రాజీమార్గమే రాజ.. మార్గం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T140614.114-1.wav?_=1

 

రాజీమార్గమే రాజ.. మార్గం..
 13 జాతీయ లోక్ అదాలత్..
ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

శత్రువులను పెంచుకుంటు వెళ్తే శత్రుత్వమే పెరుగుతుందని రాజీ పడితే.. ఇద్దరూ గెలిచినట్టేనని రాజీమార్గమే రాజ మార్గమని నిజాంపేట ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న జరిగే జాతీయలోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి యాక్సిడెంట్, గొడవ, చీటింగ్, భూతగాదాలు వివాహ సంబంధానికి సంబంధించిన కేసులపై రాజీ పడదగిన కేసులపై రాజీపడి కేసులను క్లోజ్ చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జహీరాబాద్ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T135631.821.wav?_=2

 

జహీరాబాద్ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సెప్టెంబర్ 13 న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి..

 రాజీ మార్గమే..రాజ మార్గం! రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు…

ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఈ సందర్భంగా ఎస్ఐ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని,అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు. మండల వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడేలా జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

రాజీ పడదగిన కేసులు:

క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,
సివిల్ తగాదా కేసులు,
ఆస్తి విభజన కేసులు,
కుటుంబపరమైన కేసులు,
వైవాహిక జీవితం సంబంధిత కేసులు,
బ్యాంకు రికవరీ,
విద్యుత్ చౌర్యం,
చెక్ బౌన్స్ కేసులు

కేసుల్లో ఇరువర్గాల మధ్య రాజీకి అవకాశం ఉంటుంది అన్నారు.

కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాద్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలన్నారు. జాతీయ లోక్-అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని అవగాహన కల్పించాలని అన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన నిర్మల లక్ష్మి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T134956.459.wav?_=3

 

 

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన నిర్మల లక్ష్మి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన ఝరాసంగం మండలం కస్తూరిభాయి పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నిర్మల సి ఆర్ టి లక్ష్మి కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.

 

 

 

అని,అజ్ఞానమనే చీకటిని ఫారద్రోలే వెలుగు చదువు అని తెలియజేశారు.మండలం స్థాయి లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఎస్ ఎస్ ఏ సంగారెడ్డి శాఖ పక్షాన శుభాభినందనలు. తెలిపారు,

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T134148.521.wav?_=4

 

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

సాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

సమాజంలో అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయక జీవితం నేటి తరాలకు మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సామాజిక సమానత్వం కోసం, అణచివేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేసారని అన్నారు. ఐలమ్మ పోరాటం కేవలం ఒక వర్గానికే కాకుండా మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయకమని, నేటి యువత ఐలమ్మ ధైర్యసాహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇందిర, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T133616.863-1.wav?_=5

 

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ..

◆:- ఐలమ్మ ఆశయాల స్పూర్తితో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులఘణన :

◆:- ఝరసంఘం లో ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ …
బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఝరసంగం మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.ఈ సంధర్బంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు.బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఆమె స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ హక్కులు,ఉద్యోగ అవకాశాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది అని అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త మల్లికార్జున్ పాటిల్ ,నవాజ్ రెడ్డి తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ నియోజక వర్గ ఇంచార్జి నర్సింలు,మరియు రజక సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ్,రజక సంఘం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్,రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాకలి శివకుమార్ , క్రిష్ణ,రాజు,మారుతి, పాండు,యాదగిరి, రాజు బోపనపల్లి,యువజన నాయకులు కొమారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే గండ్ర జిఎస్ఆర్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T132741.910.wav?_=6

 

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే గండ్ర జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ మాజీ కౌన్సిలర్ చిరుప అనిల్ ముంజల రవీందర్ తిరుపతి ఇర్ఫాన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T131902.044-1.wav?_=7

 

 

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

యూరియా కొరతపై రైతులు బుధవారంరోజున పరకాల పట్టణలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు.యూరియా అందక సాగు సీజన్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ పరకాల హనుమకొండ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.రైతుల ఆందోళన కారణంగా రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలు దాదాపు గంటసేపు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.అనంతరం పరకాల ఎస్ఐ విఠల్ సిబ్బందితో కలిసి నిరసన చేపట్టిన దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T130918.103.wav?_=8

 

 

అడవిని తలపిస్తున్న తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం

◆:- పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక అధికారి .

