ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన

*ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నిర్లక్ష్యం*

*రాంగ్ రూట్‌,మొబైల్ వినియోగం,ఓవర్ స్పీడ్‌తో ప్రజల్లో ఆందోళన*

*పరకాల,నేటిధాత్రి*

 

పట్టణంలో ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వాహనదారులు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకు పెరుగుతోంది.ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు,ప్రధాన కూడళ్ల వద్ద రాంగ్ రూట్‌లో ప్రయాణించడం,ఓవర్ స్పీడ్‌తో దూసుకెళ్లడం వంటి ఘటనలు ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులను సృష్టిస్తున్నాయి.కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా విస్మరించి రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్తుండడంతో ఇతర వాహనదారులు,పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.అదేవిధంగా డ్రైవింగ్ చేస్తూనే మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం కూడా అధికంగా కనిపిస్తోంది.ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల దృష్టి మరలిపోవడంతో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఇక కొంతమంది యువత భారీ సైలెన్సర్ మోతలతో,ఓవర్ స్పీడ్‌లో వాహనాలు నడుపుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.రాంగ్ రూట్‌, మొబైల్ వినియోగం,అధిక శబ్దాలతో వాహనాలు నడిపే వారిపై జరిమానాలు విధించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచిస్తున్నారు.ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

యాదగిరిగుట్టపై దుకాణాల కోసం సంతకాల సేకరణ

*యాదగిరిగుట్టపైన దుకాణాల కోసం సంతకాల సేకరణ*
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

 

యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొండపైన ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న దుకాణాలను రద్దుచేసి కొత్తగా టెండర్లు వేయాలని పాత గుట్ట చౌరస్తా వద్ద తెలంగాణ టీ స్టాల్ ప్రరంగణంలో సంతకాల సేకరణ చేపట్టారు, సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానికులు సంతకాలు చేశారు.

ఇట్టి కార్యక్రమం పెద్ద ఎత్తున యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్త టెండర్స్ వలన దేవస్థాన ఆదాయం గణనీయంగా పెరుగుతుందని యాదాద్రి పరిరక్షణ సమితి నాయకులు ఈ కార్యక్రమంలో తెలియజేశారు.

విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికే సమ్మర్ క్యాంపులు

*విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికే సమ్మర్ క్యాంపులు*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం గీతానగర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తోందన్నారు.

ఈ నెల 17 వరకు జరిగే కార్యక్రమాల్లో నాట్యం, సంగీతం, చిత్రలేఖనం, చేతిరాత, కర్రసాము వంటి శిక్షణలు ఇవ్వనున్నట్లు తెలిపారు.ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు జరిగే ఈ క్యాంపుల్లో ఏ పాఠశాల విద్యార్థులైనా పాల్గొనవచ్చని చెప్పారు. పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని అంకాలపు సిరిని సన్మానించి, విద్యార్థులకు కిట్లు అందజేశారు.

పాలీసెట్-2026కు ఏర్పాట్లు పూర్తి

*పాలీసెట్-2026 నిర్వహణకు పరకాలలో ఏర్పాట్లు పూర్తి*

*మే13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష*

*పరకాల,నేటిధాత్రి:*

 

రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లోని మూడు సంవత్సరాల ఇంజనీరింగ్,నాన్ ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులతో పాటు వ్యవసాయ,వెటర్నరీ డిప్లమా ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్-2026 పరీక్షకు పరకాల పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలీసెట్ సమన్వయకర్త ఎస్.రవీందర్ రెడ్డి,సహాయ సమన్వయకర్త వై.కృష్ణ తెలిపారు.ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పరకాల పట్టణంలో మొత్తం 776 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారనిf తెలిపారు.పరీక్ష నిర్వహణ కోసం పరకాలలోని ఎస్ఆర్ హైస్కూల్,గణపతి డిగ్రీ కాలేజ్,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.విద్యార్థులు ఉదయం 9:30కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల నుండి మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు.ఉదయం 11 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం

*ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాలు ప్రారంభం*

*ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం*

*పరకాల,నేటిధాత్రి*

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్య వారోత్సవాల సందర్భంగా సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరకాలలో ఐఎఫ్పి,ఐడిపి కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ కే.సంపత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా డిజిటల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు.ఐఎఫ్పి,ఐడిపి ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన అందించడంతో పాటు ఐఐటీ-జేఇఇ,నీట్,ఇఏపిసీఇటి వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ కరపత్రాలను ఆవిష్కరించారు.కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభం

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన విద్యాధికారి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండపల్లి లోని మోడల్ స్కూల్ లో ఉచిత క్యాంపునుమండల విద్యాధికారి. భూక్య రాజు ప్రారంభించారు. సమ్మర్ క్యాంపు మే 11.వ తేదీ నుండి 25.వ తేదీ వరకు అనగా. 15 రోజుల క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా (ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు). ఈ క్యాంపులో పాల్గొనవచ్చునని. ఇట్టి క్యాంపు కార్యక్రమంలో పిల్లలకు మ్యూజిక్. డ్యాన్స్. డ్రాయింగ్. స్టోరీ. టెల్లింగ్. ఇండోర్ గేమ్స్. అవుట్ డోర్ గేమ్స్. నేర్పించబడునని. ఇట్టి క్యాంపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మానసిక మరియు శారీరక అభివృద్ధి పెంపొందించుకోవచ్చునని. అలాగే. ఇట్టి సమ్మర్ క్యాంపులో పాల్గొని విద్యార్థులకు స్నాక్స్ ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని. ఇందులో భాగంగా విద్యార్థులు అందరూ సద్వినియోగం చేయించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో విద్యాధికారి బూక్యా. రాజు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్. మామిళ్ళ విట్టల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

18 ఏళ్ల తాగునీటి సమస్యకు పరిష్కారం

18 ఏళ్ల సమస్యకు ముగింపు.

అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి సౌకర్యం.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామ అంగన్వాడీ కేంద్రానికి గత 18 సంవత్సరాలుగా తాగునీటి సౌకర్యం లేక చిన్నారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. పలు సమావేశాల్లో చర్చించినప్పటికీ పరిష్కారం కాలేదు.
ముగ్గురు సర్పంచులు, నలుగురు కార్యదర్శులు మారినా సమస్య అలాగే కొనసాగింది. అయితే తాజాగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కురుమన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ చొరవ తీసుకొని కేవలం మూడు రోజుల వ్యవధిలోనే.. సుమారు 100 మీటర్ల దూరం నుంచి కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రానికి నీటి సౌకర్యం కల్పించారు.
దీంతో అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ.. సర్పంచ్, కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.

ఆటో డ్రైవర్ నిజాయితీకి ప్రశంసలు

ఆటో డ్రైవర్ నిజాయితీ
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

 

యాదగిరిగుట్టలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆటోడ్రైవర్ హరిబాబు తన నిజాయితీని చాటుకున్నాడు, హైదరాబాదుకు చెందిన భక్తురాలు లక్ష్మీనరసింహస్వామి దర్శన నిమిత్తం ఆటో ఎక్కి దిగేముందు ఆటోలో మూడు తులాల బంగారి పుస్తెలతాడు మరిచిపోయింది.
మూడు తులాల బంగారు పూసలతాడును ఆటో డ్రైవర్ హరిబాబు పోలీసులకు అప్పగించాడు. ఆలయ ఈవో భవాని శంకర్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఆ బంగారాన్ని బాధితురాలికి అందజేశారు. దురాశకు పోకుండా బంగారాన్ని పోలీసులకు అప్పగించడాన్నే ఆలయ అధికారులు,పోలీసు సిబ్బంది, భక్తులు హరిబాబును అభినందించారు.

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

డివిజన్ స్థాయిలో ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(ఐడీఓసీ)లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణితోపాటు డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఆర్డీఓలు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతీ సోమవారం నిర్వహించే డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

హింస ప్రోత్సహించిన వారిపైనే కేసులు

క్యాతనపల్లి లో హింసను ప్రోత్సహించిన వారిపైనే కేసులు…

డిసిసి అధ్యక్షులు పి రఘునాథ్ రెడ్డి

అక్రమ కేసులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు..

పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు..

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల సమయంలో మంత్రి వాహనాన్ని అడ్డుకొని దాడులకు పాల్పడింది మీరు కాదా..? అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తపై ట్రాఫిక్ కోన్‌తో దాడి చేసింది నిజం కాదా..?” అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు పి రఘునాథ్ రెడ్డి రామకృష్ణాపూర్, పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్ లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఆదివారం సంతకం చేసేందుకు వస్తున్న బాల్క సుమన్ మీడియా ముందు అక్రమ కేసులు అంటూ మాట్లాడడం సరికాదన్నారు.

హింసను ప్రోత్సహించి, ఉద్రిక్త పరిస్థితులకు కారణమైనందుకే పోలీసులు కేసులు నమోదు చేశారని, అవి అక్రమ కేసులు కావని స్పష్టం చేశారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి చివరి గింజ వరకు నేరుగా కొనుగోలు చేస్తున్న ఘనత మంత్రి వివేక్ వెంకటస్వామిదేనని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మిల్లర్ల నుంచి లంచాలు తీసుకొని రైతులకు కనీస నష్టపరిహారం కూడా అందించలేదని ఆరోపించారు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.అనంతరం పార్టీ బలోపేతమే లక్ష్యంగా పట్టణ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు చేపడుతున్నట్లు వోడ్నాల శ్రీనివాస్ తెలిపారు.

రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పట్టణ కాంగ్రెస్ పార్టీలో అన్ని విభాగాలకు పూర్తి స్థాయి కమిటీలను వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, మరో రెండు మూడు రోజుల్లో అధికారికంగా కమిటీల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రజా పాలనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం

ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ,కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆహ్వానం మేరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య .ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రపంచం వేగంగా డిజిటల్ దిశగా ముందుకు సాగుతోంది. విద్యా వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాలి. పాతకాలంలో బ్లాక్‌బోర్డు మరియు పుస్తకాలతోనే బోధన జరిగేది. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ద్వారా బోధన మరింత సులభంగా, ఆసక్తికరంగా మారుతోంది , కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, అలాగే ఈ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు మరియు కళాశాల బృందానికి అభినందలు తెలియజేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు మాట్లాడుతూ డిజిటల్ క్లాస్‌రూమ్ వల్ల విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది. వారు పాఠాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందే అవకాశం కలుగుతుంది కావున ప్రభుత్వ కళాశాలలలో విద్యార్థులను చేర్పించడానికి ఆసక్తి చూపాలని అని తెలిపారు.అనంతరం 2025 -2026 విద్యా సంవత్సరం లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల జాబితా పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ ని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు,సిబ్బంది మరియు 4 వ వార్డ్ మెంబెర్ తౌటం నవీన్ పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో మదర్స్ డే హడావిడి

సోషల్ మీడియా కోసం మదర్స్ డేనా..?

