అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్…

అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటని చెప్పుకొచ్చారు.

వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్‌ తనకు మంచి స్నేహితుడని ప్రస్తావించారు. మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మరికాసేపట్లో బారామతికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వెళ్లనున్నారు. వారి కుటుంబ సభ్యులను సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం అజిత్ పవార్‌కు నివాళులు అర్పించనున్నారు.

అజిత్ పవర్ గొప్ప వ్యక్తి: ఆశిష్ షెలార్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మృతిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌ సేవలను కొనియాడారు. అనంతరం మీడియాతో ఆశిష్ షెలార్ మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా హఠాన్మరణం చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.అజిత్ పవార్ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని కీర్తించారు. కరోనా సంమయంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేకమైన ముద్ర వేశారని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచే ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉండే వారని కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా అజిత్ పవార్ ఉన్నారని తెలిపారు. అజిత్ పవర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆ పరమేశ్వరుడు ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆశిష్ షెలార్ పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి…

అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

 

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(66) విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అజిత్ పవార్‌(Ajit Pawar) సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం..

‘ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర బాధకు గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అందులో పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై కేబినెట్ సంతాపం..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. మంత్రి మండలి సమావేశం ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అజిత్ పవార్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధ్యక్షుడు, ఎన్‌డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అంకితభావంతో కూడిన ప్రజాసేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అందించిన అపారమైన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ప్రజల పట్ల అజిత్ పవార్‌కున్న నిరంతర నిబద్ధతను గౌరవంతో స్మరించుకుంటారని తెలిపారు. ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈ తీవ్ర దు:ఖ సమయంలో అజిత్ పవార్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అజిత్ పవార్ మృతిపై పీవీఎన్ మాధవ్ విచారం..

అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హృదయ విదారక ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యం చేకూర్చాలని ఆకాంక్షించారు.

అజిత్ పవార్ మృతికి రామ్మోహన్ సంతాపం..

అజిత్ పవార్ మృతికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే ఈ నష్టంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలవాలని, ఈ కఠిన సమయంలో శోకతప్తులైన కుటుంబానికి, అభిమానులకు ధైర్యం, బలం కలగాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్…

అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

 

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్(Maharashtra Deputy CM Ajit Pawar) బుధవారం ఉదయం బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కేటీఆర్ తదితరులు పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి..

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి

 

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్ ఇవాళ పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో మృతి చెందారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ అనంతరావు పవార్(Ajit Pawar) ఇవాళ(జనవరి 28) పుణేలో చార్టర్డ్ విమానం కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఆయనతోపాటు విమానంలో ఉన్న మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ముంబై నుంచి బారామతి వెళ్తున్న ఈ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉదయం 8:45 గంటల సమయంలో క్రాష్ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ వయసు 66 సంవత్సరాలు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version