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండలంలో ని మాచునూర్ గ్రామంలో గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం, ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్మించింది. నేటి ప్రభుత్వం దానిని గాలికి వదిలేసింది. ఎన్నో లక్షలు వేచించి. ప్రజల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి క్రీడల పట్ల ఆసక్తి చూపడానికి, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి మాచునూర్ గ్రామంలో సర్వే నంబర్ 37/ఒక ఎకరం భూమిని కేటాయించింది. అట్టి భూమిలో క్రీడా ప్రాంగణం చుట్టూ కొన్ని మొక్కలు నాటడం జరిగింది. కోకో, వాలీబాల్, కబడ్డీ, శరీర దారుణ్యాన్ని పెంపొందించడానికి ఎక్ససైజ్ చేయడానికి అక్కడ కొన్ని స్తంభాలు నిర్మించడం జరిగింది. క్రీడలకు అనుకూలంగా ఉండేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటికి పట్టించుకోని నాధుడు లేడు. కొన్ని స్తంభాలు విరిగిపోవడం. క్రీడా ప్రాంగణంలో అడవిని తలపించేలాగా ఏపుగా పిచ్చి మొక్కలు పెరగడం జరిగింది. సంబంధిత అధికారులు పిచ్చి మొక్కలను తొలగించి స్తంభాలకు మరమ్మత్తులు చేయించి, క్రీడలకు అనుకూలంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T130308.014.wav?_=9

 

 

త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం

◆:- యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

స్థానిక సంస్థ ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి గారికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ వినతిపత్రం త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ కోరారు. సంగారెడ్డి పట్టణంలోని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ తో పాటు మున్సిపల్ ఎన్నికలలో 20శాతం కోట యువతకు కేటాయించాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నిర్మల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. వివిధ నియోజకవర్గం అధ్యక్షులు నవీన్, నాగిరెడ్డి, వెంకట్ జింగ, సిద్ధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, వసిం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ…

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T125744.602.wav?_=10

 

 

తెలంగాణ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ

మాజీమంత్రి నిరంజన్ రెడ్డ్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో
చాకలి.ఐలమ్మకు నివాళులు మాజి మంత్రి నిరంజన్ రెడ్డ్ తెలంగాణ పోరాట వీరవనిత
చాకలి.ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ.మంత్రి మాట్లాడుతూ భూమికోసం,భుక్తికోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి.ఐలమ్మ గారు చేసిన పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకం తెలంగాణ సాయుధ రైతాంగ
పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు.
నివాళులు అర్పించిన వారిలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస.రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,గంధం.పరంజ్యోతి,మాజీ కౌన్సిలర్స్ బండారు.కృష్ణ,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,సూర్యవంశం.గిరి,జోహెబ్ హుస్సేన్,హేమంత్ ముదిరాజ్,చిట్యాల.రాము,వజ్రాల.రమేష్, సాయిలీలా,కవిత,ఆటో యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T125138.476-1.wav?_=11

 

 

ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

 

ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా చందుర్తి మండలకేంద్రంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ వీర నారి అని తొలి తెలంగాణ రైతు సాయుధ పోరాట యోధురాలని ఆమె తెగువ ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆ రోజుల్లోనే ఒక మహిళ అయి ఉండి ఎందరో పెత్తందారులతో దొరలతో రజాకాలతో పోరాడి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేశారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చందుర్తి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు సుద్దాల నరసయ్య మరియు కోశాధికారి కొడగంటి గంగాధర్, చందుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య, మరియు చందుర్తి గ్రామ శాఖ రజక సంఘం సభ్యులు, యువకులు, చందుర్తి తాజా మాజీ నాయకులు పులి సత్యం, తిప్పని శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, గొట్టే ప్రభాకర్, బత్తుల కమలాకర్, చిర్రం తిరుపతి తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T124631.168.wav?_=12

 

ఇందిరమ్మ ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే త్వరగా సరిచేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (APBS) ద్వారా నగదు చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మంది ఆధార్ రికార్డుల్లో తప్పులు ఉండటంతో వివరాలు సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ నిలిచిపోయే ఛాన్స్ ఉండటంతో ఆధార్లో తప్పుల సవరణ వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు.

ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T123238.256.wav?_=13

 

 

ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ అంత్యక్రియలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

జహీరాబాద్,ముహమ్మద్ అయూబ్ అహ్మద్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ మరియు V6 న్యూస్ ఛానల్ రిపోర్టర్, ఖోర్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ సోదరుడు (30 సంవత్సరాలు) నిన్న రాత్రి హైదరాబాద్‌లోని నమాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన అంత్యక్రియల ప్రార్థనాయకు జహీరాబాద్ లోని ఈద్గాలోని బాగ్దాదీ మసీదులో జుహర్ ప్రార్థనల తర్వాత, మసీదు జహ్రా ఖతీబ్ మరియు ఇమామ్ మౌలానా మసూమ్ ఆలం ఖాస్మీ చేత చేయబడ్డాయి మరియు అంజుమాన్ స్మశానవాటికలో ఖననం జరిగింది. సమాచారం అందుకున్న రాజకీయ, సామాజిక, మతపరమైన నాయకులు మరియు జర్నలిస్టు సంఘం జహీరాబాద్‌లోని శాంతి ఒమర్‌లోని ఐడిఎస్ఎంటి కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి, ఓపికగా ఉండాలని సలహా ఇవ్వడం ద్వారా మృతుల కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు. అంత్యక్రియల ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T122706.838.wav?_=14

 

 

ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండల పరిదధిలోని శేఖాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న హజ్రత్ షేక్‌ షాబుద్దీన్‌ షయీద్ ఉర్స్‌ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేసి చాదర్ సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ శేఖాపూర్ గ్రామంలో షాబుద్దీన్‌ షయీద్ ఉర్స్‌ ఉత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం సంతోషకరమన్నారు ఈకార్యక్రమంలో వారితో పాటు సిడిసి చైర్మన్ ముబీన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి శేఖాపూర్ గ్రామ మాజీ యం.పి.టి.సి నర్సింహులు,మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇమామ్ పటేల్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి అక్బర్ హర్షవర్ధన్ రెడ్డి అశ్విన్ పాటిల్ జగదీశ్వర్ రెడ్డి నథానెయల్ అరుణ్

 

 

 

 

బి.మల్లికార్జున్ హర్షద్ పటేల్ రాజు నాయక్ రవీందర్ చౌహన్ హఫీజ్ అక్షయ్ జాడే జుబెర్ పటేల్ బి.గోపాల్ గౌసోద్దీన్ పటేల్ నిజాం జగన్ రబ్బానీ మరియు దర్గా కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయా మండలాల నాయకులు మాజీసర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు,

సమాచార హక్కు చట్ట నిబంధనలను పాటించని ఎంఆర్ఓ…

సమాచార హక్కు చట్ట నిబంధనలను పాటించని ఎంఆర్ఓ

దరఖాస్తు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా వీడని నిర్లక్ష్య వైఖరి

◆:- ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ సమాచార హక్కు చట్టం 2005 నిబంధనలను పాటించకుండా తన నిర్లక్ష్య వైఖరిని వ్యక్తపరుస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తమ పనులకు జవాబుదారీగా ఉండాలని నిర్దేశించడం, పనుల పారదర్శకత కోసం ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం పౌరుడికి కావాల్సినటువంటి సమాచారం పొందుటకు సమాచారకు చట్టాన్ని అమలులోకి తెచ్చి సంబంధిత అధికారి ప్రజల కోరిన సమాచారాన్ని ఇవ్వాలన్న ఆదేశాలు సంబంధిత అధికారులు కలిగి ఉన్నప్పటికీ సంబంధిత సమాచారం కలిగి ఉండి సమాచారం ఇవ్వకుండా నాలుగు నెలలుగా నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల తాసిల్దార్ తిరుమలరావు మండల పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయతర భూముల వివరాల సమాచారం కోరగా ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఆర్ఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో భూముల వివరాల అడిగిన బ్యాంకులో నువ్వు ఉన్నవారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అనుమానంతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా
వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉంటూ ఏ సమాధానం ఇవ్వలేదన్నారు ఆర్డిఓ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

పిల్లల పాలిట పాపిష్టిజ్యోతి! ఇదేం చదువు చెప్పే రీతి.

