దర్శించుకున్న ఎమ్మెల్యే….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121428.352-1.wav?_=11

గణేష్ ను దర్శించుకున్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం 7 అవార్డు లోబిఆర్ ఎస్ నాయకులు మంజు లో వెంకట్ స్థాపించిన గణేష్ మహరాజ్ ను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే మాణిక్ రావు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గణేష్ మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ గణేష్ మహరాజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకులతో కలిసి గణేష్ మహరాజ్ ను దర్శించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T120257.493-1.wav?_=12

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో
పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు
పాల్గొన్నారు

మహా ముత్తారంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

మహా ముత్తారంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు నీరు పారుతున్న రహదారులపై ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం మహా ముత్తారం మండలంలోని ముత్తారం – యామనపల్లి కేశవాపూర్ – పెగడపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పొంగుతున్న వాగులపై ప్రజలు ప్రయాణాలు చేయకుండా ట్రాక్టర్లు తో భారీ కేండింగ్ ఏర్పాటుతో పాటు రెవెన్యూ, పోలీస్, పంచాయతి శాఖల అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

 

వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగుల్లో చేపలు పెట్టేందుకు ప్రజలు వెళ్ళొద్దని సూచించారు. రహదారిపై నీళ్లు పారుతున్నందున ప్రజల రావాణా ఏ విధముగా చేస్తున్నారని పంచాయతి రాజ్, ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అజాం నగర్ మీదుగా వెళ్తున్నారని ప్రయాణం చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ఎం శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, పీఆర్ డిఈ రవీందర్, ఎంఈఓ రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ ఓ అనూష తదితరులు పాల్గొన్నారు.

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

సీఐ క్రాంతి కుమార్

భద్రత,బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం

ఎస్ఐ.రమేష్ నాయక్

పరకాల నేటిధాత్రి

పట్టణంమరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని పరకాల సీఐ.క్రాంతి కుమార్,ఎస్ఐ.రమేష్ నాయక్ తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ దంపతులకు ఘన సన్మానం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయబోతున్న సింగరేణి ఈ అండ్ ఎం డైరెక్టర్ సత్యనారాయణ దంపతులను మంగళవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సబ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో కమిటి సబ్యులు చేసిన కృషి అభినందనీయమన్నారు. దేవాలయంతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ అయినప్పటికీ ఆలయ అభివృద్ధిలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ జిఎం ఎం.శ్రీనివాస్ దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కృష్ణ, కుమారస్వామి, పాల్గొన్నారు.

అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

నేటిధాత్రి కథనానికి స్పందన

* అసైన్డ్ భూముల కబ్జాపై సర్వేచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
* అసైన్డ్ భూములపై విచారణ జరిపి అమ్మినట్టు తెలితే నోటిసులిచ్చి భూములు స్వాధీనం చేసుకుంటాం
* అసైన్డ్ భూముల కబ్జా చేస్తే చట్టపర చర్యలు తప్పవు
* చేవెళ్ల తాసిల్దార్ కృష్ణయ్య

చేవెళ్ల, నేటిధాత్రి:

కమ్మెట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 217 లొని ప్రభుత్వ అసైన్డ్ భూములలోనుండి ప్రైవేటు ఫామ్ హౌస్ లకు దారి వేశారన్నా ‘ నేటి ధాత్రి ‘ కథనానికి చేవెళ్ల తాసిల్దార్ స్పందించారు. చేవెళ్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ ఐ మోహన్ కబ్జాకు గురైన అసలు భూములను పరిశీలించారు. ఈ అసైన్డ్ భూములను ఆనుకుని ప్రహరీ గేటు నిర్మించిన ప్రైవేట్ వ్యక్తులకు గేటును తొలగించాలని ఆదేశించారు. దీనిపై సర్వే నిర్వహించి అసైన్డ్ భూముల హద్దులు కనుకుంటాం. ఈ అసైన్డ్ భూములను విక్రయించారన్న ఆరోపణలపై విచారణ జరిపిస్తాం. విచారణలో అసైన్ భూములు విక్రయించారని తెలితే 9/77 పి ఓ టి చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి భూములను స్వాధీనం చేసుకుంటామని తాసిల్దార్ కృష్ణయ్య తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమిలేని నిరుపేదలకు బతుకుదెరువు కోసం ప్రభుత్వం అసైన్డ్‌ భూమి ఇచ్చిందని, ఇందులో వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబం జీవనం సాగించాలి తప్ప మరొకరికి విక్రయించేందుకు అధికారం రైతుకు లేదన్నారు.రెవెన్యూలోని అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ అసైన్డ్‌ భూములను ఇతరులకు అప్పగిస్తే దాన్ని సాకుగా చూపి పీవోటీ కింద నేరుగా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు ఉందని స్పష్టం చేశారు. కొంతమంది లీజ్ పేరిట నోటరీ ద్వారా అసైన్డ్ క్రయ విక్రయాలు జరుపుతున్నట్టు మాదృష్టికి వచ్చింది.ఒకవేళ నిజంగానే అసైన్డ్ భూములు అమ్మినట్టు తెలితే రెవెన్యూ చట్టం ప్రకారం నేరుగా భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version