ప్రేమగా చూసుకుంటారో లేదోగాని పోస్టులకు మాత్రం పోటీ

పోస్ట్ లకన్నా ప్రేమగా చూసుకుంటే చాలంటూ పెద్దల కొందరి అభిప్రాయం

పరకాల,నేటిధాత్రి

 

ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలో సోషల్ మీడియా హడావిడి స్పష్టంగా కనిపించింది.ఉదయం నుంచే యువత తమ తల్లులతో కలిసి దిగిన ఫోటోలు,సెల్ఫీలు,వీడియోలను వాట్సాప్ స్టేటస్‌లు,ఫేస్‌బుక్ పోస్టులు,ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపంలో షేర్ చేస్తూ సందడి చేశారు.నా ప్రపంచం అమ్మే,అమ్మ ప్రేమ అమూల్యం అంటూ సందేశాలు పోస్టు చేస్తూ ఒకరిని చూసి మరొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోస్టులను అనుసరిస్తూ చాలామంది ప్రత్యేకంగా కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించారు.మదర్స్ డే సందర్భంగా పరకాల పట్టణంలోని బేకరీలు కిటకిటలాడాయి.ప్రత్యేక డిజైన్ కేకులు,గిఫ్ట్ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకు యువత భారీగా తరలివచ్చారు.పలుచోట్ల కేకులు పూర్తిగా అమ్ముడైపోయినట్లు వ్యాపారులు తెలిపారు.అయితే మరోవైపు ఈ వేడుకలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే తల్లిదండ్రులను ప్రతిరోజూ ప్రేమగ చూసుకోవడం ముఖ్యమని పలువురు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.కొందరు మాత్రం ఒక్కరోజు కోసం మాత్రమే ప్రేమను ప్రదర్శించడం ఫ్యాషన్‌గా మారిందని విమర్శిస్తున్నారు.ఏదేమైనా సోషల్ మీడియా ప్రభావంతో మదర్స్ డే వేడుకలు పరకాలలో ఈసారి మరింత హడావిడిగా మారాయి.

ఆర్థిక తుఫాన్‌కు అలర్ట్.? బంగారం కొనొద్దని మోదీ ఎందుకు అన్నారు?

ఆర్థిక తుఫాన్‌కు అలర్ట్.?
బంగారం కొనొద్దని మోదీ ఎందుకు అన్నారు?

https://youtu.be/7I3PULZXfks?si=9mJosP-DEXquCkjX

దేశ ప్రజలకు PM ఇచ్చిన పిలుపు వెనుక… కనిపించని సంక్షోభ సంకేతాలున్నాయా..?

ఎందుకంటే…
ఒక ప్రధానమంత్రి ప్రజలకు ఇలా చెప్పడం సాధారణ విషయం కాదు..!

పెట్రోల్ తగ్గించండి…
బంగారం కొనొద్దు…
విదేశీ టూర్లు తగ్గించండి…
డెస్టినేషన్ మ్యారేజ్‌లకు బ్రేక్ వేయండి…
వంటనూనె కూడా జాగ్రత్తగా వాడండి…
ఒక ప్రధానమంత్రి… దేశ ప్రజలకు ఇలా “ఖర్చులు తగ్గించండి” అని ఓపెన్‌గా చెప్పడం… సాధారణ ప్రసంగం కాదు. ముందస్తు హెచ్చరిక.

మోదీ మాటల్లో దాగిన “ఎకానమీ ఎమర్జెన్సీ సిగ్నల్స్” ఏంటి..?

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ చేసిన ప్రసంగం… కేవలం పొదుపు సందేశం కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొనే అవకాశమున్న ప్రమాదాలపై ఇచ్చిన “సాఫ్ట్ వార్నింగ్”గా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే…
ఒకేసారి ఆయన ప్రస్తావించిన అంశాలు చూడండి :

పెట్రోల్ & డీజిల్ వినియోగం తగ్గించండి
బంగారం కొనొద్దు
విదేశీ పర్యటనలు తగ్గించండి
విదేశీ వస్తువులు తగ్గించండి
ఎరువులు తగ్గించండి
వంటనూనె దిగుమతులపై ఆధారపడొద్దు
ప్రజారవాణా వాడండి
స్వదేశీ వస్తువులు కొనండి

ఇది కేవలం “సేవ్ మనీ” క్యాంపెయిన్ కాదు..!
దేశ విదేశీ మారక నిల్వలు, దిగుమతి భారం, గ్లోబల్ వార్ ఎఫెక్ట్, భవిష్యత్ ఇంధన సంక్షోభం… అన్నింటినీ కలిపి ఇచ్చిన సంకేతంలా కనిపిస్తోంది.

అలాగే ‘దుబారా తగ్గించండి’ అంటున్నారు..? ఎందుకు అంటే?

కోవిడ్ తర్వాత ప్రపంచ సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు..
చైనా-తైవాన్ టెన్షన్స్…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం…
మిడిల్ ఈస్ట్ అస్థిరత…
రెడ్ సీ రూట్ సమస్యలు…
ఇవి అన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా రవాణా ఖర్చులు, ఇంధన ధరలు, దిగుమతి బిల్లులను పెంచేశాయి.
అందుకే మోదీ మాటల్లో “దిగుమతులపై ఆధారపడొద్దు” అన్న ఆవేదన స్పష్టంగా కనిపించింది.

