బాధిత కుటుంబనికి భరోసాగా నూతన సర్పంచ్…

బాధిత కుటుంబనికి భరోసాగా నూతన సర్పంచ్

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బూరుగ్గుoపుకు చెందిన మల్లెల లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, వార్డు సభ్యులతో కలిసి మృతుని ఇంటికి చేరుకున్నారు. లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
​కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి దశదిన కర్మల నిర్వహణ కోసం తన వంతు సాయంగా 50 కిలోల బియ్యం ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని సర్పంచ్ భాగ్యమ్మ, వార్డు సభ్యులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్…

ఎస్ ఐ ని కలిసిన నూతన సర్పంచ్

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ను జంగవానిగూడెం గ్రామ సర్పంచ్ గొంది సోనీ రాజు కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్‌ఐ రాజ్‌కుమార్‌కు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పండుగ వేళ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జంగవానిగూడెం ఉప సర్పంచ్ అలెం మహేందర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సారంగపాణి, దారం భూపాల్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్‌రోలర్ చారి ఇతర గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version