.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం…

.స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 2000- 2001 పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ తోటి స్నేహితుడు కరీం పాషా తండ్రి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా మిత్రులందరు కలసి పదివేల ఆర్థిక సాయంను అందించారు. వారు మాట్లాడుతూ తమ మిత్రుల కుటుంబాల్లో ఎలాంటి అనివార్య సంఘటనలు జరిగిన తమ వంతు సహాయం అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మిత్రులు కొమ్ముల భాస్కర్, శ్రావణ్, రమేష్ , చందర్ , దేవేందర్ , రమేష్ , కిషన్ తదితరులు  పాల్గొన్నారు.

ఇంటి గోడ కూలి మహిళ మృతి…

ఇంటి గోడ కూలి మహిళ మృతి
* పది వేలు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు

మహాదేవపూర్ సెప్టెంబర్ 26 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం బెగుళూరు గ్రామంలో ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ పూర్తిగా నానడం తో గోడ కూలి మంద లక్ష్మి అనే మహిళ పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా మహిళ భర్త మంద దుర్గయ్య కు గాయాలయ్యాయి అని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ ఈ సంఘటనను మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు తెలుపగా వెంటనే స్పందించి బాదిత కుటుంబానికి మంత్రి ఆదేశాల మేరకు మహిళా భర్తకు నగదు గా పదివేల రూపాయలు ఇస్తూ దశ దిన కర్మ అనంతరం మంద దుర్గయ్య ఆరోగ్యా నిమిత్తం మెరుగైన వైద్యం ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version