వనపర్తి లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత…

వనపర్తి లో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత

ఉచిత క్యాన్సర్ వ్యాధి శిబిరం

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ కో ఆర్డినేటర్ సి ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య జర్నలిస్ట్ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పేషెంట్ కు దాదాపు 7000 రూపాయలు టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు . డాక్టర్ సుష్మ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు దాదాపు 150 మంది వరకు పేషెంట్లు వచ్చారని వారు తెలిపారు పేషెంట్లకు క్యాన్సర్ అని నిర్ధారణ తెలిస్తే అవసరం ఉంటే పేషెంట్ల ను ఉచితంగా హైదరాబాద్ ఎం ఎన్ జె క్యాన్సర్ హాస్పిటల్ కు డాక్టర్ రెఫర్ చేస్తున్నామని వారు తెలిపారు . అక్కడ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు ప్రతి గురువారం శ్రీ సత్య సాయి సేవ సంస్థ మందిరంలో హోమియోపతి డాక్టర్ చే ప్రజలకు ఉచితంగా పరీక్షించి ఉచిత హోమియోపతి మందులు పంపిణీ చేస్తున్నామని వారు పేర్కొన్నారు విశ్వ జ్యోతి రాష్ట్ర కోఆర్డినేటర్ రామకృష్ణ శ్రీ సత్య సాయి మెడికల్ కోఆర్డినేటర్ భాస్కర్ రావు శ్రీ సత్య సాయి సేవాదళ్ పాండురంగయ్య కోఆర్డినేటర్ శ్రీరామ్ రెడ్డి శ్రీ సత్య సాయి సేవ దళ్ భక్తులు పేషెంట్లకు సహకరిస్తున్నారు ఈ మేరకు పేషెంట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

వర్తక సంఘము భవనంలో వైద్య శిబిరం ప్రారంభిస్తున్న రామకృష్ణ సుమన్..

వర్తక సంఘము భవనంలో వైద్య శిబిరం ప్రారంభిస్తున్న రామకృష్ణ సుమన్

వాసవి క్లబ్ అద్యరములో

వనపర్తి నేటిధాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో వర్తక సంఘం భవనం ము లో డాక్టర్ మనోహర్ లోయ రాజస్థాన్ డాక్టర్లచే మోకాళ్ల నొప్పులకు కీళ్ల నొప్పులకు నడుము నొప్పులకు తుంటినొప్పులకు గ్యాస్ట్రో బిపి షుగర్ పక్షవాతం ఇంకా 100కు పైగా వ్యాధులకు 5 రోజులపాటు వైద్యం అందిస్తున్నామని వాసవి క్లబ్ అధ్యక్షులు ఆకుతోట రాఘవేందర్ తెలిపారు వాసవి క్లబ్ జిల్లా ఇంచార్జీ కొట్ర రామకృష్ణ మాట్లాడ తూ పాలమూరు రాయచూరులో అక్కడ ఆర్యవైశ్య లు ఈ మెడికల్ ఏర్పాటు క్యాంపు ఏర్పాటు చేశారని పరీక్షలు చేసుకొని డాక్టర్ల సూచనలు పాటించా రని చెప్పారు మనము ఆరోగ్య ము మన తోనే ఉంటుందని యోగ ధ్యానము వాకింగ్ చేయాలని సూచించారు వర్తక సంఘం అధ్యక్షులు పాలా ది సుమన్ మాట్లాడుతూ వనపర్తి లో వర్తక సంగం భవనంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు ఆకుతోట రాఘవేందర్ క్లబ్ నిర్వాహకులను అభినందించా రు వర్తక సంఘము భవనంలో నిర్వహించే మెడికల్ క్యాంపుకు కిరాణా వ్యాపారులు పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరీక్షలు చేయించుకోవాలని అదేవిధంగా డాక్టర్లచే సూచనలు సలహాలు పాటించాలని ఆయన కోరారు ఎలాంటి మందులు మెడిసిన్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి క్లబ్ నేతలు దాచ హరీష్ చిగుళ్ల పల్లి కార్తిక్ గోల్డ్ క్లబ్ అధ్యక్షురాలు కొంపల రజిత ప్రధాన కార్యదర్శి పాపిశెట్టి రాధిక కోశాధికారి ప్రశాంతి లక్ష్మి వర్తక సంఘం నేతలు కొండ కిషోర్ వై వెంకటేష్ దోమశివ
వర్తక సంఘము సీనియర్ నేత ఆర్ టి కొండ బాలకృష్ణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్..

ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్

సర్పంచ్ భానోత్ రమ భగవాన్ ఆధ్వర్యంలో

సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా నేత్ర వైద్య శిబిరం

నిరుపేదలకు కంటి చూపును ఇవ్వడమే మా స్వచ్ఛంద సేవ సంస్థ ఉద్దేశం… డాక్టర్ మాధవరావు.

