మద్యం అమ్మితే 50వేలు..

మద్యం అమ్మితే 50వేలు
పట్టించిన వారికి 10 వేలు నజరానా
గ్రామ సభలో తీర్మానం.

నిజాంపేట, నేటి ధాత్రి:

గ్రామాల్లో బెల్ట్ షాపులపై ప్రజలు కదం తొక్కుతున్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి మద్యపాన నిషేధాన్ని తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే 50 వేలు జరిమానా, పట్టించిన వారికి 10 వేలు నజరానా అందజేస్తామని గ్రామంలో గ్రామ సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మమత, ఉపసర్పంచ్ దేవరాజ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.

దిడిగి గ్రామంలో గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.

◆-: గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శ్రీమతి జగదాంబ సోమప్ప

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

గ్రామానికి టర్నింగ్ అయ్యే రెండు ప్రధాన పాయింట్ల వద్ద రోడ్డు పక్కల పొదలను జెసిబి సహాయంతో పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రంగా తీర్చిదిద్దారు. దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన దారి కనిపిస్తూ ప్రమాదాల అవకాశాలు తగ్గాయి. అంతేకాకుండా గ్రామానికి గుర్తింపుగా గ్రామ ఊరు పేరు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీమతి జగదాంబ సోమప్ప ఆధ్వర్యంలో, ఉపసర్పంచ్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సౌందర్యం పెరగడంతో పాటు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చేపట్టిన ఈ చర్యలపై గ్రామస్తులు సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల సర్పంచ్ జగదాంబ సోమప్ప చూపుతున్న చొరవకు ఇది నిదర్శనమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గ్రామ సర్పంచ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version