ఇక బంగారం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు..?
ఇది చాలా కీలక పాయింట్..!
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఇంపోర్టర్లలో ఒకటి.
భారతీయుల బంగారం కొనుగోళ్లు కేవలం పెట్టుబడి కాదు—సాంప్రదాయం, భద్రత, సామాజిక ప్రతిష్ఠతో ముడిపడి ఉంటాయి. అలాంటి అంశంపై మోదీ నేరుగా వ్యాఖ్య చేయడం వెనుక ఆర్థిక ఆందోళన ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రజలు భారీగా బంగారం కొంటే…
దేశ విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది.
అంటే…
డాలర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
రూపాయి బలహీనపడుతుంది.
దిగుమతులు మరింత ఖరీదవుతాయి.
అందుకే మోదీ నేరుగా “ఒక ఏడాది బంగారం కొనొద్దు” అన్నంత దూరం వెళ్లారు.
ఇది సాధారణ విజ్ఞప్తి కాదు…
దేశ ఫారెక్స్ సేవింగ్స్‌పై ఫోకస్ చేసిన ఎకానమిక్ అలర్ట్‌గా విశ్లేషకులు చూస్తున్నారు.

ఇక పెట్రోల్-డీజిల్ తగ్గించమన్నది ఎందుకు..?
భారత్ ఇంకా భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతోంది.
ఒక్కసారి గ్లోబల్ వార్ పెరిగితే…?
హార్ముజ్ జలసంధి బ్లాక్ అయితే..?
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరిగితే..?
పెట్రోల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటొచ్చు.
అందుకే ఇప్పుడు నుంచే :
EVలు
ఎలక్ట్రిక్ రైల్వేలు
ప్రజారవాణా
ఇంధన పొదుపు
వైపు దేశాన్ని మళ్లించే ప్రయత్నంగా మోదీ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

ఇక డెస్టినేషన్ మ్యారేజ్‌ల వరకూ ఎందుకు వెళ్లారు..?
ఇది మిడిల్ క్లాస్‌కు ఇచ్చిన సైకాలజికల్ మెసేజ్.
“సోషల్ స్టేటస్ కోసం దుబారా ఖర్చులు తగ్గించండి”
అనే సంకేతాన్ని మోదీ చాలా క్లియర్‌గా ఇచ్చారు.
అంటే…
ప్రభుత్వానికి ముందున్న పరిస్థితులపై ఒక దీర్ఘకాలిక ఆందోళన ఉందా..?
భవిష్యత్‌లో ఖర్చులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా..?
అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వంటనూనె దిగుమతుల గురించి ప్రధాని ప్రస్తావించడం కూడా చాలా ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ఇది నేరుగా దేశ ఆహార భద్రతకు సంబంధించిన అంశం. భారత్ భారీగా ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడుతోంది. ఒకవేళ అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింటే… ప్రజల రోజువారీ జీవన ఖర్చులపై భారీ ప్రభావం పడే ప్రమాదం ఉంది.
అందుకే మోదీ “వంటనూనెలో స్వయం సమృద్ధి” అనే మాటను ప్రస్తావించారు. ఇది కేవలం వ్యవసాయ విధానం కాదు… భవిష్యత్ ఆహార భద్రతకు సంబంధించిన ఆందోళనగా కూడా చూడొచ్చు.

యూరియా ధరల గురించి మాట్లాడటం ద్వారా మోదీ మరో కీలక అంశాన్ని టచ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరిగినా… భారత్‌లో మాత్రం ప్రభుత్వం భారీ సబ్సిడీలతో తక్కువ ధరకు అందిస్తోంది.
అంటే ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఆర్థిక భారం మోస్తోందన్న సంకేతం ఇందులో కనిపిస్తోంది. ప్రపంచ పరిస్థితులు మరింత క్షీణిస్తే ఈ సబ్సిడీల భారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే “ఎరువుల వినియోగం తగ్గించండి” అన్న పిలుపు కేవలం పర్యావరణ కోణం మాత్రమే కాదు… ఆర్థిక కోణం కూడా కలిగి ఉంది.

ద్రావిడ గడ్డపై విజయ్ కొత్త శకం

విజయ్ అనే నేను..
ద్రావిడ గడ్డపై కొత్త శకం!

చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళగ వెట్రి కళగం అధినేత సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆరు దశాబ్దాల పాటు సాగిన ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, తొలిసారిగా ఒక నూతన పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తమిళనాడు అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

ముఖ్యమంత్రితో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశారు. బుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున , కేఏ సెంగోట్టయన్ , కేజీ అరుణ్‌రాజ్, పి.వెంకటరమణన్, సిటిఆర్ నిర్మల్ కుమార్, ఏ.రాజ్ మోహన్, టికె ప్రభు , ఎస్.కీర్తన మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మంత్రుల జాబితాలో మహిళలకు , షెడ్యూల్డ్ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ విజయ్ తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం , ఐయూఎంఎల్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.

ఈ చారిత్రాత్మక వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ హేమాహేమీలు హాజరయ్యారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా విచ్చేసి విజయ్‌కు అభినందనలు తెలిపారు. వారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులతో నెహ్రూ స్టేడియం కిక్కిరిసిపోయింది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే స్టేడియం మొత్తం దళపతి నినాదాలతో మారుమోగిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా చెన్నై నగరం అంతటా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

గవర్నర్ ఆదేశాల మేరకు మే 13లోగా అసెంబ్లీలో విజయ్ తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీవీకే కూటమికి 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో బలాన్ని నిరూపించుకోవడం సులభమేనని భావిస్తున్నారు. మధ్యాహ్నం విజయ్ తన కేబినెట్ తో తొలి సమావేశం నిర్వహించి, ఎన్నికల హామీల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఘనంగా ప్రారంభమైన పరకాల క్రికెట్ లీగ్