-వీపు అంతా వాతలు! కమిలిపోయేలా దెబ్బలు!!

-రాచిరంపాన పెడుతున్న పరంజ్యోతి.

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-మాటలు రాని విద్యార్థిని చితకబాదిన టీచర్‌.

-ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లాడు

-యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది!

oasis school warangal incident

-దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు?

-భారతీయత అనే వాట్సాప్‌ గ్రూప్‌ లో పిల్లల దెబ్బల ఫోటోలు వైరల్‌.

-ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వాక్యాలు?

-మూగ విద్యార్థి మీద టీచర్‌ ప్రతాపం.

oasis school warangal incident

-పాఠాలు చెబుతున్నారా! కోపాలు తీర్చుకుంటున్నారా!

-మీకు పిల్లలు లేరా! వారిని ఇలాగే కొడతారా!!

-పసివాడన్న కనికరం లేని టీచర్లు.

-ఎంత కొట్టినా ఏడ్వలేడు పిల్లాడు 

-చేతులెలా వచ్చాయో టీచర్‌ కు..

-వరంగల్‌ ఒయాసిస్‌ స్కూల్‌ టీచర్‌ నిర్వాకం.

-టీచర్‌ కొడుతున్నా అరవలేడు.

-ఏడ్చినా కన్నీళ్లు తప్ప మాటలు రావు.

-అలాంటి విద్యార్థిని కొట్టేందుకు టీచర్‌కు చేతులెలా వచ్చాయి.

-మాటలు రాని విద్యార్థి మీద కనికరం లేకుండా దెబ్బలు.

-యూకేజీ విద్యార్థిపై ఇంత దాష్టికమా?

-విద్యార్థికి మాటలు రాకపోవడం నేరమా

-మూగ విద్యార్థి మీద టీచర్ల ప్రతాపం.

-తల్లిదండ్రులను పిలిచి బుజ్జగింపులు.

-తల్లిదండ్రులతో పరంజ్యోతి బేరసారాలు.

-ఫీజులో రాయితీ కల్పిస్తామని తల్లిదండ్రులను వేడుకలు.

-ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని స్కూల్‌ ను మూసేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్‌.

-విద్యాశాఖ సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నారు.

