ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి జిల్లా కలెక్టర్…

ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందనీ టీబీపై పోరాటం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
మంగళవారం ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాటు చేసిన టీబీ దినోత్సవంలో మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత టీబీ స్క్రీనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
టీబీపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని సూచించారు.
ప్రభుత్వం టీబీ నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని ముఖ్యంగా టీబీ రహిత తెలంగాణ కోసం మన జిల్లాకు మొబైల్ ఎక్సరే మిషన్ ను అందించడం జరిగిందని అన్నారు. జిల్లా లో టీబీ నిర్మూలనకు 35 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాలలో మొబైల్ ఎక్సర్ ద్వారా ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేపట్టి 6 నెలలు పాటు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. లక్షణాలు గుర్తించిన వ్యక్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు పోషణ కిట్లను సైతం అందించడం జరుగుతుందని తెలిపారు.
మున్సిపల్ కార్మికులు, ఆశా కార్యకర్తలు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో సైనికులని అభినందించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యాచరణలో భాగంగా మున్సిపల్ కార్మికులకు, ఆశా సిబ్బందికి ప్రత్యేకంగా వైద్య శిభిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారిని, మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు
మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య మాట్లాడుతూ క్షయ వ్యాధిసోకిన వ్యక్తులను గుర్తించి వైద్య సేవలు అందించి పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలని తెలిపారు. వైద్యసేవలు అందించే వైద్య సిబ్బంది ప్రజలకు దేవుళ్ళతో సమానమని తెలిపారు.
అనంతరం మొబైల్ ఎక్స్ రే ద్వారా మున్సిపల్ కార్మికుల కు ఛాతీ ఎక్స్ రే తీయు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య సైతం ఎక్స్ రే తీపించు కున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్ అప్పం కిషన్, వైద్యులు డా ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ నివారణ టీకాలు ప్రారంభించబడ్డాయి…

క్యాన్సర్ నివారణ టీకాలు ప్రారంభించబడ్డాయి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో సోమవారం మధ్యాహ్నం క్యాన్సర్ నివారణకు ప్రత్యేక టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ టీకాలను 14 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇవ్వాలని వైద్యాధికారి నవీన్ కుమార్ మరియు విస్తరణాధికారి నరసింహ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

భూపాలపల్లి ఆసుపత్రిలో కొత్త ల్యాబ్ టెక్నీషియన్లు చేరిక

ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన నూతన ల్యాబ్ టెక్నీషియన్లు..

పేద ప్రజలకు మరింత దగ్గర కానున్న వైద్య సేవలు..

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా 24 మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రప్రసాద్ కు నివేదించారు. అనంతరం బొకేలు అందించి శాలువాలతో సన్మానించారు… ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్లకు పలు సూచనలు చేశారు…వీరి రాకతో ల్యాబ్‌ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ వెంకట్ రత్నం. ఆర్ ఎంఓ లు ,అడిషనల్ డైరెక్టర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు…

వైద్య సిబ్బంది సారంపల్లి సర్పంచి లావణ్య నరసయ్యను సన్మానించగా

సారంపల్లిసర్పంచినీ సన్మానించినవైద్య శాలసిబ్బంది…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సారంపల్లి గ్రామ సర్పంచి లావణ్య నరసయ్య ను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించడం జరిగిందని తెలియజేశారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో నేరెళ్ల సర్పంచ్ పొన్నం లక్ష్మణ్. నేరెళ్ల. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చంద్రిక రెడ్డి. నేరెళ్ల సి. హెచ్. ఓ కృష్ణమూర్తి. సీనియర్ అసిస్టెంట్ కరుణాకర్. సూపర్వైజర్ రాంబాబు. ఏ ఎన్ ఎం ఎస్. ఆశా కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది గుగ్గిల శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి….

రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలి

– బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి

– సదరం శిబిరం పరిశీలన

– సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఇంఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

వైద్యులు రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం సందర్శించారు.
ముందుగా దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. రోగులకు మెరుగైన, సంతృప్తికరమైన వైద్య సేవలు అందించడం వైద్యుల ప్రథమ కర్తవ్యంగా భావించాలని సూచించారు.

శిబిరానికి ఎందరు వచ్చారు?

దవాఖానలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్థోకి సంబంధించిన సదరం శిబిరం నిర్వహిస్తుండగా, ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. సదరం రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు, వివరాల నమోదు, తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి సౌకర్యాల తీరును ఆరా తీశారు. మొత్తం 50 మందికి ఆర్థోకి సంబంధించిన పరీక్షలు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువెళ్ళారు.

సదరం శిబిరానికి రావడానికి మీరు ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నారు? ఈ రోజు శిబిరానికి రావాలని మా సిబ్బంది మీకు ఫోన్ చేశారా లేదా అని ఆరా తీశారు.

శిబిరం నిర్వహణకు సంబంధించిన వివరాలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు

శిబిరానికి వచ్చే వారి కోసం గదిలో మౌలిక వసతులు కల్పించాలని, ఫర్నిచర్ ఇతర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీఓ శేషాద్రి, వైద్యులు సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన…

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన

పరకాల నేటిధాత్రి

శుక్రవారంనాడు టివివిపి ఉద్యోగులు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరరీ ద్వారా గీట్రెజరరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రతి నెల ఎప్పుడూ జీతం పడుతుందో తెలియని పరిస్తితి ఉందని,ఈ నెల ఇంకా జీతం రాలేదని దసరా పండుగ రోజు కూడా డబ్బులు లేక ఉపవాసం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రదర్శన లో డాక్టర్ బాలకృష్ణ,డాక్టర్ మౌనిక,నర్సెస్,పారామెడికల్,నాల్గవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా దొమ్మటి శ్రీను రక్తదానం..

ఎమ్మెల్యే జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన దొమ్మటి శ్రీను

పరకాల నేటిధాత్రి
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన సందర్బంగా పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి శ్రీనివాస్ తనవంతుగా రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ దావాఖానా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్, ఆర్ఎంఓ బాలకృష్ణ,గ్రామ అధ్యక్షులు మామూనూరి రాజు,మాజీ సర్పంచ్ అల్లం రఘు నారాయణ,దొమ్మటి మల్లయ్య,బయ్యా మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

చిన్నారుల ఆరోగ్యం.. నులిపురుగుల నివారణ తప్పనిసరి: మాక్సుద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ మాక్సుద్ మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడాలంటే నులిపురుగులను నివారించడం తప్పనిసరి అని, ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సింఫోనియా, వైస్ ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

వైద్య సిబ్బందికి ఘన సన్మానం.

వైద్య సిబ్బందికి ఘన సన్మానం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం భారత రాష్ట్ర సమితి యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య రంగ నిపుణులకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈసందర్భంగా బుదారపు కార్తీక్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుద్ధత పాటించాలని డాక్టర్ల సూచనలేని అనవసరమైన మందులను ఎట్టి పరిస్థితుల్లో వాడ రాదని తమ ఆరోగ్యాల పట్ల ఎవరికి వారు శ్రద్ధ వహించాలని కోరారు. ఈసందర్భంగా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న వైద్య సిబ్బందిని సన్మానిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి వెంకట గ్రీష్మన్య, వెంకటేశ్వర్లు, కొలిపాక కమలాకర్, స్వామి, పురాణం రమేష్, తిరుపతి, నరేందర్, శ్రీధర్, కొమురయ్య, శివశంకర్, నాగరాజు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version