ఘనంగా ప్రారంభమైన పరకాల క్రికెట్ లీగ్

పరకాల,నేటిధాత్రి

 

హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలో స్థానిక యువతను ప్రోత్సహించే లక్ష్యంతో శివ 11 టీం ఆధ్వర్యంలో పరకాల క్రికెట్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చందుపట్ల రాజిరెడ్డి,పరకాల 15వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్,బీజేపీ నాయకులు కానుగుల గోపీనాథ్ హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.క్రమశిక్షణ,జట్టు భావన,ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో డీహైడ్రేషన్ కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని,క్రీడాకారులు ఎక్కువగా నీరు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే క్రికెట్ ఆడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రంజిత్, అశోక్,దిలీప్,శివ,రోహిత్, అజ్మీర సాయి,ఆకుల వెంకటేష్,సిద్దు,రాజేష్,నవి, టీవీరాజు,గణేష్,ప్రశాంత్,యాకూబ్,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలనతో చెరువులకు పునర్జన్మ

ప్రజా పాలనతో చెరువు పూడికతీతకు పునర్జన్మ
భూసారం జలసిరి రెండు రైతుకే

నేటిధాత్రి చర్ల 

చర్ల మండలంలోని పెద్ద చెరువు వద్ద ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రైతు వారంలో భాగంగా చెరువులో పూడిక తొలగింపు మరియు సమర్థ నీటి వినియోగంపై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ తిరుపతి మాట్లాడుతూ చెరువు మట్టిలో ఉన్న పోషకాలు పంట పొలాల్లో వినియోగిస్తే భూమి సారవంతం పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు అలాగే చెరువుల ద్వారా భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయో వివరించారు వ్యవసాయానికి వినియోగించే నీటిని అవసరానికి అనుగుణంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రైతులకు పలు సూచనలు చేశారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు చెరువులోని మట్టిని ఆ గ్రామానికి చెందిన పంట పొలాల్లో వినియోగించుకునేందుకు చెరువు పరిసర ప్రాంత రైతులు తమ సొంత ఖర్చులతో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు కల్పించిన విషయాన్ని కూడా తెలిపారు అదేవిధంగా రైతులు ముందుకు వచ్చి తమ పంట పొలాలకు చెరువు మట్టిని తరలించుకునే అవకాశమున్నందున కార్యనిర్వాహక ఇంజినీర్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచేశారు
ఎంపీడీవో ఈదయ్య మాట్లాడుతూ నీరు మానవ జీవితానికి ప్రాథమిక అవసరమని పూర్వ కాలంలో గ్రామాలు మరియు పట్టణాలు ఎక్కువగా నదులు చెరువుల పరిసర ప్రాంతాల్లోనే ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు ప్రస్తుతం బోర్‌వెల్‌ల వినియోగం అధికమవడంతో భూగర్భ జలాల మట్టాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు భూగర్భ జలాల పునరుద్ధరణకు చెరువులు ఎంతో ముఖ్యమని అందువల్ల పూడిక తీత కార్యక్రమం అత్యంత అవసరమని పేర్కొన్నారు నీటి వనరులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు
ఎంఆర్వో శ్రీనివాస్ మాట్లాడుతూ చెరువులు కాలువలను కాపాడుకోవడం రైతుల బాధ్యత అని తెలిపారు చెరువులో నుంచి తీసిన మట్టిని పంట పొలాల్లో మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆత్మ కమిటీ చైర్మన్ బుచ్చిబాబు మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల ప్రాముఖ్యతను వివరించారు చెరువుల వ్యవస్థ వల్ల నీటి నిల్వలు పెరిగి వ్యవసాయానికి ఎంతగానో ఉపయోగపడేదని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం చెరువుల అభివృద్ధి మరియు పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ చేపడుతున్న కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ సాంబశివరావు ఇరిగేషన్ సహాయక కార్యనిర్వాహక ఇంజినీర్ సంపత్ సహాయక ఇంజినీర్ సుమన చర్ల పంచాయతీ కార్యదర్శి సురేష్ రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

కమల వికాసం.. తెలంగాణ ప్రగతి సోపానం!

`ఇక ముందు ముందు కమల తెలంగాణ!

`తెలంగాణ పై బీజేపీ దృష్టి!

`తెలంగాణ లో అధికారమే లక్షంగా అడుగులు.

`పార్టీ పరంగా రాష్ట్ర శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న ప్రధాని మోడీ.

`నేడు హైదరాబాద్ రాక.. పెరగానునున్న కాక.

`తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర గురించి వివరించనున్న మోడీ.

`బీజేపీ సహకారం వల్లనే తెలంగాణ సాధ్యమైంది.

`రెండు పార్టీలకు తెలంగాణా ప్రజలు అవకాశం ఇచ్చారు.

`ఇప్పుడు బీజేపీ కి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు.

`డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం.

`ఉత్తరాధి అభివృద్ధితో సమానమైన ప్రగతి ప్రయాణం

`తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారం రావడమే మార్గం.

`ప్రజలు తెలంగాణ లో కూడా బీజేపీని కోరుకుంటున్నారు.

`గత పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు గెలిపించి ఆశీర్వదించారు.

`ఇప్పటికైనా నాయకులంతా ఒక్క తాటి పైకి రావాలి.

`సమిష్టి కృషి తో తెలంగాణ లో బీజేపీ ని అధికారం లోకి తేవాలి.

`కార్యకర్తలు సిద్దంగా వున్నారు..

`నాయకులు కదలాలని చూస్తున్నారు.

`ఇకపై అమితాషా పూర్తి స్థాయి దృష్టి పెట్టనున్నారు.