-చైల్డ్‌ వెల్పేర్‌ వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                     

అతను యూకేజీ చదువుతున్న పసివాడు. రోజూ స్కూలుకు వెళ్లినట్లే వెళ్లి ఇంటికి వచ్చాడు. తల్లి స్కూల్‌ యూనిఫామ్‌ మార్చేందుకు అబ్బాయి షర్టు విప్పింది. అంతే ఆ అబ్బాయిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నది. గుండెలు పిండేలా ఆ తల్లికి ఏడుపు వచ్చింది. ఆ అబ్బాయి వీపంతా తడిమి చూసింది. ఆ తల్లి చేయి వీపు మీద పడగానే ఆ పసివాడు విలవిలలాడిపోయాడు. ముట్టుకుంటేనే జంకుతున్నాడు. వీపంతా ఎర్రగా మారిపోయింది. రక్తం కనిపించేలా వీపు మీద వాతలు తేలాయి. ఏం జరిగిందో చెప్పడానికి ఆ పసివాడికి మాటలు రావు. సహజంగా చిన్న పిల్లలకు మాటలు రాకపోవడం వేరు. కాని ఆ అబ్బాయికి పుట్టుకతోనే మాటలు రావు. కాని ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడు చదువుకోవాలని ఆశించారు. అది కూడా ఎంత ఖర్చయినా సరే మంచి ప్రైవేటు స్కూలుకు పంపాలని అనుకున్నారు. ఫీజులు చెల్లిస్తున్నారు. మాటలు రాకపోయినా, మన మాటలు వింటాడు. మనం ఏం చెబుతాడో అర్ధం చేసుకోగలడు. అందువల్ల స్కూలుకు పంపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో కాని స్కూలు నుంచి ఇంటికి విచ్చన ఆ పసివాడి వీపు నిండా వాతలే వున్నాయి. అది కూడా వీపంతా కమిలిపోయేలా దెబ్బలు కనిపిస్తున్నాయి. ఆ తల్లి తట్టుకోలేక ఏమైంది నాన్నా, అని అడిగినా ఏదీ చెప్పలేని మూగ జీవితం ఆ పసివాడిది. కనీసం టీచర్‌ కొట్టాడని చెప్పలేడు. టీచర్‌ కొడుతుంటే ఏడ్వలేడు. తన భాధను కన్నీటి రూపంలో తప్ప మరో రకంగా చెప్పలేడు. అందులోనూ టీచర్‌ కర్కషంగా కొట్టినా ఆ పసివాడు వద్దని వారించే వయసు కాదు. కొట్టకండి సార్‌ అనేందుకు నోరు లేదు. ఎదురుతిరిగే వయసు అసలే కాదు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్చించలేడు. కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం, బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు. అలాంటి పసివాడిని కసి తీరా కొట్టిన ఆ టీచర్‌ ఎవరో గాని అతను కర్కోటకుడా? లేక రాక్షసుడా? ఒక పసివాన్ని ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? అసలే మూడు నాలుగేళ్ల పిల్లవాడు. మాటలు రాని మూగ వాడు. అలాంటి పిల్లాన్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్‌కు వుండాలి. అంతే కాని ఆ పిల్లాడిని కసి తీరా కొట్టేంత దుర్మార్గుడు టీచర్‌ గా పనిచేయడానికి అనర్హుడు. శిక్షార్హుడు. అలా పిసి పిల్లవాడిని కొట్టిన టీచర్‌ను నిజంగానే చెట్టుకు కట్టేసి కొట్టితా తప్పులేదు. ఆ టీచర్‌ మిడిమిగి జ్ఞానం వున్నవాడైనా కావాలి. లేకుంటే ఆ స్కూల్‌ యాజమాన్యానిది వింత పోకడైనా కావాలి. ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు. కాని ఇలా ఒళ్లు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు. అసలు కొట్టిన వాడికి పిల్లలున్నారా? లేరా? ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా? ఆరా తీయాలి. ఎందుకంటే బిఈడీ, టిటిసి ట్రైనింగ్‌ చీసుకునే చాత్రోపాద్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది. చైల్డ్‌ సైకాలజీ చదువుకోవాలి. పిల్లల మనస్తత్వాలను గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల అందిరి మనస్తత్వం ఒక్కలా వుండదు. పిల్లలందిరకీ ఒకే రకమైన ఆలోచనలు వుండవు. కొంత మంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు. మరి కొంత మంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు. కొంత మంది ఎప్పుడూ ఆటల మీదనే దృష్టిపెడుతుంటారు. మరి కొంత మంది విద్యార్ధులకు ప్రత్యేక నైపుణ్యాలుంటాయి. ఇలా ఒక్కొ విద్యార్ధికి ఒక్కొ రకమైన జ్ఞానం సొంతంగా వుంటుంది. వాటిని గమనించి వారి వారి ఆలోచనలకు అనుగుణంగా పాఠాలు చెప్పడమే చైల్డ్‌ సైకాలజీ. ఇలా పిల్లాడిని వీపుంతా కమిలిపోయేలా కొట్టిన వాడి చదువు సంధ్యలేమిటో తెలుసుకోవాలి. పిల్లల్లో అల్లరి చేసేవాళ్లు కొంత మంది వుంటారు. అయితే యూకేజీ చదువుకునే పిల్లల అల్లరి ఆనందంగానే వుంటుంది. అలాంటి విద్యార్ధుల అల్లరిని చూసి కోపం తెచ్చుకునేవాడు టీచర్‌గానే పనికిరాడు. అందులో నోటి నుంచి మాట రాని ఓ మూగ పిల్లవాడు చెసే అల్లరి ఏముంటుంది? అలాంటి