కానిస్టేబుల్ రాజశేఖర్ కు డాక్టరేట్.!

కానిస్టేబుల్ రాజశేఖర్ కు డాక్టరేట్

యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకు దక్కిన అరుదైన గౌరవం

ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ-న్యూ ఢిల్లీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారి ద్వారా డాక్టరేట్ ప్రదానం

వేములవాడ నేటిధాత్రి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కి చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ యువతకి స్ఫూర్తి గా నిలుస్తూ యువతను పోలీస్, దేశ భద్రత దళాలోకి వెళ్లే విధంగా ఉచిత శిక్షణ ఇస్తూ యువత ను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ-న్యూ ఢిల్లీ, ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ అమెరికా వారు గౌరవ డాక్టరేట్ ని అందించి అభినందించారు.పోలీస్ ఉద్యోగ బాధ్యత లు నిర్వహిస్తూ దొరికిన కొద్ది సమయాన్ని యువత కోసం వినియోగిస్తూ వేములవాడ పట్టణ కేంద్రం గా గత 8 సంవత్సరాలనుండి యువతీ, యువకుల కు పోలీస్, ఆర్మీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబందించిన ఉద్యోగాల కోసం ఉచితంగా శిక్షణ ని ఇస్తూ యువత ని వివిధ సేవా కార్యక్రమాలలో వాలంటీర్లు గా సేవలు అందించే విధంగా వారిని ప్రోత్సహిస్తూ, రక్త దానం వైపు యువత కి అవగాహన కల్పిస్తూ, రక్త దాన శిబిరాలు నిర్వహిస్తూ రక్త కొరత లేని సమాజం కోసం కృషి చేస్తూ, ఇప్పటి వరకు 35 సార్లు రక్త దానం చేసి యువత కు మార్గదర్శి గా నిలుస్తూ మరియు ఇప్పటి వరకు 50 మంది యువతని ప్రభుత్వ ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వటం, కరోనా సమయం లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందులో యువత ని భాగస్వామ్యం చేస్తూ యువత కి ఆదర్శం గా నిలిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ కు హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ లో ప్రతిష్టాత్మక డాక్టరేట్ ని అందించారు.

ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ తాను చేస్తున్న సేవ ని గుర్తించి డాక్టరేట్ ని అందించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారికి చైర్మన్ డా.ఆకుల రమేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు, యువత కి తన వంతుగా సేవ చేస్తూ వారిని సమాజ సేవ లో భాగస్వామ్యం చేస్తూ భవిష్యత్తు లో యువత కూడా సమాజ సేవ చేసే విధంగా వారిని తీర్చి దిద్దుతూ, చెడు వ్యాసనాలకు గురి కాకుండా మంచి మార్గం లో నడిపిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తూ సమాజం లో తన వంతు బాధ్యత ని నిర్వహించడం తనకి తృప్తి ని ఇస్తుంది అని తెలిపారు.తనకి సహకారం అందిస్తున్న పోలీస్ ఉన్నత అధికారులకు, యువ ఫౌండేషన్ అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ఈ డాక్టరేట్ ని అంకితం ఇవ్వటం జరుగుతుంది అని తెలిపారు.

డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్.!

*డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ . . .

రాయికల్ .నేటిదాత్రి.తేదీ 11.04. 2025 

 

 

శుక్రవారం రోజున డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం లో భాగంగా డిపో మేనేజర్ కల్పన మేడం గారితో జగిత్యాల – బోర్నాపెల్లి బస్ కడెం వరకు కొనసాగించడం ద్వారా రామాజీపేట, భూపతిపూర్,లింగాపూర్,చింతలూరు, బొర్నపెల్లి గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులకు గురిఅవుతుంద్రు అని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశానుసారం కడెం వరకు బస్సు వేయడం జరిగింది అని మేడం తెలుపారు, కాబట్టి ఇక్కడున్న స్థానిక ఎంఎల్ఏ గారికి విజ్ఞప్తి, మన నియోజక వర్గంలో చివరి గ్రామం బోర్నపెల్లి,కావున ఇక్కడి ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి కొన్ని నెలల క్రితం పరిమితికి మించి ప్రయాణికుల ఎక్కడం ద్వారా రాయికల్ కు వచ్చే బస్ వెనక టైర్లు రెండు ఊడి పోవడం జరిగింది అదృష్ట వశాత్తూ ఆ సంఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, అన్ని రోజులు ఒక్కల ఉండవు కావున అలాంటి సంఘట మరొకటి జరుగకముందే బోర్నపెల్లి బస్ అక్కడి వరకే కొనసాగిస్తూ కడేంకు ఇంకొక బస్ వేయడం ద్వారా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ స్పందించక ఇలాగే పరిస్థితి కొనసాగిస్తే ప్రజల సౌకర్యార్థం ఎలాంటి నిరసనలు ఉద్యమాలు చేయడానికి అయినా సిద్ధం అని మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ అనడం జరిగింది

అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్.

అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ట్రాక్టర్ లారీ పట్టివేత..!

– అద్నూర్ ఎస్సై చల్ల రాజశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన న్యాల్కల్ మండలంలో శుక్రవారం నాడు హద్నూర్ ఎస్పై చల్ల రాజశేఖర్ సమాచారం మేరకు అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ఒక లారీ సీజ్ చేశారు హుస్సేల్లి చెక్పోస్ట్ దగ్గర హద్నూర్ ఎస్పై చల్లా రాజశేఖర్ తోటి సిబ్బందితో వాహన తనిఖీలు చేపడుతుండగా గణేష్ పూర్ గ్రామం నుండి ఒక ట్రాక్టర్( కె ఏ 38 టీ 5174 ) అశోక్ లేలాండ్ లారీ (ఏపీ 13 టీ 4188) లో అక్రమంగా ఎర్రరాయిని తరలిస్తుండగా వాటిని పట్టుకొని వివరాలు అడగగా ఎర్ర రాయికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని ఆ ట్రాక్టర్ లారీ లను స్వాధీన తీసుకొని న్యాల్కల్ మండల్ ఎమ్మార్వోకు తగు చర్య తీసుకోవాలని సీజ్ చేసిన ట్రాక్టర్ లారీని అధికారులకు అప్పగించారు. హద్నూర్ ఎస్సై చల్లా రాజశేఖర్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version