ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యం — ప్రజల ప్రాణాలకు ప్రమాదం…

ఎంజీఎం ఆసుపత్రిలో నిర్లక్ష్యం — ప్రజల ప్రాణాలకు ప్రమాదం.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యరంగం దిశ తప్పిందని ఆరోపణలు

నేటిధాత్రి, వరంగల్‌:

 

ఉత్తర తెలంగాణకు ప్రాణాధారమైన ఎంజీఎం ఆసుపత్రి పరిస్థితి క్రమంగా దారుణంగా మారుతోంది. వైద్యం కోసం ఎన్నో జిల్లాల ప్రజలు ఆధారపడే ఈ ఆసుపత్రిలో నిర్లక్ష్యం అలవాటుగా మారిందంటూ రోగులు మరియు వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూపరిండెంట్‌, ఆర్ఎంలు, డ్యూటీ డాక్టర్లు, విభాగాధిపతులు (హెచ్‌వోడీలు) ఇలా ప్రతీ విభాగం అధికారులూ తాము నిర్వర్తించాల్సిన బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

రోగ సేవకులు, నర్సులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజూ అనేకమంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని సమీక్షించే స్థితిలో ప్రభుత్వం యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ ముందుకు రాకపోవడం పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఉత్తర తెలంగాణ ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ఆసుపత్రి ఇప్పుడు అవస్థల పాలవుతుంటే, బాధ్యత ఎవరిపైన అనే ప్రశ్న జనంలో తలెత్తుతోంది.

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన…

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన

పరకాల నేటిధాత్రి

శుక్రవారంనాడు టివివిపి ఉద్యోగులు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరరీ ద్వారా గీట్రెజరరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రతి నెల ఎప్పుడూ జీతం పడుతుందో తెలియని పరిస్తితి ఉందని,ఈ నెల ఇంకా జీతం రాలేదని దసరా పండుగ రోజు కూడా డబ్బులు లేక ఉపవాసం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రదర్శన లో డాక్టర్ బాలకృష్ణ,డాక్టర్ మౌనిక,నర్సెస్,పారామెడికల్,నాల్గవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version