బహుభాష సదస్సుకు ఆహ్వానం
జహీరాబాద్, నేటిధాత్రి:
శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ అక్క మహాదేవి బహుభాష జాతీయ సదస్సు సంస్కృతిక భవన్ ప్రారంభోత్సవ గ్రంథవిష్కరణ కార్యక్రమానికి న్యాల్కల్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన మారుతీ, మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి, సిద్దారెడ్డిలు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను మంగళవారం నాడు ఆలయ కమిటీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ అక్క మహాదేవి జాతీయ పురస్కర పురస్కారానికి తప్పని సరిగా హాజరు కావాలని డాక్టర్ రాజశేఖర్ శివ చారి కోరారు.
