ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి
విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ డిమాండ్ చేశారు.

మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
చిట్టు పాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ముందుకు సాగుతూ ఎస్సీ గురుకుల ను దేవాలయాల లాగా వుండాలని చెప్పారు.

కానీ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఒక ఐఏఎస్ అధికారిని అయి ఉండి దళిత విద్యార్థుల పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కుల అహంకారంగా భావించాల్సిన అవసరం ఉంది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను దళితులు పక్షాన ఉన్నాను ఉంటాను అని ఎన్నో వేదికల పైన మనకు తెలపడం జరిగింది కానీ ఇటువంటి కులహంకార అధికారుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షిని మాట్లాడిన మాటలు మనము గమనిస్తే విద్యార్దులే వారి టాయిలెట్లు కడిగితే తప్పేముంది అనే మాట ఏంతో విషపూరిత మాట కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటేనే వారిని తొలగించండి .

వారి మీద రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖకేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలి గురుకులాల సెక్రటరీ పోస్టును అర్హులైన దళిత అధికారిని వెంటనే నియమించాలి అప్పుడే మా దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా చదువుకునే విసులుబాటు అందుతుందిఅని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ టి. ఎం. ఆర్. పి. ఎస్ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version