పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

న్యాయం కావాలి.!

న్యాయం కావాలి

‘బంధన్’ బాధితుడు కృష్ణ

⏩ ‘ఎంజీఎం’ నిపుణుల నివేదిక కోసం బాధితుడి ఎదురుచూపులు
⏩‘బంధన్’ ఘటనపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చేదెప్పుడు?
⏩8 నెలలు దాటుతున్నా ఫిర్యాదుపై కనీస పట్టింపు లేదు
⏩ఐఎంఏ సమక్షంలో తప్పు ఒప్పుకున్న సదరు ఆస్పత్రి వైద్యులు!
⏩ఆ నివేదిక ఆధారంగానే చర్యలు అంటున్న డీఎంహెచ్‌వో!

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

 

 

తనకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని ‘బంధన్’ హాస్పిటల్ బాధితుడు కృష్ణ వేడుకుంటున్నారు.గత ఏడాది ‘బంధన్’ఆస్పత్రిలో తనకు అన్యాయం జరిగిందని,పలు విభాగాల అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్జరీ,పోస్ట్ ఆఫ్ కేర్‌లో ‘బంధన్’లో జరిగిన క్షమించరాని నిర్లక్ష్యంతో తాను జీవితపు చరమాంకానికి వెళ్లి బయటపడ్డానని వెల్లడించారు.

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసుల కాంక్షతో, వ్యాపార దృక్పథంతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు కంప్లయింట్ చేసి 8 నెలలు దాటుతున్నా కనీస పట్టింపు లేకపోవడం సరికాదని,ఈ లెక్కన వ్యవస్థలో సామాన్యులకు న్యాయం అందడం,తప్పు చేసిన వారి పైన చర్యలు అంతంత మాత్రమే అనే భావన ఏర్పడుతోందని పేర్కొన్నారు.

పూర్తి వివరాలతో బాధితుడు కృష్ణ తెలిపిన ప్రకారం బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది జూలై 21న అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కృష్ణకు అదే రోజు సాయంత్రం 6 గంటలకు 4 గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.

ఈ క్రమంలో పెద్ద పేగుకు రంధ్రం పడటంతో రోగి శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ అయి పరిస్థితి విషమించింది.

ఒకరోజు తర్వాత అది గ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యులను అడగగా ఎవరూ స్పందించకపోవడంతో ఆపరేషన్ వికటించిందని భావించి జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్‌కు తీసువెళ్లారు.

అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.దాంతో ఆ రాత్రే బేగంపేట మెడికవర్ హాస్పటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యారు.

 

⏩పెద్దలతో ‘బంధన్’కు బంధాలు..!

 

 

మెడికవర్ ఆస్పత్రికి చేరుకునే సరికి రోగి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది.

 

మరో 6గంటలు ఆలస్యం అయితే ప్రాణానికి ప్రమాదమని అక్కడి సీనియర్ వైద్యులు తెలిపారు.

అక్కడ ట్రీట్‌మెంట్ అనంతరం బాధితుడు కృష్ణ తన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత బంధన్ హాస్పిటల్‌కి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై నిలదీశాడు.

దానికి వైద్యులు నిర్లక్ష్యమైన సమాధానాన్నిస్తూ తమ వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని, హాస్పటల్ రాజకీయ నాయకులదేనని బెదిరిస్తూ వస్తున్నారు.

 

‘మా బంధన్’ హాస్పిటల్ ఓపెన్ చేసింది కూడా ఓ మంత్రినే’అని తెలుసుకోవాలని బెదిరించినట్టు బాధితుడు ఆరోపించాడు.

 

తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు ఆధారాలతో హన్మకొండ డీఎంహెచ్‌వోకు,ఐఎంఏ వాళ్లకు ఫిర్యాదు చేశాడు.

 

ఐఎంఏ పెద్దల ముందు తాము బాధితుడు కృష్ణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించామంటూ ఒప్పుకున్నారు.

 

కానీ, ఆ హాస్పిటల్ మీద వైద్యులపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూ ఐఎంఏ డాక్టర్లు స్పష్టం చేశారు.

 

 

⏩రిపోర్ట్‌కు ఇంకెంత టైం కావాలో?

 

 

అనంతరం బాధితుడు డీఎంహెచ్‌వోను గతేడాది నవంబర్‌లో సంప్రదించగా..

 

16 డిసెంబర్ 2024న వరంగల్ ఎంజీఎం
సూపరింటెండెంట్‌కు ఎక్స్‌పర్ట్స్(నిపుణుల) కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు.

కానీ ఎంజీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక రాకపోవడంతో బంధన్ హాస్పిటల్‌పై, వారి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు తెలుపుతున్నారని బాధితుడు కృష్ణ వెల్లడించారు.

 

ఈ ఏడాది కాలంలో బంధన్ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు రెండు,మూడు జరిగాయని, అందులో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందారని కృష్ణ వివరించారు.

 

ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఎంక్వయిరీ పూర్తి చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

స్వాములకు దంపతుల అన్నప్రసాదం అందజేత.!

స్వాములకు రాసమళ్ళ కృష్ణ అంజలీ దంపతుల అన్నప్రసాదం అందజేత

 

పరకాల నేటిధాత్రి :

 

పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవస్థానంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన రాసమళ్ళ కృష్ణ అంజలి దంపతులు మరియు రాయపర్తి గ్రామానికి చెందిన మార్క రాజేశ్వరి విజయ్ కుమార్ లు ఆంజనేయ మాల వేసిన స్వాములకు అన్నప్రసాదం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్ ఇఓ వెంకటయ్య అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,భక్తులు,దీక్ష స్వాములు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది.

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version