ప్రపంచ వికలాంగుల దినోత్సవం పాఠశాలలో..

ప్రపంచ వికలాంగుల దినోత్సవం పాఠశాలలో..

నిజాంపేట: నేటి ధాత్రి

 

ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో వికలాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి సాంగాని యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల హక్కులు, తల్లిదండ్రుల బాధ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన రామిండ్ల యాదగిరి వయసు 35 సం:: బుధవారం రోజున అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల మృతి చెందాడు. మృతి చెందిన విషయం తెలుసుకున్న మెదక్ నియోజకవర్గ ఇన్చార్జ్ బిఆర్ఎస్ నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్తలతో మృతిని కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా మేము అండగా ఉండి ఆదుకుంటామని తెలిపారు. నియోజకవర్గం లోఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్న కంటరెడ్డి తిరుపతిరెడ్డికి టిఆర్ఎస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో ఎక్కడ ఏ చిన్నపాటి కష్టం ఎవరికైనా వచ్చిన వెంటనే స్పందించి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న తిరుపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దుర్గయ్య, ఎల్లం యాదవ్,మంగలి నరసింహులు ఎండి హబీబ్, మెట్టు లింగం, మెట్టు బాలయ్య,మెట్టు రాజు, పంగ రాజు, మన్నె రవి, బాల నర్సు, తదితరులు పాల్గొన్నారు.

మోహన్ నాయక్ సేవలు గణనీయం.

నస్కల్ లో ..
ఉచిత వైద్య శిబిరం
మోహన్ నాయక్ సేవలు గణనీయం.

నిజాంపేట: నేటి ధాత్రి

నిరుపేదల పెన్నిధిగా డాక్టర్ మోహన్ నాయక్ నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ.. పేదల గుండెల్లో నిలిచిపోతున్నాడు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో శుక్రవారం డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్తులు అధిక సంఖ్యలు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బిపి, షుగర్, ఇతర వ్యాధులకు పై వైద్యులు శాస్త్ర చికిత్సలు నిర్వహించారు. పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న డాక్టర్ మోహన్ నాయక్ ను గ్రామీణ ప్రాంత ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిద్ధరాములు, లింగం గౌడ్, లక్ష్మా గౌడ్, శ్రీనివాస్, దేశెట్టి లింగం , గుమ్ముల అజయ్, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version