`నేడు ప్రధాని మోడీ సమర శంఖం ఊదనున్నారు.

`పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

`అభివృద్ధి అంటే ఏమిటో చూపించే ప్రయత్నం మొదలు పెట్టనున్నారు.

`ఇప్పటికే లక్షల కోట్లు గత 12 ఏళ్లలో తెలంగాణా కు ఇచ్చారు.

`డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణాను దేశంలోనే నెంబర్ వన్ చేయనున్నారు.

`ఒక్కసారి బీజేపీ అధికారంలో కి వస్తే రెండు దశాబ్దాలు తిరుగుండదు.

`తెలంగాణ లో ఇతర పార్టీలకు చోటుండదు.

హైదరాబాద్, నేటిధాత్రి:

తెలంగాణలో కమల వికాసానికి సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సమర శంఖం పూరిస్తాడని తెలుస్తోంది. తెలంగాణలో ఎట్టిపరిస్దితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచి, కాషాయజెండా ఎగురవేసే కృత నిశ్చయంతో రాజకీయం చేయాలని నిర్ణయం బలంగా తీసుకున్నటు కనిపిస్తోంది. గత రెండేళ్ల కాలంగా ఈ మాటను బిజేపి కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయకులకు చెబుతూ వస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో అక్కడ ఎక్కువ దృష్టిపెట్టాల్సి వచ్చింది. ఇక ఉత్తరాదిలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో కూడా హీట్రిక్ విజయం నమోదు చేయాలని బిజేపి పనిచేస్తోంది. అలాగే పంజాబ్‌లో కూడా ఈసారి అదికారం కైవసం చేసుకోవాలన్న దృడ సంకల్పంతో వుంది. ఆయా రాష్ట్రాలలో రెండు సంవత్సరాల నుంచే బిజేపి కార్యాచరణ మొదలు పెట్టింది. సహజంగా బిజేపి ఎన్నికల సమయానికే రాజకీయం చేయదు. ప్రజల్లో రెండు మÖడు సంవత్సరాల నుంచే విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తుంది. బిజేపిని పటిష్టం చేస్తుంది. క్షేత్రస్దాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తుంది. బూత్‌స్ధాయిలో కూడా నాయకత్వాన్ని నిర్మాణం చేస్తుంది. అలా పల్లె నుంచి పట్నం దాకా ప్రతి 50 మందికి ఒక బూత్ ఇన్‌చార్జిని ఏర్పాటు చేసి, పార్టీపై ప్రజల్లో నమ్మకం పెంచుతూ వస్తుంది. అలా పకడ్బంధీ ప్లాన్ చేయడంలో ఏ పార్టీకి లేనంత బలమైన క్యాడర్ బిజేపి వుంది. ఎన్నికల సమయంలోనే కేవలం ప్రజలకు ముందుకు వచ్చి బిజేపి ఎప్ప్పుడూ ఓట్లు అడిగే పార్టీ కాదు. ఎన్నికల తర్వాత ప్రజలను వలిలేయదు. దేశంలో ఒక్కసారి బిజేపి అధికారంలోకి వచ్చిందంటే దశాబ్దాల పాటు అధికారంలో వుంటుంది. అలా పార్టీని ప్రధాని మోడీ, ీVAం మంత్రి అమిత్‌షా ద్వయాలు పార్టీకి రెండు కళ్లుగా కాపాడుతూ వస్తున్నారు. అందుకే గుజరాత్ రాష్ట్రంలో వరస విజయాలు చూస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్‌లో బిజేపి ఏడు సార్లు విజయం సాదించింది. ఈసారి కూడా గెలిస్తే 8 సార్లు గెలిచినట్లౌవుంది. అలాగే దేశంలోన్ని రాష్ట్రాలో హాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నది. బిహార్, హర్యానా, మహారాష్ట్ర, అస్సాం వంటి రాష్ట్రాýలో మÖడుసార్లు విజయాలు సాదించింది. తిరుగులేని శక్తిగా బిజేపి ఎదిగింది. బిజేపి పునాదులు పెకలించడం ఎవరి తరం కాదన్నంతగా పార్టీ నిర్మాణం జరిగింది. దేశంలో ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ బిజేపి అదికారంలో వుంది. ఒకనాడు ఒక్క సీటు కూడా లేని అనేక రాష్ట్రాలలో బిజేపి మెజార్టీ స్ధానాలే కాదు, ప్రతిపక్షాలకు చోటు లేకుండా చేసింది. వరుస విజయాలతో బిజేపి దూసుకుపోతోంది. ఒకప్ప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఒక్క సీటు కూడా వుండేది కాదు. గత వరుస రెండు ఎన్నికల్లో తన బలం పెంచుకుంటూ, మÖడోసారి విజయం సాదించింది. ఈసారి బెంగాల్‌లో జెండా ఎగరేస్తామని చెప్పి మరీ గెలిచింది. అలా మహారాష్ట్రలో కూడా గతంలో అదే మాట చెప్పి వరసుగా మÖడుసార్లు గెలుస్తూ వస్తోంది. బిహార్‌లో కూడా ఎన్‌డిఏ కూటమితో విజయాలు సాదిస్తూ వస్తోంది. ఎన్నికలంటే బిజేపికి రాజకీయమే కాదు, ఒక టాస్క్. దేశం కోసం, ధర్మంకోసం, సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అనే పదాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తాయి. అయినా దేశ ప్రజలు ఇప్పటికి మÖడుసార్లు కేంద్రంలో వరుస విజయాలు బిజేపికి అందిస్తున్నారంటే సామాన్యమైన విషయంకాదు. ప్రజలు ఎప్ప్పుడైనా ఆత్మగౌరవాన్ని నిలిపే పార్టీ ఏదని చూస్తారు.. ప్రజల ఆకలి ఏ పార్టీ తీర్చుతుందని ఆలోచిస్తారు. దేశాన్ని కాపాడే శక్తి ఏ పార్టీకి వుందన్న చర్చలు సాగిస్తారు. దేశాన్ని ఏ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. బిజేపి పురుడు పోసుకున్న తర్వాత ఆ నమ్మకం దేశ ప్రజల్లో చిగురిస్తూ వచ్చింది. బిజేపిని నమ్ముతూ వచ్చారు. అయితే బిజేపిలో కూడా బలమైన నాయకత్వం ఎదిగే దాకా ప్రజలు కొంత ఓపిక