పిల్లలు అల్లరి చేయడానికి కూడా ఇష్టపడరు. ఎంత సేపు తోటి పిల్లలను గమనిస్తూ వుంటారు. అంతే తప్ప వాళ్లు ఇతర పిల్లలతో పోట్లాడేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. అందరి వైపు ఒక రకమైన చూపులతో చూస్తూ మిగతా వారు గలగల మాట్లాడుతుంటే, నేనేందుకు మాట్లాడడం లేదన్న భావన తన మనసు ఆ పసి హృదయాన్ని ప్రశ్నిస్తూనే వుంటుంది. అలాంటి పిల్లాడిని కొట్టిన స్కూల్‌ యాజమాన్యంలో కనీసం పశ్చాత్తాపం లేదు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పేందుకు కూడా యాజమాన్యానికి ఇష్టం లేదు. ఏ మీడియా నన్ను ఏమీ చేయలేదంటూ ఏం జరిగిందని ప్రశ్నించిన మీడియాతో యజమాని పరంజ్యోతి చిర్రుబుర్రులాడడం వింతగా వుంది. విచిత్రంగా వుంది. తాజాగా ఆ పిసివాడిని కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలు పెద్దఎత్తున భారతీయత అనే వాట్సాప్‌ ద్వారా పెద్దఎత్తున వైరల్‌ అవుతున్నాయి. వరంగల్‌ జిల్లా మొత్తం పాకిపోయింది. అది గమనించిన ఒయాసిస్‌ స్కూల్‌ యజమాని ఆ పసివాడి తల్లిదండ్రులను పిలిపించుకొని బేర సారాలకు దిగినట్లు కూడ సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని తల్లిదండ్రులను కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. తమ పిల్లాడి ఫీజులో రాయితీ కల్పిస్తామంటూ స్కూల్‌ మేనేజ్‌ మెంటు ఆ తల్లిదండ్రులకు ఆశలు కల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. పెద్దఎత్తున సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతుండడంతో మీడియా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే వారిని పరంజ్యోతి బెదిరిస్తున్నారు. నా వెనుక పెద్ద పెద్ద నాయకులున్నారంటూ చెబుతున్నట్లు మీడియా సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఈ విషయం కొంత మంది పోలీసు అదికారుల దృష్టికి వచ్చింది. ఏ జరిగింది? మీ స్కూలు బస్సులు ఇలా రోడ్డు మీద వుంటే ఎలా? అని ఆ పోలీసులు అదికారులు ప్రశ్నిస్తే మీపై ఆఫీసర్‌కు ఏం కంప్లయింట్‌ చేస్తావో చేసుకో అని వారిని కూడా పరంజ్యోతి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇలా స్కూల్‌లో దుర్మార్గాలు జరుగుతుంటే ప్రశ్నించిన వారిని బెదిరించే స్దాయికి విద్యా సంస్ధలు ఎదగడం అనేది వ్యవస్దకే నష్టం. అందువల్ల విద్యా శాఖ జరిగిన సంఘటనపై వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. విద్యార్ధిని అంతలా చితకబాదినా డిఈవో, ఎంఈవోలు ఇంత వరకు స్పందించలేదు. ఆ స్కూల్‌లో ఏం జరిగిందన్నదానిపై వివరణ తీసుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. ఇప్పుడు జరిగింది చిన్న సంఘటన కాదు. పసివాడిని వీపులో పిడికిలితో టీచర్‌ గుద్దితే ఆ పిల్లోడి ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యులు? అదృష్టం బాగుండి పిల్లవాడుచేయని తప్పుకు శిక్షను అనుభవించాడు. అదే ప్రాణాల మీదకు వస్తే అప్పుడు పరిస్దితి ఏమిటి? ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా వుంది. అంత జరిగితే ఆ విషయాన్ని బైట పెట్టకపోవడం కూడా తప్పే. ఇవాళ ఈ అబ్బాయికి జరిగింది. మరోసారి మరో అబ్బాయికి జరగదన్న గ్యారెంటీ ఏముంది? ఈ తల్లిదండ్రులను బెదిరించినట్లే ఇతర తల్లిదండ్రులను కూడా స్కూల్‌ యాజమాన్యం బెదిరిస్తుంది. భయపెడుతుంది. కనీసం మాటలు రాని పిల్లాడిని ఎలా కొట్టారని ప్రశ్నించే ధైర్యం తల్లిదండ్రులకు లేదా? ఫీజుల్లో రాయితీ ఇస్తామని చెబితే అంగీకరిస్తారా? మీ పిల్లాడి ప్రాణాలకన్నా, చదువు ఎక్కువకాదు. ఆ స్కూల్‌ ఫీజు రాయితీ అంతకన్నా పెద్దది కాదు. ఇప్పటికైనా ప్రైవేటుస్కూళ్లలో చదువుకునే తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. వారి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తున్నారు? తమ పిల్లలను టీచర్లు ఎలా ట్రీట్‌ చేస్తున్నారన్నది కూడా తెలుసుకుంటుండాలి. లేకుంటే స్కూళ్ల యజమాన్యాల వేషాలు మితిమీరిపోతుంటాయి. విద్యా శాఖతోపాటు, చైల్డ్‌ వెల్ఫేర్‌ శాఖ వెంటనే స్పందించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యార్ధిని కొట్టిన టీచర్‌ను, ఆ స్కూల్‌ యజమాని పరంజ్యోతిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే కట్టడి చేయకపోతే మిగతా స్కూళ్లు కూడా ఇలాగే తయారౌతాయి.

