పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు..

నిజాంపేట, నేటి ధాత్రి:

పశువులకు గర్భకోశ వ్యాధి టీకాలు పశుసంవర్ధక శాఖ సహకారంతో అందివ్వడం జరుగుతుందని మండల పశువైద్యాధికారి మణికుమార్ అన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న, రమేష్ ఆధ్వర్యంలో రైతుల పశువులకు టీకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లేగ దూడలు పుట్టిన 15 రోజుల నుండి ఆరు నెలల వరకు నట్టల నివారణ మందులు తాగించడం వల్ల లేగ దూడలు ఎదుగుతాయన్నారు. రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చిట్టాపూర్ గ్రామంలో గొర్రెలు, మేకల ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

చిట్టాపూర్ గ్రామంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో నట్టల మందు నివారణ మల్లాపూర్ డిసెంబర్ 30 నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటివంటి పశువైద్య పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ మందుల కార్యక్రమంలో మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సంపాతి శంకరమ్మ ప్రారంభించారు .ఇట్టి కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అశోక్,సహాయక సిబ్బంది రవీందర్, ఇక్బాల్, మహేష్ పంచాయతీ కార్యదర్శి అశోక్,ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్,సంపాతి ఆశలు,బార్ల మల్లేష్, బొల్లపెల్లి శ్రీనివాస్, పెసరి రాకేష్, హన్మండ్లు,మల్లేష్,సింగరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version