పట్టారు. ఇక బిజేపి పార్టీయే దేశానికి శ్రీరామ రక్ష అని తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు, ఇతర పాక్షాలు, ప్రాంతీయ పార్టీలను కూడా దూరం పెడుతూ వస్తున్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బిజేపినే గెలిపిస్తూ వస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆ నమ్మకం ప్రజల్లో మరింత బలంగా పెరిగింది. దేశం కోసం బిజేపి పార్టీ చేసే త్యాగం కూడా అర్దమైంది. దేశాన్ని రక్షించే పార్టీగా బిజేపిని జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. గెలిపిస్తూ వస్తున్నారు. ఈ విజయాలు చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు ఎంత అసత్య ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌తో సహా, అన్ని పార్టీలు కలిసి బిజేపిని ఎంత నిందించినా ప్రజలు నమ్మడం లేదు. ఎన్ని రకాల ఆరోపణలు గుప్పించినా జనం ప్రతిపక్షాల మాటలు వినిపించుకోవడం లేదు. తమను కాపాడే శక్తి బిజేపియే అని, తమను పాలించే శక్తి ప్రధాని మోడీకే వుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకే దేశమంతా మోడీమంత్రమే జపిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే తెలంగాణలో బిజేపి అదికారంలోకి వచ్చే సంకేతాలు కనిపించాయి. అయితే తెలంగాణలో బిజేపిలో వున్న లుకలుకల మÖలంగా అధికారాన్ని హస్తానికి అందించారు. ఎన్నికలకు ముందు పార్టీని ఎంతో బలంగా పార్టీ నాయకులు, క్యాకర్తలు తయారు చేసుకున్నారు. ప్రజలను కూడా తమ వైపు తిప్ప్పుకున్నారు. ఈసారి బిజేపిని గెలిపించుకోవాలని అనుకున్నారు. కాని పార్టీలో ఏదో జరిగింది. బండి సంజయ్‌ని అద్యక్షపదవి నుంచి పక్కకు తప్పించడంతో పార్టీలో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. ప్రజల్లో కూడా ఆ ఆలోచన మాయమైపోయింది. పార్టీని తెలంగాణలో రక్షించగలిగే, బలం పెంచగలిగే నాయకుడు ఒకే ఒక్కడు బండి సంజయ్ అని అందరూ నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పార్టీని బలోపేతం చేయడంలో కేంద్ర ీVAంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అహర్నిషలు కృషి చేశారు. పార్టీ బలోపేతం కోసం ప్రజా సంగ్రామయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో అనేక ఉప ఎన్నికల్లోబిజేపిని గెలిపిస్తూ వచ్చారు. అలా అసెంబ్లీలో వున్న ఒక్క సీటుకు మరో రెండు విజయాలనందించి, బిజేపి ఎమ్మెల్యేల సంఖ్యను మÖడుకు పెరిగేలా చేశారు. ముందు దుబ్బాకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక సమయానికి బిజేపి తెలంగాణలో బలం పుంజుకుంటూ వుంది. అప్పటికే జిహెచఎంసి ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాదించి మంచి ఊపు మీద వుంది. దాంతో దుబ్బాక ఉపఎన్నికలో ప్రస్తుతం మెదక్ ఎంపి. రఘునందన్‌రావు విజయం సాదించారు. తర్వాత కొద్ది రోజులకు హుజూరాబాద్ నుంచి ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపి. ఈటెల రాజేందర్ 25వేల మెజార్టీతో గెలిచారు. అలా రెండు ఉప ఎన్నికల్లో అనూహ్యమైన విజయాలు బిజేపి సొంతం చేసుకున్నది. అయినా ఎక్కడో ఏదో జరిగింది. బండి సంజయ్ అధ్యక్షపదవి నుంచి తప్పించారు. దాంతో తెలంగాణలో బిజేపి గెలవకుండా పోయింది. కాని ఈసారి ఖచ్చితంగా తెలంగాణలో బిజేపి గెలిచేందుకు కేంద్రం పక్కా స్కెచ్ వేస్తోంది. బిజేపి జాతీయ నాయకత్వం ఒక్కసారి ప్రకటించిందంటే ఇక బిజేపి క్షేత్రస్ధాయిలో బలం పెంచుకోవడం నల్లేరు మీద నడకే అవుతుంది. ఎన్నికలకు ఇంకా రెండున్న సంవత్సరాలు వుంది. ఈ లోపు పార్టీని బలోపేతం చేయడంతోపాటు, పెద్దఎత్తున కేంద్ర నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేస్తారు. చేసిన అభివృద్దిని చూసి గెలిపించాలని ప్రజలను కోరుతారు. అలా ఉత్తరాది పరిస్ధితి ఒకప్ప్పుడు ఎలా వుండేది? ఇప్ప్పుడెలా వుంది? అని అడిగితే ప్రజలే సమాధానం చెబుతారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన అభివృద్ది గత యాభై ఏళ్ల కాంగ్రెస్ హాయంలో పది శాతం కూడా జరగలేదు. అందకే దేశ భవిష్యత్తు, రక్షణ వంటి అంశాలే కాకుండా, అభివృద్ది మంత్రం కూడా బిజేపితోనే సాధ్యమౌతుంది. అందుకే దేశ వ్యాప్తంగా జనం బిజేపిని పదే పదే నమ్ముతోంది. ఒకసారి అదికారం ఇచ్చిన ప్రజలు ఐదేళ్ల తర్వాత మార్పు కోరుకుంటారు. కాని బిజేపి పాలిత రాష్ట్రాలలో మాత్రం అలాంటి మార్పు కనిపించడు. పదే పదే బిజేపి పాలనే ప్రజలు కోరుకుంటారు. అలా ప్రగతిని బిజేపి మాత్రమే చేసి చూపించగలదు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో బిజేపి అడుగులు వేస్తోంది. అందుకు తొలి అడుగు పడేందుకు ప్రదాని హైదరాబాద్ వచ్చి, ప్రజలకు సందేశమివ్వనున్నారు.

