కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట,నేటి ధాత్రి:

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్ష్మి పథకం అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో సిటిజెన్ క్లబ్ లో నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట నల్లబెల్లి,దుగ్గొండి,ఖానాపురం,చెన్నారావుపేట,నెక్కొండ మండలాలతో పాటు నర్సంపేట పట్టణం సంబంధించిన 305 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 5 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి అధ్యక్షతన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
పేద ప్రజలకు అండగా ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని లక్ష్యమని తెలిపారు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వైస్ చైర్మన్ హరిబాబు,ఎమ్మర్వోలు రవిచంద్రారెడ్డి,రెవెన్యూ ఇన్స్పెక్టర్స్,అధికారులు,సర్పంచ్ లు,
ప్రజా ప్రతినిధులు,అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకుపేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే.పరిస్థితి లేకపోవడంతో ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలును తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది చెక్కుల పంపిణీ ఎక్కువ అందించామని. ప్రజల అభివృద్ధి ప్రజా పరిపాలన లక్ష్యం అని ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఏ ఆటంకం వచ్చిన ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే ప్రభుత్వ ప్రజల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందని తెలియజేస్తూ. సారంపల్లి గ్రామంలో పలువురి లబ్ధిదారులకు.2.32.500. రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు. ఇoదుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి.0 ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్. ఉప సర్పంచ్ వంశీ. వార్డు మెంబర్లు. ఖాదర్ గడ్డమీద శ్రీనివాస్. హనీఫ్. జింక ఆనందం. కుమారస్వామి. అభిషేక్. అంజయ్య. కిషన్. వినీష్. సంతోష్. కరుణాకర్. శ్రీనివాస్. నాయకుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version