రాజీమార్గమే రాజమార్గం…

రాజీమార్గమే రాజమార్గం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

 

 

జాతీయ లోకాదళద్ తెలంగాణలో సెప్టెంబర్ 13న నిర్వహించబడును. ఇందులో ఎలాంటి కోర్టు వివాదాల్లో ఉన్న చెక్ బౌన్స్ కేసులు,ఆస్తి తగాదాలు, వైవాహిక కేసులు, రాజీ పడే క్రిమినల్ కేసులు, కార్మిక కేసులు, సివిల్ కేసులు, మోటార్ తరహా కేసులు వదులు అనే పరిష్కరించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని దాని వినియోగించుకోగలరని తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ జారీ చేశారు. కావున రాజీ పడాలనుకునేవారు ఈ కార్యక్రమం పాల్గొనగలరని కల్వకుర్తి పోలీస్ శాఖ తెలియజేశారు.

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

టీటీడబ్ల్యఆర్ఎస్ పూర్వ విద్యార్థులు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

 

 

 

 

వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన బానోత్ మోహన్ కుటుంబానికి టీటీడబ్ల్యూఆర్ఎస్ పూర్వ విద్యార్థులు 27 వేల రూపాయల ఆర్థిక భరోసాను కల్పించారు. మోహన్ దశదినకర్మ మండల కేంద్రంలో మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పూర్వ విద్యార్థులు మోహన్ సతీమణికి అందజేశారు. ఈ ఆర్థిక సహాయం చేసిన వారిలో గుండాల మండల కేంద్రానికి చెందిన ఎస్సై గడ్డం సతీష్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నరేష్, రవీందర్, మంగీలాల్, అశోక్, సురేష్, మంగీలాల్, బిక్షపతి, రాము మిగతా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో…

ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

గంగాధర నేటిధాత్రి :

 

 

గంగాధర మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులను ఎంపీడీవో దమ్మని రాము, ఎంపీఓ గౌరీ రమేష్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రెస్ మీట్ లు పెట్టడానికి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో భవన నిర్మాణ పనులు చేస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జారతి రాజిరెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, సభ్యులను ఎంపీడీవో, ఎంపీ ఓ అభినందించారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి జిల్లెల్ల లచ్చయ్య తదితరులు ఉన్నారు.

13 సెప్టెంబర్ జాతీయ మెగా లోక్ అదాలత్…

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలం గణపురం, కొత్తపల్లి గోరి, రేగొండ,పరిధిలోని ప్రజలకు తెలియ జేయునది ఏమనగా గొడవలు వద్దు-రాజీలు ముద్దు వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవిత కాలం కొనసాగుతాయి.ఒక వేల ఇంతటితో కలిసుంటాము అని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే సమసిపోతాయి మీరే తేల్చు కోండి వివాదాలు కావాలా.? రాజీలు కావాలా.? తేదీ. 13-09-2025 వ తారీఖు కోర్టులో “జాతీయ మెగా లోక్ అదాలత్” ఉంది కాబట్టి.మీ పై కానీ, మీకు తెలిసిన వాళ్ల పై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడును.1. యాక్సిడెంట్ కేసులు, 2. కొట్టుకున్న కేసులు,3. చీటింగ్ కేసుల కు సంబంధించిన కేసులు, 4. వివాహ బంధానికి సంబంధించిన కేసులు, 5.చిన్నచిన్న దొంగ తనం కేసులు,6,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు, మొదలైనవి.ఈ నేషనల్ లోకదాలత్ లో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.

error: Content is protected !!
Exit mobile version