ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్.

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్

◆ విధుల్లో నిర్లక్ష్యం.. కరెంట్ పోయినప్పుడు టార్చ్ లైట్లతో వైద్యం

జహీరాబాద్ నేటి ధాత్రి,:

 

 

 

జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో భద్రత లోపాలు, ఆధునిక వసతుల వినియోగంలో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను అదికారికంగా సస్పెండ్ చేశారు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయిన సమయంలో జన రేటర్ ఉన్న వాడకపోవడంతో పేషెంట్లకు టార్చ్ లైట్ల ద్వారా వైద్యం అందిం చిన దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పత్రికల్లో కథనాలు వెలువడిన వెంటనే సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశే ఖర్ స్వయంగా ఆస్పత్రిని తనిఖీ చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో డాక్టర్ శ్రీదర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గతంలోను డాక్టర్ శ్రీధర్పై పలు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఉద్యో గులు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గుసగుసలాడుతున్నారు. ప్రజల ప్రాణాలు దోహదంగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటువంటి పరిస్థితులు చోటుచేసుకోవడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. ఈ ఘటనపై మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆరోగ్య శాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version