అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం..

అవినీతి కట్టడితో ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.

న్యూ ఢిల్లీ, జనవరి 28: 2026 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజైన ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. దేశం వికసిత్ భారత్‌ వైపు పయనిస్తోందని చెప్పారు. పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్లు కట్టించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు.
‘పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. సామాజిక న్యాయం ప్రాతిపదికన కేంద్రం పనిచేస్తోంది. వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించాం. ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఆయుష్మాన్ భారత్‌తో కోట్లమందికి వైద్యసేవలందిస్తున్నాం. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నెం1 స్థానంలో నిలిచింది. అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉంది’ అని రాష్ట్రపతి వెల్లడించారు.

దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాష్ట్రపతి అన్నారు. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని, జమ్మూకశ్మీర్‌లో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించామని గుర్తు చేశారు. గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్రపతి చెప్పారు.

ఇంకా రాష్ట్రపతి తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ‘అవినీతి కట్టడితో ప్రభుత్వ ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోంది. GST స్లాబ్‌ల తగ్గింపుతో దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. రూ.12లక్షల వార్షిక ఆదాయం వరకు ఆదాయపు పన్ను లేకుండా చేశాం. స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. భారత్ పవర్ టెక్నాలజీ హబ్‌గా రూపొందుతోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్‌ను పవర్ హౌస్‌గా తయారు చేస్తున్నాం. భవిష్యత్‌లో 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు. వికసిత్

గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు..

గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు.. అధికారులు నిర్లక్ష్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల గిన్నియర్ పల్లి గ్రామంలో వర్షాకాలంలో కూడా తీవ్ర నీటి కొరత నెలకొంది. బోర్లు పనిచేయకపోయినా, భగీరథ నీటి సరఫరా నెలలో కనీసం రెండుసార్లు కూడా సరిగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా ఆగిపోవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులే కారణమని అధికారులు చెబుతున్నారని, సమస్యపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

జల్ జీవన్ మిషన్ అమలు

*తిరుపతి జిల్లాలో తాగునీటి సరఫరాపై

తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 14:

లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి జిల్లాలో కేవలం 2.40 లక్షల గ్రామీణ ఇళ్లకు (57.58%) త్రాగు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అయితే,గత అయిదేళ్లలో 1.76 లక్షల కొత్త కనెక్షన్లు అందించారని, ప్రస్తుతం 4.16 లక్షల ఇళ్లకు (99.82%) తాగునీటి కనెక్షన్లు అందించబడ్డాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారీగా చూసినట్లయితే 1.19 లక్షల ఎస్సీ, 26 వేల ఎస్టీ కుటుంబాలకి త్రాగునీటి కనెక్షన్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఓబిసిలకి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కనెక్షన్ల కవరేజ్ గరించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం తిరుపతి జిల్లాలో మొత్తం 4,018 హ్యాబిటేషన్లు ఉండగా వాటిలో 487 ఎస్టీ,1,331 ఎస్సీ హ్యాబిటేషన్ గా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. వీటిలో 09.02.2025 నాటికి 485 ‘ఎస్టీ, మరియు1,328 ‘ఎస్సీ హ్యాబిటేషన్లు పూర్తి స్థాయిలో కనెక్షన్ లు అందించా
బడ్డాయని తెలిపారు.అలాగే తాగునీటి నిర్వహణలో గ్రామస్థాయి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ఏర్పాటు ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని 908 గ్రామాలలో 901 గ్రామాలకు గ్రామ నీటి,పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో 50% కమిటీ సభ్యులు మహిళలు కావడం గమనార్హమని అన్నారు.ఈ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యం కల్పించామనీ తెలిపారు.
ఈ పథకం ప్రారంబించే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో 30.74 లక్షల (32.18%) గ్రామీణ ఇళ్లకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందుబాటులో ఉండగా, 2025 ఫిబ్రవరి 9 నాటికి ఈ సంఖ్య 70.46 లక్షల (73.76%)కు చేరిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ ఇంటికి 55 లీటర్ల తాగునీరు రోజుకు అందించే లక్ష్యం కోసం జల్ జీవన్ మిషన్ వేగంగా పురోగమిస్తోందని ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక & సాంకేతిక సహాయం అందిస్తూనే ఉందని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version