ప్రమాదకరమవుతున్న మూలమలుపులు….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-16T120705.294.wav?_=1

 

ప్రమాదకరమవుతున్న మూలమలుపులు

ఉన్న కమిపించని సూచిక బోర్డులు

అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

పరకాల,నేటిధాత్రి

 

మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.మండలంలోని డిపో సమీపంనుండి నాగారం గ్రామం చేరే వరకు వెళ్లే రోడ్డులో అడుగడుగునా మృత్యు మలుపులుగా దర్శనమిస్తున్నాయి.2 కిలోమీటర్ల పొడువులో 3చోట్ల మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ ఈ మార్గంలో వెళ్లి లంటే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఈ రోడ్డుగుండా మొగుళ్లపల్లి,చిట్యాల మండల కేంద్రానికి చాలా గ్రామాల ప్రజలు అనేక మంది ఆటోల్లో, ద్విచక్ర వాహ నాలపై వెళ్తుంటారు.గతంలో కూడా మూలమలుపుల వద్ద అనేక మార్లు వాహనాల ప్రమాధాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.అలాగే ప్రైవేటు పాఠశాలల బస్సులు సైతం ఈ మార్గంలో వెళ్తుంటాయి.వాహ నాలు నడిపే వారు మూల మలుపులతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంటున్నా రు.మూల మలుపులు ఉన్న చోట రేడియంతో తెయారు చేసిన సూచికల బోర్డును ఏర్పాటు చేయా అని వాహనదారులు కోరుతున్నారు.మలుపు వద్ద ఏపుగా పెరిగిన మొక్కలు చెట్లకొమ్మలవల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకపోవడం తో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.మూల ములవులు ఉన్నచోట అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతు న్నారు.

ఆగితే తప్ప కనిపించని సూచిక బోర్డులు.. అధికారులు స్పందించాలి

పసుల వినయ్ అంబేద్కర్ బిఎస్పీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు

ఒకటి రెండు చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికి అవి చెట్లకొమ్మలు,చెట్ల తీగలు అడ్డుగా వాలి ఆగితే తప్ప వాహనాల మీద వెళ్ళేవారికి కనిపించడం లేదని ప్రజల మరియు వాహనదారుల ప్రణాలమీద అధికారులకు ఎందుకుయింత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్ధం కావడంలేదు.రాత్రి కాలసమయంలో ప్రయాణం నరకంగా మారుతుంది.ముందున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదలకు గురికాకుండా వాహనదారులకు కనిపించే విధంగా సూచిక బోర్డు లు ఏర్పాటు చేయాలనీ అధికారులను కోరుతున్నాం.

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి…

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

పరకాల మండల మడికొండ ప్రశాంత్ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి

 

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు ప్రభుత్వం తక్షణమే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ పరకాలమండల అధ్యక్షత మడికొండ ప్రశాంత్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారని దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు,7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందని 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి….

సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలి

పరకాల నేటిధాత్రి

 

సోమవారం నాడు తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో సీసీఐ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సూపర్డెంట్ కి సోమవారంనాడు వినతి పత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు ఈ కార్యక్రమంలో వీరి వెంట (ఏఐటియుసీ)కార్మిక సంఘం నాయకులు లంక దాసరి అశోక్,రైతునాయకులు సురావు బాబురావు,సురావు కిషన్ రావు,కోడం రవీందర్, రఘుపతి పలువురు పాల్గొన్నారు.

నివాళులు అర్పించిన చల్లా ధర్మారెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T112543.002.wav?_=2

 

నివాళులు అర్పించిన చల్లా ధర్మారెడ్డి..

