ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం..

ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం

జహీరాబాద్, నేటిధాత్రి:

 

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు  చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీడీవో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో అర్హులైన వారికి పని కల్పించడంతో పాటు గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతామని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో అవసరమైన మొక్కలను స్థానికంగానే పెంచే ఉద్దేశంతో నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల హరితాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆనంద్
ఫీల్డ్ అసిస్టెంట్ శశి కుమార్ గ్రామ పెద్దలు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version