కార్మికోద్యమ నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ.

*కార్మికోద్యమ నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ
వర్ధంతి నివాళులు*

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణం లో ఈరోజు మే 22 కార్మిక ఉద్యమ నేత , అమరజీవి కామ్రేడ్. పర్స సత్యనారాయణ 10 వ. వర్ధంతి సందర్భంగా బి.వై. నగర్ లోని కామ్రేడ్. అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ లో CITU ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మికుల సమస్యలు , హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన గొప్ప కార్మిక నాయకుడు కామ్రేడ్.. పర్సా సత్యనారాయణ ని కొనియాడారు.కామ్రేడ్.. పర్స సత్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని వర్గాల కార్మికులందరిపై ఉందని వారి పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై , కార్మిక చట్టాల , హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క కార్మికుడు పోరాటాలలో భాగస్వామ్యం అయ్యి హక్కులను సాధించుకోవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళులు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు.!

కోటగుళ్లలో చెల్పూర్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి పూజలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో చెల్పూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version