“నేటిధాత్రి” పరకాల

 

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ గారు నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు రంగమ్మ గారి పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే గారి వెంట పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

రేగూరి గంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T111045.120.wav?_=3

 

రేగూరి గంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

గంగమ్మ ప్రతివాదేహానికి మహిళా కమిటీ నాయకురాళ్ల నివాళులు

పరకాల నేటిధాత్రి

 

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రంగమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

రంగమ్మ పార్థివదేహానికి మహిళ నాయకురాళ్ల నివాళులు

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందగా బిఆరఎస్ మహిళా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రంగమ్మ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.మహిళా పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి,సాంబరాజు జ్యోతి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన…

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన

పరకాల నేటిధాత్రి

శుక్రవారంనాడు టివివిపి ఉద్యోగులు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరరీ ద్వారా గీట్రెజరరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రతి నెల ఎప్పుడూ జీతం పడుతుందో తెలియని పరిస్తితి ఉందని,ఈ నెల ఇంకా జీతం రాలేదని దసరా పండుగ రోజు కూడా డబ్బులు లేక ఉపవాసం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రదర్శన లో డాక్టర్ బాలకృష్ణ,డాక్టర్ మౌనిక,నర్సెస్,పారామెడికల్,నాల్గవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.అనంతరం ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీషర్టులు ఉచితంగా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య,నోడల్ అధికారి నామాని సాంబయ్య,గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్,పీడీలు శ్యాం,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,పీఈటీలు పాల్గొన్నారు.

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

దుర్వాసన వెదజల్లుతున్న దామెరా చెరువు(మినీ ట్యాంక్ బండ్)

 

ఎమ్మెల్యే,మున్సిపల్ అధికారులు స్పందించాలి

బిఆర్ఎస్ యువజన నాయకులు ఇంగిలి వీరేష్ రావు

ఆహ్లాదకరంగా ఉండాల్సిన దామెర చెరువు(మినీ ట్యాంక్ బండ్)ప్రాంతం దుర్గంధంతో, చెత్త చెదరంతో కంపు కొడుతూ పరిసర ప్రాంతా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అధికారులు దామెర చెరువు పై నిర్లక్ష్యం వీడాలని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఇంగిలి వీరేష్ రావు అన్నారు.పరకాల ప్రజలు వాకింగ్ చేయడానికి,మరియు ఆహ్లాదకరంగా పిల్లలతో గడపడానికి గత ప్రభుత్వం సుమారు 4 కోట్ల రూపాయలతో దామెర చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పాలన పై శ్రద్ధ లేకుండా కేవలం పైసల పైనే శ్రద్ధ వహిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

మునిసిపాలిటీ కి సంబంధించిన ఆటోలే ఇక్కడ చెత్త వేస్తున్నట్టు స్థానికులు వివరించారని,పక్కనే ఉన్న శ్రీనివాసకాలని ప్రజలు ఈ కంపును భరించలేక పోతున్నారని,ఈ దుర్గంధం వల్ల వారి ఆరోగ్యాలకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమీషనర్ లు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు.

ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-09T132223.758.wav?_=4

 

ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి

పరకాల నేటిధాత్రి

 

హనుమకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మలకపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ మమత దంపతుల కుమారుడు ఉప్పరి సాయికృష్ణ ఎంబిబిఎస్ ప్రతిమ వైద్య కళాశాలలో సీటు వచ్చిన సందర్భంగా గురువారం రోజున ఉప్పరి సాయికృష్ణను మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నంత చదువు చదివి సీటు సంపాదించదం అభినందనియామని గ్రామ యవత చదువులో ముందుండి మిగతా గ్రామాల యువతకు ఆదర్శవంతంగా ఉండాలని తల్లిదండ్రుల పేరును మరియు గ్రామ పేరును నిలబెట్టే విధంగా యువత తయారు అవ్వాలని,ఎంబిబిఎస్ సీటు సాధించిన సాయి కృష్ణ మరింత మంది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి …

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

పరకాల నేటిధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మడికొండ ప్రశాంత్ మండల అధ్యక్షుడు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారు దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు 7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహేష్,విజయ్,అన్వేష్,రాకేష్,కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-06T123946.116.wav?_=5

 