రోడ్డు ప్రమాదం: వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో.. వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదం: వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో.. వ్యక్తి మృతి.

అనంతగిరి, నేటి ధాత్రి:

తమ్మరబండ పాలెం గ్రామానికి చెందిన దుద్దిరికి యల్లయ్య వెంకట్ శీను (26) అనే వ్యక్తి తన తల్లి ని కోదాడ ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చుటకు గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో తన ఫల్సర్ బండి నెం. టీఎస్-29 హెచ్-1858 పై తన ఇంటి సుందరయ్య కాలని తమ్మర బండ పాలెం వద్ద నుండి బయలుదేరి కోదాడ వెళుతుండగా మార్గమధ్యలో తమ్మర శ్రీ సీతారామ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లేసరికి ఆ సమయంలో ఫంక్షన్ హాల్ నుండి బయటికి వస్తున్న కారు నెం. ఏపీ-39 బిఎస్-4999 గల కార్ డ్రైవర్ తన కారుని అతివేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ దుద్దిరికి యల్లయ్య నడుపుతున్న బండిని ఢీకొట్టగా యల్లయ్య యొక్క తలకి బలమైన రక్త గాయమై అక్కడికక్కడే మృతి. మృతుని భార్య దుద్దిరికి భవాని ఫిర్యాదు మేరకు అనంతగిరి ఎస్సై ఎం. నవీన్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు.

కంఠ మహేశ్వరుని విగ్రహాల ప్రతిష్ఠాపన…

కంఠ మహేశ్వరుని విగ్రహాల ప్రతిష్ఠాపన

నల్లబెల్లి, నేటిధాత్రి:

నల్లబెల్లి మండలంలోని బొల్లోనిపల్లిలో శ్రీ కంఠ మహేశ్వరుని ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కంఠ మహేశ్వర స్వామి, సూరమాంబ దేవి, రేణుక ఎల్లమ్మ, వనం మైసమ్మ, పోతరాజు విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది.ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకట్ గౌడ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటలకు ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. 9 గంటలకు గౌడ సభ్యులకు మాలధారణ చేశారు.విగ్రహదాతలు దివంగత తిప్పని యశోద, సాయిలు గౌడ్, వారి కుమారుడు తిప్పని రాజయ్య గౌడ్ జ్ఞాపకార్థం కుమారులు, కోడళ్లు తిప్పని విజయ – సాంబయ్య గౌడ్, తిప్పని లక్ష్మి – రవీందర్ గౌడ్, తిప్పని రజిత – మహేందర్ గౌడ్, తిప్పని సృజన – లింగమూర్తి గౌడ్ ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనిషి తిప్పని సాంబయ్య గౌడ్, సారకోల పెద్ద మనిషి మేడిపల్లి ప్రసాద్ గౌడ్, అధ్యక్షుడు కోటగిరి దేవేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు గాజర్ల రాజు గౌడ్, కార్యదర్శి కోటగిరి రమేశ్, బోడిగే రాజు గౌడ్, బోడిగే సాంబయ్య గౌడ్, గాజర్ల రాంచంద్రు గౌడ్, గాజర్ల సారంగపాణి గౌడ్, తిప్పని సంపత్ గౌడ్, గట్టు సారయ్య గౌడ్, జక్కి రాములు గౌడ్, దేవేందర్ గౌడ్, పిడిమల్ల రాజేశ్ గౌడ్, స్వామి గౌడ్, సమ్మాలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బొడ్రాయి మహోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

బొడ్రాయి మహోత్సవ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండాల,నేటిధాత్రి :

మండల పరిధిలోని పడుగోనిగూడెం గ్రామ పంచాయతీ లోని నాగారం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోంబోయిన ముత్తయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె ఖదీర్ ముఖ్య అతిధులు గా విచ్చేసి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు బొడ్రాయి కార్యక్రమ నిర్వాహకులకు ఆర్థిక సహాయం చేశారు. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు కు మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, పడుగోనిగూడెం సర్పంచ్ ఈసం సంజీవరావు,మండల నాయకులు వాంకుడోత్ బీకోజీ,ఉకే బాబురావు,ఎస్కె కాసీం, బొంగు చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు జోగ రమేష్,ఈసం నర్సింహారావు, మోకాళ్ళ నిర్మల నాయకులు తదితరుల పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version