ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన…

ఏరియా హాస్పిటల్ లో రెగ్యులర్ ఉద్యోగుల మౌన ప్రదర్శన

పరకాల నేటిధాత్రి

శుక్రవారంనాడు టివివిపి ఉద్యోగులు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు ట్రెజరరీ ద్వారా గీట్రెజరరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేపట్టారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రతి నెల ఎప్పుడూ జీతం పడుతుందో తెలియని పరిస్తితి ఉందని,ఈ నెల ఇంకా జీతం రాలేదని దసరా పండుగ రోజు కూడా డబ్బులు లేక ఉపవాసం ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రదర్శన లో డాక్టర్ బాలకృష్ణ,డాక్టర్ మౌనిక,నర్సెస్,పారామెడికల్,నాల్గవ తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version