డిప్యూటీ కలెక్టర్ ను అభినందించిన పాలకుర్తి తిరుపతి

పరకాల,నేటిధాత్రి

పట్టణానికి చెందిన పాలకుర్తి కాశయ్య రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు సందీప్ నిజామాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి సందీప్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి అభినందించారు. తన సోదరుడు పాలకుర్తి సందీప్ బాబాయ్ కాశయ్య స్ఫూర్తితో వ్యవసాయక అధికారిగా పనిచే స్తూనే గ్రూపు 1 పరీక్ష రాసి గ్రూపు వన్ లో 80 శాతం మార్కులు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియామకం కావడం ఎంతో గర్వంగా ఉందని పాలకుర్తి తిరుపతి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించినందుకు చెప్పలేనంత సంతోషం గా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో సందీప్ మరింత ఉన్నత సాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి

పరకాల,నేటిధాత్రి

పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి అన్నారు.ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటారని ఆమె తెలిపారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా పరకాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని,ప్రతి ఒక్కరూ ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు రామస్వామి…

పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు రామస్వామి

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పల్లె రామస్వామి పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షునిగా నియమించారు,అనంతరం రామస్వామి మాట్లాడుతూ నా నియమకానికి సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ మిద్దెల జితేందర్ కి, హనుమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి,ఐదు జిల్లాల కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జ్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి కి, హనుమకొండ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్ కి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేను కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిగా పనిచేస్తానని అన్నారు

బిట్స్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు…

బిట్స్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పాటలతో ప్రత్యేక నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థులు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని బిట్స్ పాఠశాలలోని ప్రిన్సిపల్ యుగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను తీసుకొచ్చారు.తొమ్మిది రోజులకు అనుగుణంగా 9మంది అమ్మవార్లను తయారు చేసి పిల్లలందరూ బతుకమ్మల చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ కోలలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.ఈ సందర్బంగా పాఠశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ ఇది పూల జాతర సెప్టెంబర్ నెలలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకోక తీరున రోజుకొక పేరుతో బతుకమ్మను పూలతో పేరుస్తూ ఆడపడుచులందరూ ఆనందంగా జరుపుకునే పండుగఅని అన్నారు.ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగనీ పువ్వులనే దేవుడిగా కొలవడం తమ బతుకులను,కష్టాలను పాటలుగా పాడుకోవడం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడ గుడి

 

 

కనిపించదని,బతుకమ్మ పేర్చటంలో వాడే ఆకులు,పూలు మంచి ఔషధాలు వీటిని చెరువులో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయిందని తెలియజేశారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుందనీ తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుందని హిందూ ముస్లింల ఆలైబలైలు తెలంగాణతో మమేకం మనకంటూ ప్రత్యేక విశిష్టత ఉందని మనకంటు ప్రత్యేక సంస్కృతి మన సంస్కృతిలోని పండుగలా వైభవం ఎంతో గొప్పదని అలాగే దసరా పండుగ రోజు జరిపే రావణాసురుని వధ ప్రత్యేకతను తెలియజేసి చెడుపై మంచి విజయం సాధించిన తీరును తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

నేడే పరకాలలో ఉచిత మెగా వైద్య శిబిరం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T112122.218.wav?_=6

 

నేడే పరకాలలో ఉచిత మెగా వైద్య శిబిరం

ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

మేకల చంద్రమోహన్ స్వేరో కార్డియాలజిస్ట్

పరకాల నేటిధాత్రి

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో ఆలోచన విధానంతో మరియు స్వేరోస్ నెట్వర్క్,మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం రోజున స్థానిక స్వర్ణ గార్డెన్ లో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ మేకల చంద్రమోహన్ స్వేరో కార్డియాలజిస్ట్ మరియు డాక్టర్ మౌనిక స్వేరో లు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో డాక్టర్ మామిడి తిరుపతి పీడియాట్రిషన్,డాక్టర్ గణేష్ మెడికల్ గ్యాస్ట్రిక్,డాక్టర్ నిహారిక ఆన్కాలేజి,డాక్టర్ మమత న్యూరాలజీ,డాక్టర్ దివ్య గైనకాలజీ,డాక్టర్ కళ్యాణి జనరల్ మెడిసిన్ గల వైద్యులు అందుబాటులో ఉంటారని శిబిరం వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు షుగర్ మరియు బీపీ పరీక్షలు 2డి ఇచో స్కాన్ నిర్వహించి ఉచిత మాత్రలు అందజేస్తారని,పేబ్యాక్ ద సొసైటీ అనే నినాదంతో తన జన్మస్థలమైన ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలకు సేవచేయాలనే ఆలోచనతో ఈ వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ వైద్య శిబిరానికి పరకాల,నడికూడ మరియు పరిసర ప్రాంత ప్రజలు హాజరై ఉపయోగించుకోవాలని కోరారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి…