మహబూబాబాద్, నేటిధాత్రి:

మండలంలోని గోవిందపురం గ్రామంలో సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్ట్ డాక్టర్ మాధవరావు నిరుపేదలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు మరియు కంటి ఆపరేషన్లు గోవిందాపురం గ్రామ సర్పంచ్ భానోత్ రమ భగవాన్ల ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షల శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ భానోత్ రమ పాల్గొన్నారు. గ్రామంలోని నిరుపేదలకు కంటి పరీక్ష చేయించుకోలేనటువంటి వారికి సూర్య స్వచ్ఛంద సేవా ట్రస్టు వారిచే ఉచితంగా కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు ఆపరేషన్ చేయాలన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గోవిందపురం గ్రామ ప్రజలు 111 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షల నిర్వహించుకున్నారని వారిలో 40 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం జరిగిందని, అలాగే కంటి ఆపరేషన్ అవసరం ఉన్నటువంటి 9 మందికి ఆపరేషన్ నిర్వహించుటకు జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి సూర్య స్వచ్ఛత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మాధవరావు కంటి దావకానలో ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మనిషి మనుగడ సజావుగా సాగాలంటే నయనాలు ప్రధానం అలాంటి నాయాలు నేత్రాలు నేడు మనం తింటున్నటువంటి కలుషిత ఆహారం వల్ల రెండవ అనారోగ్య సమస్యలు ఏర్పడడంతో నిరుపేదలైన వారు వైద్యం చేయించుకోలేక స్తోమత లేక నిర్లక్ష్యం వహిస్తున్నారని అంతత్వంతో కాలం గడుపుతున్నారని ఇలాంటి వారి పట్ల దాతృత్వం చాటుకొని ముందుకు పోతున్న సంస్థ సూర్య స్వచ్ఛంద సేవ ట్రస్ట్ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతుందని నిరుపేదలైన వారికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు చేసి మరి కంటి అద్దాలను ఇస్తుందని ఎవరికీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చేర్చుకునే మా గొప్ప అవకాశం కల్పిస్తున్నారని గ్రామ ప్రజల తరఫున సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గ్రామ సర్పంచ్ భానోత్ రమా భగవాన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి వారు గ్రామ వార్డు సభ్యులు కాంపాటి వెంకన్న, యాకయ్య, ప్రభాకర్, దేవేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

చర్లలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్

భద్రాచలం జడ్జి శివ నాయక్

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలం లింగాపురం పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు
మెగా హెల్త్ క్యాంప్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్యఅతిథిగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భద్రాచలం జడ్జి శివనాయక్
పాల్గొని మాట్లాడుతూ చర్ల మండలంలో ఉన్న ఏజెన్సీ ఆదివాసి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం చేపించుకోలేని స్థితిలో ఉన్నారని అందుకే

ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించటం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి ఎంపీడీవో ఈదయ్య తాసిల్దార్ శ్రీనివాసరావు ఈ మెగా క్యాంపు ఉద్దేశించి మాట్లాడారు పాల్వంచ ఎల్ వి ప్రసాద్ కంటి వైద్యశాల మేనేజర్ దేవి శంకర్రావు ఆధ్వర్యంలో సిబ్బందితో లింగాపురం పాడు గ్రామంలో ఐ క్యాంపు ఏర్పాటు చేపించి చర్ల మండలం లో ఉన్న ప్రజలకు కంటి పరీక్షలు జరిపించి మెరుగైన మందులు కళ్ళజోడులు అందించారు అట్లాగే కొయ్యూరు హస్పటల్ నుండి హోమియోపతి డాక్టర్ గుండెపూడి పూజ రోగులకు మెరుగైన వైద్యం అందించి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మందులను ప్రజలకు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మల్లారపు శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పటల్ కి పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ఇక్కడ మెరుగైన వైద్యం మందులు అందిస్తున్నామని ఆయన తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల సబ్ ఇన్స్పెక్టర్ కేశవ్ మాట్లాడుతూ చర్ల మండల ప్రజలు ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ఉపయోగించుకొని మెరుగైన వైద్యం పొందాలని ఆయన సూచించారు ఈ మెగా క్యాంప్ ఏర్పాటుచేసిన యువతకి అట్లాగే భద్రాచలం జడ్జి శివ నాయక్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గూగులోత్ మంగ కొత్తపల్లి సర్పంచ్ గంప నాగలక్ష్మి గొంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చార్నీల్ అశోక్ లింగాపురం ఉపసర్పంచ్ తడికల్ నరేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి గత నాలుగు రోజులుగా నిద్రహారాలు మానేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి బానోతు నరసింహారావు కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి భూక్య శరత్ కొంపల్లి కార్యదర్శి బైరెడ్డి నవీన్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన లాయర్ పరిటాల సంతోష్ ఈ కార్యక్రమంలో
సీనియర్ న్యాయవాదులు
అంబేద్కర్ తిరుమలరాజు ఆవులూరి సత్యనారాయణ పేరాల బండారు రమేష్ సాధనపల్లి సతీష్ సంధ్య శారద బండ రామలక్ష్మణ్ మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version