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన కొనారి రఘువీరా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి వారి కుటంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామంలో కొద్దిరోజులక్రితం మరణించిన పోగు సారయ్య(భగవంతుడు) కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.

మహిపాల్ స్టోన్ క్రషర్ మీద చర్యలు తీసుకోవాలి…

మహిపాల్ స్టోన్ క్రషర్ మీద చర్యలు తీసుకోవాలి

పరకాల ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన సీపీఎం నాయకులు

పరకాల,నేటిధాత్రి

 

 

నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన మైపాల్ క్రషర్ పైన చర్యలు తీసుకురావాలని సిపిఎం నాయకులు ఆర్డీఓ డాక్టర్.కన్నం నారాయణకి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలోని వివిధ వార్డుల
ఇందిరమ్మ లబ్ధిదారులకు కంకర అవసరనిమిత్తం కొన్ని క్రషర్ లను కేటాయించారని ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రొసిడింగ్ లెటర్ పట్టుకొని కంకెర కోసం వెళితే క్రషర్ వద్ద పనిచేసే వ్యక్తులు ఇందిరమ్మ లబ్ధిదారులకు మాకు ఇలాంటి సంబంధం లేదనడం పై కళ్యాణ్ మండిపడ్డారు.అధికారులు కేటాయించిన జాభితాలో వివిధ క్రషర్లతో పాటు మైపాల్ క్రషర్ కూడా లిస్టులో ఉన్న కూడా నేను పోయెను అని అక్కడి వ్యక్తులు చెప్పడం సరికాదన్నారు.ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తూ 800 టన్నుకు అమ్ముకుంటున్నారని అన్నారు.ప్రభుత్వాన్ని ప్రజలను మోసంచేస్తూ డబ్బును దండుకుంటున్న క్రషర్ యాజమాన్యం మీద
స్థానిక ఎమ్మెల్యే,అధికారులు
స్పందించి ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు…

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు

 

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సిలివేరు మొగిలి మాజీ జడ్పీటీసీ మరణించగా అంతిమయాత్రలో సూర్య హాస్పిటల్ ఎండి డాక్టర్.సురేష్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సూర్య ట్రస్ట్ చైర్మన్ గజ్జి విష్ణు మొగిలి పార్థివదేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి దైర్యం చెప్పి వారి కుటుంబానికి రూపాయలు 5000 ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కొగిల్వయి చందు,పెంచల రాజెందర్,సిలివేరు చిరంజీవి,సిలివేరు వెంకటేష్,రాఘవ,వినయ్,రంజిత్,సాయి,దయ,ఈ అంతిమయాత్ర లో పాల్గొన్నారు.

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు…

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు

పరకాల నేటిధాత్రి

 

 

 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిన పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి పార్థివదేహానికి తన స్వగ్రామం మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మునిగాల సురేందర్ రావు నివాళులు అర్పించారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T131902.044-1.wav?_=7

 

 

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

యూరియా కొరతపై రైతులు బుధవారంరోజున పరకాల పట్టణలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు.యూరియా అందక సాగు సీజన్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ పరకాల హనుమకొండ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.రైతుల ఆందోళన కారణంగా రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలు దాదాపు గంటసేపు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.అనంతరం పరకాల ఎస్ఐ విఠల్ సిబ్బందితో కలిసి నిరసన చేపట్టిన దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version